News January 9, 2025

బుమ్రా బంగారు బాతు.. చంపేయొద్దు: కైఫ్

image

భారత క్రికెట్‌కు బుమ్రా బంగారు బాతు వంటి ఆటగాడని, ఆ బాతును ఎక్కువగా వాడి చంపేయకూడదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. ‘బుమ్రాను కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కెప్టెన్సీ భారాన్ని వేరేవారికి వదిలేసి బుమ్రా కేవలం వికెట్లు తీయడంపై దృష్టి సారించేలా చూడాలి. లేదంటే ఆ ఒత్తిడి అతడికి కొత్త గాయాలను తీసుకొచ్చి మొదటికే మోసం రావొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

News January 9, 2025

పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్

image

రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.

News January 9, 2025

అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి

image

AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News January 9, 2025

గతంలోలాగే ఏర్పాట్లు.. ఈవోపై సీఎం ఫైర్

image

AP: టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఎవరో చేశారని నువ్వు అలానే చేస్తావా? నీకంటూ కొత్త ఆలోచనలు లేవా?’ అంటూ ప్రశ్నించారు. సాంకేతికతను ఎందుకు వాడుకోలేదని ఈవోను నిలదీశారు.

News January 9, 2025

ట్రెండింగ్‌లో ‘లొట్టపీసు’.. అర్థం ఏంటంటే?

image

తనపై పెట్టిన కేసు ‘లొట్టపీసు’ అని KTR వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘లొట్టపీసు’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీని అర్థం కోసం చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. కాగా, లొట్టపీసు అనేది కాలువలు, కుంటలు, చెరువుల్లో పెరిగే ఓ మొక్క. దీని కాండం తెల్లని పూతతో లొట్ట(లోపల ఖాళీగా, డొల్ల) మాదిరి ఉంటుంది. అందుకే దీనికి ‘లొట్టపీసు’ పేరు వచ్చింది. గ్రామీణ నేపథ్యమున్న వారికి ఇది సుపరిచితమైన పేరే.

News January 9, 2025

డిసెంబర్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల వరద

image

DECలో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.41,155CR పెట్టుబడులు వచ్చాయి. NOVతో పోలిస్తే ఇది 14.5% వృద్ధి. వరుసగా 46వ నెలా ఈ ఫండ్స్‌ పాజిటివ్ జోన్లోనే ఉండటం విశేషం. NIFTY, SENSEX నష్టపోతున్నా థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో MoM పద్ధతిన రూ.15,331CR ఇన్‌ఫ్లో వచ్చింది. ఇక 12 NFOల్లో రూ.11,337CR, స్మాల్‌క్యాప్ కేటగిరీలో రూ.4667CR పెట్టుబడులు వచ్చాయి. డెట్ ఫండ్స్‌ నుంచి రూ.1.27L CR వెనక్కి తీసుకున్నారు.

News January 9, 2025

‘గేమ్ ఛేంజర్’ మిడ్‌నైట్ షోలు ఆపాలని పిటిషన్.. HC సెటైరికల్ రిప్లై

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మిడ్ నైట్ షోలను నిలిపివేయాలని కొందరు ఏపీ హైకోర్టు(HC)ను ఆశ్రయించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు మరణించిన ఘటనను పేర్కొంటూ షోను నిలిపివేయాలని కోర్టును కోరారు. దీనికి ‘శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణిస్తే ప్రయోగాలు ఆపేయ్యాలి అన్నట్లుగా మీ అభ్యర్థన ఉంది’ అని హైకోర్టు వ్యంగ్యంగా స్పందించింది.

News January 9, 2025

కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్

image

TG: ఫార్ములా-ఈ రేస్ కేసులో KTRను ఏసీబీ విచారిస్తోంది. మధ్యలో లంచ్ విరామం ఇచ్చారు. లంచ్ తర్వాత తిరిగి విచారణ కొనసాగనుంది.

News January 9, 2025

ట్రూడోకు షాక్: నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు బెయిల్

image

పదవి నుంచి దిగిపోతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో షాక్! ఖలిస్థానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో అభియోగాలు మోపిన నలుగురు భారతీయులకు కెనడాలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. అమిత్ షా, అజిత్ ధోవల్, జైశంకర్‌ ఈ హత్యకు ప్లాన్ చేశారంటూ ట్రూడో ప్రభుత్వం భారత వ్యతిరేక నెరేటివ్ బిల్డ్ చేసిన సంగతి తెలిసిందే.

News January 9, 2025

పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి

image

HYD మార్కెట్లో 3 రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.79,200గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.350 ఎగసి రూ.7,2600కు చేరింది. అటు వెండి ధరలు 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.లక్షగా ఉంది.