News April 1, 2024

6 నుంచి సమ్మెటివ్ ఎగ్జామ్స్

image

AP: ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతులు, ప్రైవేటులో 6-9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతి ఆధారిత మదింపు(CBA) ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీనికి ప్రశ్నపత్రంతో పాటు OMR షీట్ కూడా ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలలకు క్వశ్చన్ పేపర్ మాత్రమే అందిస్తారు.

News April 1, 2024

యాక్షన్ సీన్స్‌ చిత్రీకరణలో ‘విశ్వంభర’

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మల్లిడి వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇది ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ అని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.

News April 1, 2024

ఈ ఇన్సింగ్స్ జీవితాంతం గుర్తుండిపోతుంది: గంగూలీ

image

నిన్నటి మ్యాచులో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శనపై ఆ జట్టు డైరెక్టర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘రిషభ్ అద్భుతంగా ఆడావు. ఈ ఇన్నింగ్స్ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నీవు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా ఇది నీకు ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్ నిన్నటి మ్యాచులో అర్ధసెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

News April 1, 2024

9,144 రైల్వే ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

రైల్వే శాఖ విడుదల చేసిన 9,144 ఉద్యోగాలకు అప్లై చేసేందుకు గడువు ఈ నెల 8తో ముగియనుంది. టెక్నీషియన్ గ్రేడ్-1 1,092, గ్రేడ్-3 8,052 పోస్టులు ఖాళీలున్నాయి. బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటర్, టెన్త్, పాలిటెక్నిక్ చేసిన వారు అర్హులు. రీజియన్ల వారీగా పోస్టులు, వయో పరిమితి, ఇతర వివరాల కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్‌ను https://indianrailways.gov.in సంప్రదించాలి.

News April 1, 2024

సమాచారం ఇవ్వని ‘గమ్యం’!

image

ప్రయాణికులు తాము ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుంది, ఎంత సమయం పడుతుందనే సమాచారం తెలుసుకునేందుకు TSRTC గమ్యం యాప్ తీసుకొచ్చింది. యాప్ వచ్చి 8నెలలవుతున్నా చాలామందికి దీంతో సమాచారం అందడం లేదు. బస్సులో ఉండే చిప్‌లో సిబ్బంది సర్వీస్ వివరాలు నమోదు చేయకనే ఈ యాప్ పూర్తి స్థాయిలో సేవలందించడం లేదట. సాధారణంగా బస్సు డిపో నుంచి బయలుదేరేటప్పుడు చిప్‌లో ఆ బస్సు తిరిగే రూట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

News April 1, 2024

కవితకు ఊరట దక్కుతుందా? తీర్పుపై ఉత్కంఠ

image

TG: BRS MLC కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారించనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇవాళ ఈ పిటిషన్ విచారించనున్న న్యాయస్థానం.. ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

News April 1, 2024

‘హోమ్‌గ్రౌండ్‌’ జట్లదే హవా

image

ఐపీఎల్-2024లో హోమ్ గ్రౌండ్ జట్లు విజయదుందుభి మోగిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తవగా.. ఆర్సీబీ మినహా అన్ని జట్లూ హోమ్ గ్రౌండ్‌లో విజయం సాధించాయి. మార్చి 29న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డపై ఆర్సీబీ ఓటమిపాలైంది. CSK చెన్నైలో రెండు విజయాలు నమోదు చేయగా నిన్న తొలి ఓటమిని చవిచూసింది. ఇక తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీకి నిన్న హోమ్ గ్రౌండ్‌లో తొలి విజయం దక్కింది.

News April 1, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,224 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,093 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News April 1, 2024

దాహంతో అల్లాడాల్సిందేనా?

image

బెంగళూరు నీటి కష్టాలు దేశంలోని ఇతర నగరాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. దేశంలో 2030నాటికి 40% ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతి ఆయోగ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2050కల్లా ఢిల్లీ, ముంబై, లక్నో, HYD, విశాఖపట్నంతో సహా డజనుకుపైగా నగరాల్లోని ప్రజలు దాహంతో అల్లాడక తప్పదని వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక హెచ్చరిస్తోంది. ఇండో-గంగా బేసిన్‌లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయని UN సైతం పేర్కొంది.

News April 1, 2024

కచ్చతీవు ద్వీపం వ్యవహారం ఏంటి?

image

ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై విరుచుకుపడ్డారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. అప్పగింతకు ముందు 1968లోనే ఈ భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన శ్రీలంక ప్రధానితో ఇందిర మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపింది. అలా 285ఎకరాల ద్వీపాన్ని సముద్ర ఒప్పందం కింద అప్పగించడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.