India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. చివరి 5 సెషన్లలోనే FPIలు రూ.20,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ డబ్బును ఎక్కువగా చైనా స్టాక్స్, US బాండ్స్, బిట్కాయిన్లలో పెడుతున్నారు. భారత స్టాక్స్ విలువలు గణనీయంగా పెరగడం, ప్రస్తుతం కన్సాలిడేషన్ దశకు చేరుకోవడం, చైనాలో స్టిములేషన్ స్కీమ్స్ అమలు ఇందుకు కారణాలు. Q3 రిజల్ట్స్ టైమ్లోFPIలు మళ్లీ తిరిగొస్తారని నిపుణుల అంచనా.
TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని KTR డిమాండ్ చేశారు. అది కాంగ్రెస్ ఎన్నికల హామీ అని, దాన్ని నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకుందని విమర్శించారు. బ్యాంకుల్లో డబ్బెంత ఉంది? ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? టీవీ ఉందా? అని అడగడమేంటని ప్రశ్నించారు. కులగణన అంటున్నారు కానీ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదని మండిపడ్డారు.
AP: కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కడప(D) చిట్వేల్(M)లోని గుండాలకోన ఒకటి. విశ్వామిత్రుడు ఇక్కడ గుండాలేశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. గుహలో ఎండ్రకాయ రూపంలో ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గుండాలకోన వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి 9కి.మీ అడవి బాటలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
‘క’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం, దర్శకులు సుజిత్-సందీప్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ ట్వీట్ చేశారు. ‘బాస్ నుంచి అభినందనలు. గంటకుపైగా గుర్తుండిపోయే సంభాషణకు అవకాశమిచ్చిన మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఓ ఆశీర్వాదంగా భావిస్తాను’ అని రాసుకొచ్చారు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీని కూడా చిరు అభినందించిన సంగతి తెలిసిందే.
కేంద్రం అమలు చేస్తోన్న ‘పీఎం ఇంటర్న్షిప్’ స్కీమ్కు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. <
TG: 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన తమను వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు. మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాము అధికారంలోకి రాగానే 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన వారిని 48 గంటల్లోనే సొంత జిల్లాలకు పంపిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
AP: వచ్చే నెలలో ఎర్ర చందనం వేలం వేస్తామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని చెప్పారు. గుంటూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘స్మగ్లర్ల బారి నుంచి అడవులను రక్షిస్తాం. ఈ విషయంలో అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటవీ శాఖకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మహిళల సంరక్షణే మా మొదటి బాధ్యత. విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాం’ అని ఆయన పేర్కొన్నారు.
కోల్ ఇండియా లిమిటెడ్(CIL)లో 640 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&T, సిస్టమ్ విభాగాల్లో 60% మార్కులతో బీటెక్ పాసైన వారు అర్హులు. వయసు 30-09-2024 నాటికి 30ఏళ్లు మించకూడదు. గేట్-2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం ₹50,000-1,60,000 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
వెబ్సైట్: www.coalindia.in
పాలమూరు జిల్లాకు నిధుల వరద పారిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘నా జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. KCRను పార్లమెంట్కు పంపింది ఇక్కడి ప్రజలే. కానీ ఇక్కడి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుంటే మేం అడ్డుపడలేదు. KCR పాలనలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు. త్వరలో మక్తల్-NRPT ప్రాజెక్టు చేపడతాం’ అని అమ్మాపురం సభలో ప్రకటించారు.
బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్తో ఆమెకు సయోధ్య ఉండగా యూనస్కు విరోధం ఉంది. పైగా అతడిని చీఫ్ అడ్వైజర్గా ఎంపికచేసింది డెమోక్రాట్లు, డీప్స్టేట్ అన్న ఆరోపణలూ ఉన్నాయి. మొన్న బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్కు రావడం, యూనస్పై ICCలో ఫిర్యాదు, మైనార్టీలు, అవామీ లీగ్-విద్యార్థి ఉద్యమకారుల మధ్య పోటీ నిరసనలతో సందిగ్ధం నెలకొంది.
Sorry, no posts matched your criteria.