India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించానని సీఎం ట్వీట్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సమాలోచనలు చేశామన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

APకి ఏ లోటు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయమైందని, కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్లకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్కు ఎలాంటి గాయం కాలేదని, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. కాగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయమైందని, ఇటలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి.

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అంతగా రాణించట్లేదు. అతడి రికార్డులు 2023 వన్డే WC సెమీఫైనల్లో 1/56, ఫైనల్లో 0/56, 2024 టీ20 WC సెమీఫైనల్లో 3/19, ఫైనల్లో 0/45, CT-2025 సెమీఫైనల్లో 0/44గా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కుల్దీప్ స్థానంలో అర్ష్దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

హైదరాబాద్ ORRపై జరిగిన కారు ప్రమాదపు ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో మారుతి సుజుకీ బ్రెజా కారు నుజ్జునుజ్జయి ఇద్దరు చనిపోయారు. ఈ మోడల్ కారు 5కు 4 Global NCAP rating సాధించినా ఇంతలా డ్యామేజ్ అవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. మైలేజీ కోసం చూసుకుని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కంపెనీ సైతం వినియోగదారుల ప్రాణాలను లెక్కచేయట్లేదని విమర్శలొస్తున్నాయి.

CTలో విఫలమైన పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ను విమర్శించిన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్పై ఆయన తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2024 ICC T20 టీమ్లో ఉన్న ప్లేయర్ను నేషనల్ T20 జట్టు నుంచి తొలగించారు. PSLలో రాణించి అతడు కమ్బ్యాక్ ఇస్తాడు. అతడిని విమర్శించే మాజీ క్రికెటర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నా. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు తట్టుకోలేరు’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి <<15652905>>రన్యారావు<<>> తండ్రి రామచంద్రరావు (DGP) కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ CMDగా ఉన్నారు. 2014లో ఈయన IGPగా ఉన్నప్పుడు కేరళకు వెళ్తున్న బస్సును మైసూరు దగ్గర ఆపి రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే అందులో రూ.2.27 కోట్లు ఉన్నాయని, పోలీసులు డబ్బును పక్కదారి పట్టించారని ఆ వ్యాపారులు వెల్లడించారు. ఈ కేసును సీఐడీ విచారించింది. కొన్ని రోజులకు ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చారు.

H4 వీసా కింద మైనర్లుగా అమెరికాకు వలసవెళ్లిన భారతీయులు భయం భయంగా బతుకుతున్నారు. వారికి 21 ఏళ్లు వస్తుండటమే ఇందుకు కారణం. H1B వీసా కలిగిన తల్లిదండ్రుల వద్ద వారు ఇకపై డిపెండెంట్లుగా ఉండలేరు. సాధారణంగా H4 నుంచి ఇతర వీసాలు పొందేందుకు గతంలో రెండేళ్ల గడువు ఉండేది. ఇప్పుడా విధానం రద్దు చేశారు. FY26 H1B వీసా ప్రక్రియకు కేవలం 17 రోజులే టైమిచ్చారు. దీంతో యువత UK, కెనడా వంటి దేశాలకు వెళ్లాలని భావిస్తోంది.

CTలో IND తన మ్యాచులన్నీ దుబాయ్లోనే ఆడటం అడ్వాంటేజ్గా మారిందని పేసర్ షమీ అన్నారు. ‘ఒకే గ్రౌండ్లో ఆడుతుండటం మాకు హెల్ప్ అవుతోంది. పిచ్ కండిషన్స్, బిహేవియర్ గురించి తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఈ అంశంపై గంభీర్, రోహిత్ భిన్నంగా స్పందించారు. పిచ్ కండిషన్స్ ప్రతీ మ్యాచుకు మారుతున్నాయని, తాము ప్రాక్టీస్ చేసే ICC అకాడమీ, మ్యాచ్ ఆడే దుబాయ్ గ్రౌండ్ పిచ్లు డిఫరెంట్ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.