India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విశాఖ రుషికొండ బీచ్ ప్రతిష్ఠాత్మక బ్లూఫ్లాగ్ హోదా కోల్పోయింది. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో తాత్కాలికంగా ఆ హోదా రద్దయ్యింది. దీంతో పర్యాటకంగా రాష్ట్ర పరువు పోయిందని ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. బీచ్ నిర్వహణ ఆధారంగా డెన్మార్క్ సంస్థ బ్లూఫ్లాగ్ ఇస్తుంది. ఆ బీచ్లకే విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతారు. 2020 నుంచి రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ హోదా ఉండేది.

TG: SLBC టన్నెల్ వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఆర్థిక అవకతవకల వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధవీపురి బుచ్, మరో ఐదుగురిపై FIR నమోదు చేయాలని ముంబై ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆమె పదవిలో ఉండగా రెగ్యులేటరీ ఉల్లంఘనలు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగాయంటూ ఓ జర్నలిస్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు చేసి 30 రోజుల్లో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి మృతదేహాలు బయటకు తీసుకొచ్చే వరకు పనులు ఆపొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్క్యూ టీమ్స్ను కోరారు. సహాయక బృందాలకు అధికారులు అన్ని విధాలా సహకరించాలని ఆదేశించారు. SLBC ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్లో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.

ట్రెడ్మిల్, కారిడార్ల కంటే ప్రకృతి ప్రదేశాల్లో వాకింగ్తో అధిక లాభాలుంటాయని ఫిజియాలజిస్ట్ మెక్ డోవెల్ తెలిపారు. పచ్చికలు, బీచ్, కొండ శివార్లు తదితర నేచర్ సహిత ప్రదేశాల్లో నడకతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందట. నరాల-కండరాల సమన్వయం పెరగడంతో పాటు ఒత్తిడి పెంచే కార్టిసాల్ అదుపులోకి వచ్చి, ఎండార్ఫిన్ ఉత్తేజం అవుతుందన్నారు. ఉదయం గం.5:30-8:00, సాయంత్రం గం.4:30-7:00 మధ్య వాక్ మంచి ఫలితాలు ఇస్తుందట.

AP: అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. సరస్వతి(32) అనే మహిళ అక్కడిక్కడే మరణించగా, ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తినకు బయల్దేరనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అనంతరం AICC పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది.

AP: సాగు, తాగు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై కూటమి ప్రభుత్వం పగ పట్టిందని YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి నిధులు కేటాయించకుండా మంత్రి నిమ్మల మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే వెలిగొండ కోసం పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని, విషం చిమ్మే నేత అని ఘాటు విమర్శలు చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 249/9 స్కోర్ చేసింది. శ్రేయస్ (79), హార్దిక్ (45), అక్షర్ (42) రాణించారు. రోహిత్(15), గిల్ (2), కోహ్లీ(11), రాహుల్ (23), జడేజా(16) నిరాశపరిచారు. NZ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే NZ 50 ఓవర్లలో 250 రన్స్ చేయాలి.

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టైలరింగ్లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో BC, EWS, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఇందు కోసం ఎంపిక చేయనున్నారు. BC వెల్ఫేర్ నుంచి 46,044, EWS నుంచి 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.