News September 12, 2025

పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

image

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.

News September 12, 2025

CAT-2025: దరఖాస్తుకు ఒక్కరోజే ఛాన్స్

image

మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT)-2025 దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ. డిగ్రీ పాసైన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న రిలీజ్ చేస్తారు. NOV 30న పరీక్ష, 2026, JAN మొదటి వారంలో ఫలితాలు విడుదలవుతాయి. క్యాట్ స్కోరు ఆధారంగా IIM, IIT, NITల్లో MBA, పీహెచ్‌డీ, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు.
వెబ్‌సైట్: <>https://iimcat.ac.in/<<>>

News September 12, 2025

సాయిశ్రీనివాస్ ‘కిష్కింధపురి’ రివ్యూ&రేటింగ్

image

దెయ్యం నుంచి చిన్నారిని రక్షించేందుకు హీరో చేసే సాహసమే ‘కిష్కింధపురి’. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ నటన ఆకట్టుకుంది. భయపెట్టే సీన్లు, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎఫెక్ట్స్ మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. కొన్నిసీన్లు రొటీన్ హారర్ మూవీని తలపిస్తాయి. లాజిక్‌లు లేకపోవడం, అక్కడక్కడా కన్‌ఫ్యూజన్, క్లైమాక్స్ వరకు మూవీని సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ కౌశిక్ గాడితప్పారు.
రేటింగ్: 2.25/5

News September 12, 2025

పాలలో వెన్న శాతం పెరగాలంటే..

image

పాల కేంద్రాల్లో వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న ఎక్కువగా 6%-8%, దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4-4.5%, సంకర జాతి పాడి పశువుల పాలలో 3-4% వెన్న ఉంటుంది. పప్పుజాతి పశుగ్రాసాలను, గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను, జొన్నచొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండు గడ్డిగా పశువులకు అందించాలి. ఇవి లేనప్పుడు ఎండు వరిగడ్డిని పశువుకు మేతగా ఇస్తే పాలలో వెన్నశాతం తగ్గదు.

News September 12, 2025

నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్?

image

ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కానున్నారు.

News September 12, 2025

సరస్వతీ దేవి రూపం ఎందుకు విశిష్టమైనది?

image

చదువుల తల్లి సరస్వతీ దేవి జ్ఞానం, కళలు, ధ్యానాలకు ప్రతీక. ఆమె చేతిలో ఉండే వీణ సంగీతం, సృజనాత్మకతను సూచిస్తే, పుస్తకం మేధో జ్ఞానానికి సంకేతం. జపమాల ధ్యానాన్ని, ఏకాగ్రతను సూచిస్తుంది. ఈ మూడు అంశాలు కలిసినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. ఆమె వాహనం హంస. ఇది విచక్షణా శక్తికి ప్రతీక. ఇది మంచి చెడులను వేరుచేసి, సరైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ రూపం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దర్పణం.

News September 12, 2025

నేడు ఇలా చేస్తే పితృశాపాలు తొలగిపోతాయి

image

నేడు మహాభరణి. ఇది పితృపక్షంలో భరణి నక్షత్రం రోజున వస్తుంది. ఈరోజున పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం చేయడం వల్ల వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పితృదోషాలు తొలగి, ఐశ్వర్యం, దీర్ఘాయువు ప్రాప్తిస్తాయి. నేడు యమదీపం వెలిగించడం శుభప్రదం. అన్నదానం, ఆవు నెయ్యి కలిపిన నల్ల నువ్వుల అన్నాన్ని కాకులకు పెట్టడం ద్వారా పితృశాపాలు తొలగిపోతాయి. వారి అనుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.

News September 12, 2025

తులసి చెట్టు ఏ దిక్కున ఉండాలి?

image

‘తులసి’ అత్యంత పవిత్రమైనది. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిక్కులలో తులసిని నాటితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పితృదేవతల దిక్కు కాబట్టి దక్షిణ దిశలో నాటకూడదు. మంగళ, శుక్రవారాల్లో ఆకులను కోయకూడదు. తులసి మండపం వద్ద రోజూ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

News September 12, 2025

768 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

image

* భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌‌లో 515 ఆర్టిసన్ గ్రేడ్-4 ఉద్యోగాలు. అర్హత టెన్త్
* బెంగళూరులోని BEMLలో 100 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు. అర్హత డిగ్రీ
* HYDలోని BELలో 80 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు. అర్హత బీఈ, బీటెక్, బీఎస్సీ
* BEMLలో 46 సర్వీస్ పర్సనల్ జాబ్స్. అర్హత ITI
* BEMLలో 27 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అర్హత డిగ్రీ, PG, MBA, CA/CMA

News September 12, 2025

350 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పుణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ కేటగిరీల్లో 350 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.1,180(SC / ST / PwBDలకు రూ.118). పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిగ్రీ, లా డిగ్రీ, ఉగ్యోగానుభవం ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>https://bankofmaharashtra.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.