India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు వస్తుండటంపై వివరణ తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపుపైనా చర్చిస్తారని, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారని సమాచారం.
TG: రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ దేశాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు. దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి CM రేవంత్ చేసిన కృషి అభినందనీయం. కలాం జయంతి రోజున ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది’ అని దామగుండంలో రాడార్ స్టేషన్కు శంకుస్థాపన అనంతరం వ్యాఖ్యానించారు.
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రోహిత్ ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారు. ‘ఆస్ట్రేలియా సిరీస్కు షమీని తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే అతని మోకాళ్లలో వాపు వచ్చింది. ప్రస్తుతం NCAలో వైద్యులు, ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాడు. కోలుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు’ అని చెప్పారు.
కస్టమర్ల ప్రవర్తనతో విసిగిపోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కారులో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ వైరలవుతోంది. ‘నువ్వు క్యాబ్ ఓనర్ కాదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఈ క్యాబ్ ఓనర్. కాబట్టి ఆయనతో గౌరవంగా, మర్యాదగా మాట్లాడండి. కారు డోర్ను జాగ్రత్తగా క్లోజ్ చేయండి. మీరు మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. మీ యాటిట్యూడ్ను మీ జేబులో పెట్టుకోండి. భయ్యా అని పిలవకండి. వేగంగా వెళ్లాలని చెప్పకండి’ అని పోస్టర్లో రాసుంది.
AP: టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసుల్ని CIDకి బదిలీ చేశామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు ఉందని చెప్పారు. ‘తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోసమే స్పెషల్ టీమ్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు AP పోలీసులు, ఇద్దరు CBI, ఒక FSSAI అధికారి ఉంటారు. దీంట్లో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదు’ అని అన్నారు.
కలెక్షన్లలో ‘దేవర’ మూవీ మరో ఘనత సాధించింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 18రోజుల పాటు కనీసం రూ.కోటి చొప్పున వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని పేర్కొన్నాయి. ఇటు సీడెడ్లో కలెక్షన్లు రూ.30 కోట్లు దాటాయి. దీంతో ఆ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన 2 సినిమాలు ఉన్న వ్యక్తిగా NTR నిలిచారు. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.510 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలున్నాయి. వీటిని జోడిస్తే వచ్చే అతిపెద్ద పదంలో 45 అక్షరాలుంటాయి. డిక్షనరీ ప్రకారం ‘Pneumonoultramicroscopicsilicovolcanoconiosis’ అనే పదం ఆంగ్లంలో అతిపెద్దది. ఈ పదం ధూళిని పీల్చడం వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధిని సూచిస్తుంది. కాగా, I, a, o అక్షరాలను ఆంగ్లంలో అతి చిన్న పదాలుగా చెబుతుంటారు. on, if లాంటి 2-అక్షరాల పదాలు కూడా చాలా ఉన్నాయి.
అమెరికాలో ఎగ్ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమవ్వడమే ఇందుకు కారణం. US FDA సీరియస్ రికాల్ ప్రకటనతో 40 లక్షలకు పైగా ఎగ్స్ను స్టోర్ల నుంచి మిలో పౌల్ట్రీ ఫామ్స్ వెనక్కి తీసుకుంటోంది. మిచిగన్, విస్కన్సిన్, ఇల్లినాయిస్లో రికాల్ ప్రభావం ఎక్కువగా ఉంది. USలోని 9 స్టేట్స్లో సాల్మొనెల్లా ఔట్బ్రేక్తో 65 మంది అనారోగ్యం బారిన పడటంతో CDCP ఫుడ్సేఫ్టీ అలర్ట్ ఇచ్చింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు గంటల ముందు పాలకపక్షం వేగంగా పెండింగ్ సంతకాలు క్లియర్ చేస్తోంది. తమ శాఖల్లోని దస్త్రాలకు ఆమోద ముద్రలు వేసే పనిలో మంత్రులు బిజీగా ఉన్నారు. అటు రెండ్రోజులుగా చాలా పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు మంత్రాలయ సమాచారం. మరోవైపు ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న 12 MLC పోస్టుల్లో గవర్నర్ రాధాకృష్ణన్ గత రాత్రి ఏడుగురిని నామినేట్ చేశారు. కాసేపట్లో వీరు ప్రమాణం చేయనున్నారు.
బిర్యానీ తింటూ కూల్డ్రింక్ తాగితే ఆ మజానే వేరు కదూ. తాగేటప్పుడు బాగున్నా తర్వాత జరిగే పరిణామాలు అనారోగ్యానికి దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘బిర్యానీతో డ్రింక్ తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి గుండెలో మంటగా ఉంటుంది. షుగర్ ఉన్నవారికి మరింత ప్రమాదకరం. కూల్ డ్రింక్స్లో అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది’ అని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.