India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☛ మిస్టర్ బీస్ట్- 320M (US) ☛ T సిరీస్ – 276M (IND)
☛ కోకోమెలన్ – 184M (US)
☛ సోనీ ఎంటర్టైన్మెంట్- 178M (IND)
☛ కిడ్స్ డయానా షో – 126M (ఉక్రెయిన్-US)
☛ వ్లాడ్ అండ్ నికి -125M (రష్యా) ☛ లైక్ నాస్త్య- 121M (రష్యా-US)
☛ PewDiePie – 111M (స్వీడన్)
☛ జీ మ్యూజిక్- 111M (IND) ☛ WWE – 104M (US)
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490KM, పుదుచ్చేరికి 500KM, నెల్లూరుకు 590KM దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఈ నెల 17న పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద, ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలానికి ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో రేపు ఉదయం 7 గంటలకు డ్యాం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 5వ సారి గేట్లు ఎత్తనున్నారు. ప్రస్తుతం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీటితో ఔట్ఫ్లో 66,067 క్యూసెక్కులుగా ఉంది.
‘దసరా’తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ను ఫిమేల్ లీడ్గా తీసుకోవాలనుకుంటున్నారని టాలీవుడ్ టాక్. శ్రద్ధ ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ స్త్రీ-2 ఏకంగా రూ.600+ కోట్లు కొల్లగొట్టింది.
ఆస్ట్రేలియాలోని Parkes Telescope గ్రహాంతర జీవుల సంకేతాలను గుర్తించినట్టు NASA ఫిలింమేకర్ సైమన్ హాలండ్ తెలిపారు. దీనిపై వచ్చే నెల కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. Oxford University ఆధ్వర్యంలో యూరి మిల్నర్, మార్క్ జుకర్బర్గ్ సమర్పించిన Breakthrough Listen ప్రాజెక్టులో భాగంగా ఈ విషయాలు వెలుగుచూసినట్టు తెలిపారు. ఈ సమాచారాన్ని జుకర్బర్గ్ ప్రాజెక్ట్ వ్యక్తులు వెల్లడించారన్నారు.
టీ20 వరల్డ్ కప్లో భారత అమ్మాయిలు వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టు సారథిని మార్చాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. ‘యువ కెప్టెన్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపాలనేది నా అభిప్రాయం. అందుకు ఇదే సరైన సమయం. మరో వరల్డ్ కప్ వచ్చేసరికి జట్టు సిద్ధంగా ఉండాలి. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ఇద్దరూ కెప్టెన్సీకి అర్హులే’ అని పేర్కొన్నారు.
రాత్రి పూట భోజనం మానేస్తే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తుంటారు. కానీ భోజనానికి బదులు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేదంటే కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలసట, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తలెత్తుతాయి. పోషకాహార లోపం, నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకే కొంచెమైనా తిని పడుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఇండియా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఏటా 125 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. వేసవికాలంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్లో మూడు నెలల పాటు రూ.20వేల చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పీజీ, మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్నవారు లేదా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘OG’ షూటింగ్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ‘ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ టు క్రియేట్ ది మ్యాడ్నెస్’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ మూవీకీ ‘హరిహర వీరమల్లు’ తరహాలోనే అమరావతిలోనే సెట్స్ వేసి కంప్లీట్ చేస్తారా లేక అవుట్డోర్ షూట్కి పవన్ వెళ్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో అన్నిరకాల ఫర్నీచర్ను ఏర్పాటు చేసుకోలేం. దీనికి పరిష్కారంగా IIT గువాహటికి చెందిన ప్రొ.సుప్రదీప్ దాస్ పరిశోధకుల బృందం స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ను ప్రవేశపెట్టింది. దీన్ని 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. చైర్, టేబుల్, స్టోరేజ్ యూనిట్గా ఉపయోగపడుతుంది. పరిశోధన క్రమంలో దీనికి రూ.35 వేలు ఖర్చైనా, మాస్ ప్రొడక్షన్తో ధర తగ్గుతుందని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.