News July 8, 2025

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

image

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 8, 2025

జన సమీకరణకు ప్రయత్నిస్తే కేసులు: ఎస్పీ

image

AP: చిత్తూరు(D) బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో SP మణికంఠ చందోలు YCP నేతలను హెచ్చరించారు. ‘ఇది రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొందరు జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేశాం’ అని వివరించారు. కాగా జగన్ టూర్‌లో 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.

News July 8, 2025

ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే?

image

అప్పుడే పుట్టిన పిల్లలతో పోల్చితే వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయాలు తగ్గుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులకు (0-3 నెలలు) రోజుకు 14-17 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అదే టీనేజర్లు (14-17ఏళ్లు) 8-10 గంటలు, యువకులు(18-25) 7-9 గంటలు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు 7-8 గంటలు నిద్రపోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. మీరు ఎంత సేపు నిద్రపోతున్నారు? COMMENT

News July 8, 2025

భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు

image

TG: ఇద్దరు భార్యల చేతిలో ఓ భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. లింగాలఘణపురం(M) పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్య(30)కు భార్యలు శిరీష, గౌరమ్మ(అక్కాచెల్లెళ్లు) ఉన్నారు. ఇటీవల వారి తల్లిని కనకయ్య చంపేశాడు. అప్పటి నుంచి భార్యలు పుట్టింట్లోనే ఉన్నారు. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలంటూ వారిని బెదిరించడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు భార్యలు కనకయ్యను గొడ్డలితో నరికి చంపారు.

News July 8, 2025

ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు: లోకేశ్

image

AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణమన్నారు. ‘YCP నేతలకు మ‌హిళలంటే ఇంత ద్వేష‌భావ‌మా? త‌ల్లి, చెల్లిని త‌రిమేసిన జ‌గ‌న్‌ గారిని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టున్నారు. మ‌హిళ‌ల జోలికి వస్తే ఊరుకునేందుకు ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు.. మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచే ప్ర‌జాప్ర‌భుత్వం’ అని వ్యాఖ్యానించారు.

News July 8, 2025

ఫోర్త్ సిటీ: దేశంలో అతిపెద్ద స్టేడియం!

image

TG: CM రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో భాగ్యనగర ఇబ్బందులు లేకుండా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత MGBS-చాంద్రాయణగుట్ట మెట్రో రూట్‌ను అక్కడి నుంచి ఫోర్త్ సిటీకి విస్తరించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త నగరంలో స్పోర్ట్స్ హబ్ ఉంటుందని CM ఇప్పటికే ప్రకటించగా, ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మిస్తారని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.

News July 8, 2025

కేటీఆర్ సెకండ్ బెంచ్ స్టూడెంట్: జగ్గారెడ్డి

image

TG: తమకున్న అనుభవాల ముందు KTR జీరో అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. KTR సెకండ్ బెంచ్ స్టూడెంట్. తన తండ్రి ఎమ్మెల్యే సీటు ఇస్తే డైరెక్ట్‌గా గెలిచారు. కేటీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటే పది మాటలు అంటాం. అనడం మానేస్తే మేమూ మానేస్తాం’ అని స్పష్టం చేశారు.

News July 8, 2025

AP NEWS ROUNDUP

image

* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా పరిధిలోనే అని CM చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
* విశాఖలో ఇన్నోవేషన్ క్యాంపస్‌ స్థాపనకు ANSR సంస్థతో ఒప్పందం కుదిరిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
* YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డిపై MLA ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ప్రపంచంలోనే AP లిక్కర్ స్కాం అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

News July 8, 2025

జీరో కేలరీలు ఉండే షుగర్ మొక్క.. ఇంట్లోనే పెంచుకోవచ్చు!

image

షుగర్‌ కంటే దాదాపు 300రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉండే మొక్క ఒకటుంది. అదే ‘స్టీవియా రెబౌడియానా’. దీని ఆకుల నుంచి స్టీవియాను(స్వీట్నర్) తీస్తారు. ‘స్వీట్ లీఫ్’ అని పిలిచే వీటి ఆకులలో స్టీవియోసైడ్ & రెబౌడియోసైడ్ వంటి సమ్మేళనాలు అధిక తీపిని కలిగి ఉంటాయి. ఇందులో కేలరీలు ఉండవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో దీనిని వాడుతుంటారు. నర్సరీ/ఆన్‌లైన్‌లో లభించే వీటిని ఇళ్లలోనూ పెంచుకోవచ్చు.

News July 8, 2025

నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే కారణం: NDMA

image

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కారణాలపై అధ్యయనం చేశారు. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మరణించిన విషయం తెలిసిందే. ఘటన జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.