India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: NDA శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని కోరారు. తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరూ ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చవద్దని సూచించారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఆయా చోట్ల ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించనుంది. కరీంనగర్ కార్పొరేషన్ పదవీకాలం ఎల్లుండితో పూర్తి కానుంది. ఏ ప్రాంతానికి ఎవరు అధికారిగా ఉన్నారో ఇక్కడ <

TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఇతర నేతలు, అధికారులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ గ్రహీత డా.నాగేశ్వర్ రెడ్డి రాగా సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.

UPలోని నోయిడాకు చెందిన సరస్వతి భాటీ 10వ తరగతి ఫెయిలయ్యారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. ఆ వెంటనే ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు. కానీ ఏదో సాధించాలన్న పట్టుదల. శానిటరీ న్యాప్కిన్స్ మార్కెట్లో ఎక్కువ ధర ఉంటుండటం, ఊళ్లో మహిళలు బట్ట న్యాప్కిన్లను వాడటం గుర్తించిన ఆమె, స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి ప్యాడ్స్ తయారీ ప్రారంభించారు. ఇప్పుడు నెలకు రూ.30వేల విలువైన ప్యాడ్స్ను అమ్ముతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

AP: సత్యసాయి(D) సికేపల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందని విషయంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు వార్డెన్, సంబంధిత ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం వండలేదని తెలియడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే భోజనం సమకూర్చినట్లు ఫోన్ చేసిన సీఎంకు కలెక్టర్ వివరించారు. పూర్తిస్థాయిలో విచారించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని CM ఆదేశించారు.

TG: కొత్త పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమేనని <<15268566>>KTRకు<<>> డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున లాంఛనంగా పథకాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. BRS హయాంలో నిధులు అందుబాటులో ఉన్నా పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పేదలను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలు తాము తీసుకుంటామని చెప్పారు.

AP: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరినీ ఈ శకటం ఆకట్టుకుంది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. శకటంలో భాగస్వాములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో డేటింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని భారత బౌలర్ సిరాజ్ ఒక్క పోస్టుతో తిప్పికొట్టారు. తమ ఇద్దరిది అన్నాచెల్లెళ్ల బంధం అని అర్థం వచ్చేలా ఓ పోస్టు చేశారు. ‘నా ప్రియమైన సోదరుడా’ అని జనై పోస్టు చేయగా దానిని ట్యాగ్ చేస్తూ ‘హమ్ తుమ్హారే హై సనమ్’ సినిమాలోని ‘తారోంకా చమక్తా’ పాట లిరిక్స్ను పంచుకున్నారు. ఈ పాట అన్నాచెల్లెళ్ల బంధాన్ని తెలియజేస్తూ సాగుతుంది.

కరోనా సమయంలో ప్రపంచానికి తరచూ పలు హెచ్చరికలు, సూచనలు చేసి పేరొందిన ఆ దేశ మాజీ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీకి ట్రంప్ సర్కారు భద్రతను తొలగించింది. ఆయన తన భద్రతను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వానికి పనిచేసినంత మాత్రాన జీవితమంతా భద్రత ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కాగా.. కరోనా సమయం నుంచీ ట్రంప్ ఫౌచీని వ్యతిరేకిస్తున్నారు.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో 4,597 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 66 విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫార్మసిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Sorry, no posts matched your criteria.