India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవసరమన్నారు. మెరుగైన సేవలు అందించేలా 7 నుంచి 8 వేల మంది నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైమరీ ఆస్పత్రుల్లో 28.96%, జిల్లా ఆస్పత్రుల్లో 14.51%, మిగతా చోట్ల 63.40% సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.

UPలో జరగనున్న మహా కుంభమేళాకు యాపిల్ కోఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ జాబ్స్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వామి కైలాషానంద మహారాజ్ వెల్లడించారు. ‘ఆమె మాకు కూతురులాంటిది. కమల అనే పేరు పెట్టాం. లారెన్ ఇక్కడకు రావడం రెండోసారి. వ్యక్తిగత ప్రోగ్రాం కోసం దేశానికి వస్తున్న ఆమె కుంభమేళాలో ధ్యానం చేస్తారు. తన గురువును కలుస్తారు. ఆమెను ఊరేగింపులోనూ చేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.

AP: 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు.

సంక్రాంతికి ఊరెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదు. బీరువా తాళాలు, నగదు, నగలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. ఇంటికి తాళం వేసినట్లు కనిపించకుండా కర్టెన్ తొడగాలి. CC కెమెరాలు బిగించుకోవాలి. ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దు. ఇంటి ముందు తెలిసినవారితో చెత్త శుభ్రం చేయించుకోవాలి. కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలి.

TG: జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నట్లు CM రేవంత్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. సాగుయోగ్యమైన ప్రతీ ఎకరాకి రైతుభరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకున్నా నగదు చెల్లిస్తామన్నారు. అనర్హులకు రైతుభరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి స్థిరాస్తి, లే ఔట్లు, నాలా కన్వర్షన్ అయిన, మైనింగ్, ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు.

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడా. నా వ్యాఖ్యలను పవన్కు ఆపాదించడం భావ్యం కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే భక్తులు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.

AP పాఠశాలల స్ట్రక్చర్ను మారుస్తూ గత ప్రభుత్వం జారీచేసిన GO 117ను ఉపసంహరించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. అంతకు ముందున్న విధానాన్నే స్వల్ప మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (pp1 pp2), ఫౌండేషనల్ స్కూల్ (pp1, pp2, 1, 2) బేసిక్ ప్రైమరీ(1-5), మోడల్ ప్రైమరీ(pp1, pp2, 1-5), హైస్కూల్ (6-10) విధానంలో స్కూళ్లు ఉంటాయి. విధివిధానాలపై విద్యాశాఖ మెమో జారీచేసింది.

బాసిల్ జోసెఫ్, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ రేపు ఓటీటీలోకి రానుంది. డిస్నీ+హాట్స్టార్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలై దాదాపు రూ.60కోట్ల కలెక్షన్లను సాధించింది. ఎంసీ జతిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు IMDbలో 8.1 రేటింగ్ ఉంది.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తాను కలిసి ఉన్న ‘మెలోడీ’ మీమ్స్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘అది ఎప్పుడూ జరిగేదే. దాని గురించి ఆలోచించి నా సమయం వృథా చేసుకోను’ అని ఆయన చెప్పారు. WTF సిరీస్లో భాగంగా జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్లో మోదీ మాట్లాడారు. అలాగే తన చిన్నప్పుడు ఇంట్లో వారి బట్టలన్నీ తానే ఉతికేవాడినని చెప్పారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్, బ్యాడ్ న్యూస్ అందనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ పోస్టర్ను మేకర్స్ విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు ఈ చిత్ర విడుదలను ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేస్తున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.