India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ నియంత్రణ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. DGP అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో న్యాయ, శిశు, మైనార్టీ, సామాజిక శాఖల సెక్రటరీలు, హోంశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. లవ్ జిహాద్ను అరికట్టడానికి ఏం చేయాలన్నదానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నా ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత వారం కేజీ చికెన్ రూ.220-240 ఉండగా, ఇప్పుడు రూ.200-220 పలుకుతోంది. HYD, విశాఖలో స్కిన్ లెస్ కేజీ రూ.200, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 ఉంది. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని, సోకని కోడి మాంసాన్ని 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.

TG: ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన <<15476388>>తొక్కిసలాట ఘటనలో<<>> మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో రద్దీ నియంత్రణకు మెరుగైన వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో HYD ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ‘సతీ అనసూయ’ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. ‘మనదేశం’ సినిమాతో NTRను చిత్రరంగానికి పరిచయం చేశారు.

TG: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో అన్నారు. ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.

నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్ఫామ్ నుంచి 16వ ప్లాట్ఫామ్కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపులాట జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.

ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాహుల్ గాంధీ అన్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతోందని ట్వీట్ చేశారు. మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారని తెలిసి కూడా స్టేషన్లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు.

ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలో రైల్వే ప్రమాదాలు పెరిగిపోయాయని, రద్దీకి అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. జనరల్ బోగీల సంఖ్యను చాలా వరకు తగ్గించారని, సాధారణ ప్రయాణికుల కష్టాలను పట్టించుకోవట్లేదని ఫైరవుతున్నారు. ఈ డిమాండ్లపై మీ కామెంట్?

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట బాధితులకు భారత రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది.

TG: ములుగులో నాలుగు రోజుల పాటు కొనసాగిన మినీ మేడారం జాతర ముగిసింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వనదేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే బుధవారం నుంచి తిరుగువారం పండగ నిర్వహిస్తారు. కాగా, వచ్చే ఏడాది మహా జాతర జరగనుంది.
Sorry, no posts matched your criteria.