News April 8, 2024

ఉగ్రవాదులకు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: సీఎం

image

మోదీ నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయన్నారు. ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని విమర్శించారు. ఆ పార్టీ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని ఫైరయ్యారు. మోదీ సర్కారు గత నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని యోగి గుర్తు చేశారు.

News April 8, 2024

ఈ వారం విడుదలయ్యే సినిమాలివే..

image

ఈ వారం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అజయ్ దేవ్‌గన్-ప్రియమణి ‘మైదాన్’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన విజయ్ ఆంటోనీ మూవీ ‘లవ్ గురు’ ఈ నెల 11న థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. విశ్వక్‌సేన్ ‘గామి’ (జీ5), ‘ప్రేమలు’(ఆహా), ‘లాల్ సలామ్’ (సన్ నెక్ట్స్)లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

News April 8, 2024

టీజర్‌కు యూట్యూబ్ షేక్.. ప్రశంసలు కురిపించిన హీరో నాని

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘పుష్ప-2’ సినిమా టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో కేవలం 40 నిమిషాల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈక్రమంలో బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ టీజర్‌ అదిరిపోయిందని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. సుక్కు సార్ మాత్రమే ఇలాంటివి చేయగలరని, బన్నీ మాత్రమే అలా చేయగలరంటూ అభినందించారు. నటి అనసూయ సైతం ప్రశంసలతో ముంచెత్తారు.

News April 8, 2024

మా వాడంటే ఇంత ఓర్వలేని తనమా?: VDK మేనమామ ఫైర్

image

విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై నెగటివ్ ప్రచారంపై అతని మేనమామ యశ్ రంగినేని ఫైరయ్యారు. ‘ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు. ఇంత కసా? ఇంత ఓర్వలేని తనమా? లేక మావోడి కటౌట్ చూసి భయమా? వేరే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి మూవీలకు మాత్రం భూతద్దం పెట్టి వెతుకుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి హీరోగా పెరు తెచ్చుకుంటే తప్పా?’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

News April 8, 2024

ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్: గంభీర్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియాకు ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్. ఆయన స్థాయికి ఎవరూ చేరుకోరని అనుకుంటున్నా. 3 ఐసీసీ ట్రోఫీలు అందించడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నారు.

News April 8, 2024

BIG BREAKING: జనసేనకు బిగ్ షాక్

image

AP: ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ ఇన్‌ఛార్జ్ పోతిన మహేశ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపించారు. విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి కేటాయించడంతో ఆయన కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు.

News April 8, 2024

హ్యాపీ బర్త్ డే బావ: జూ.ఎన్టీఆర్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే బావ. ఈ ఏడాదీ మీరు సంతోషంగా ఉండాలని, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఐకాన్ స్టార్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

News April 8, 2024

రూ.400లక్షల కోట్లకు BSE!

image

బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజీలో లిస్ట్ అయిన సంస్థల విలువ రూ.400లక్షల కోట్లకు చేరింది. బ్లూ చిప్ సంస్థలు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రాణించడం కలిసొచ్చింది. 2014లో రూ.100లక్షల కోట్ల మార్క్‌ను తాకిన BSE, 2021 FEBలో రూ.200లక్షల కోట్లు, 2023 జులైలో రూ.300లక్షల కోట్లకు చేరింది. 2023 APR నుంచి ఇప్పటివరకు రూ.145లక్షల కోట్లు పెరిగింది. మరోవైపు నేడు సెన్సెక్స్ 74,673కు చేరి సరికొత్త గరిష్ఠాన్ని తాకింది.

News April 8, 2024

‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్!

image

మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు షూటింగ్‌లో పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా కీలక సన్నివేశాలను న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది.

News April 8, 2024

పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలి: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలోని 1.65 లక్షల క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. క్వింటా రూ.6,760 ధరతో 25 శాతం పంటనే కొనుగోలు చేయడంతో మిగతా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తాము అధికారంలో ఉండగా చివరి గింజ వరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు.