News February 22, 2025

అంజనీకుమార్, అభిలాషలను రిలీవ్ చేసిన TG సర్కార్

image

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో IPS అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. మరో ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిపై సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ ఆదేశాలను బట్టి రిలీవ్ అంశం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

News February 22, 2025

60 కోట్ల మంది స్నానమాచరించినా శుద్ధిగానే గంగానది: సైంటిస్ట్

image

‘మహాకుంభమేళా’లో దాదాపు 60 కోట్ల మంది స్నానమాచరించినా గంగానదిలోని నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త డా. అజయ్ సోంకర్ గంగా జలంపై అధ్యయనం చేశారు. ‘గంగా నదిలో 1100 రకాల బాక్టీరియోఫేజ్‌లు సహజంగా నీటిని శుద్ధి చేస్తాయి. కాలుష్యాన్ని తొలగించడంతో పాటు చెడు బాక్టీరియా, సూక్ష్మక్రిములను నాశనం చేసి శుద్ధి చేస్తాయి’ అని సోంకర్ తెలిపారు.

News February 22, 2025

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం

image

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ MLAగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.

News February 22, 2025

క్యాన్సర్ పేషెంట్లతో చైతూ-శోభిత

image

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు మధుర జ్ఞాపకాలను అందించేందుకు స్టార్ కపుల్ నాగ చైతన్య-శోభితలు ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌ను సందర్శించి అక్కడున్న క్యాన్సర్ బాధిత చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి, ఆటలాడుతూ చైతూ డాన్సులేశారు. సెల్ఫీలు దిగి వారిని సంతోషపరిచారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

News February 22, 2025

RBI మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు కీలక పదవి

image

RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు మరో కీలక పదవి దక్కింది. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆయన్ను PM మోదీ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి త్వరలోనే ఆయన బాధ్యతలు చేపడతారు. RBI గవర్నర్‌గా ఆరేళ్లు పనిచేసిన దాస్‌కు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో విశేష అనుభవం ఉంది. ఎకనామిక్స్, ఫైనాన్స్, మినరల్స్, రెవెన్యూ శాఖలు, జీ20 షెర్ఫా, ADB బ్యాంకు, ప్రపంచ బ్యాంకు వ్యవహారాలపై బాగా పట్టుంది.

News February 22, 2025

గ్రూప్-2 పరీక్షల వాయిదాకు కట్టుబడి ఉన్నాం: CM చంద్రబాబు

image

AP: గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రోస్టర్ విధానంపై 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించాం. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు వాయిదా వేయాలని APPSCకి రాసిన లేఖలో కోరాం. రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నదే ప్రభుత్వ అభిమతం’ అని చంద్రబాబు అన్నారు.

News February 22, 2025

FBI విధులేంటో మీకు తెలుసా..?

image

FBI అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ. టెర్రరిజం, సైబర్‌క్రైమ్, డ్రగ్స్‌లాంటి నేరాలను అరికట్టడానికి ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. వాటితో పాటు అవినీతి ఆరోపణలపైనా విచారణ చేస్తుంది. అత్యున్నత శిక్షణ పొందిన కమాండోలు, సైబర్ నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తారు. ఈఏజెన్సీకి 60కు పైగా దేశాల్లో కార్యాలయాలన్నాయి. గ్లోబల్ టెర్రరిజం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి నేరాలపై సమాచారం సేకరించి ఆయా దేశాలకు అందిస్తోంది.

News February 22, 2025

14 కి.మీ. లోపల కార్మికులు.. సీఎం రివ్యూ

image

SLBC టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. NDRF, SDRF బృందాలు కాసేపట్లో ప్రమాదస్థలికి చేరుకుంటాయని చెప్పారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా కార్మికులు సొరంగంలో 14 కి.మీ. లోపల ఉన్నందున సహాయకచర్యలు క్లిష్టంగా మారాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వాళ్లను ప్రాణాలతో రక్షించేందుకు ఆర్మీ సహాయం తీసుకుంటామన్నారు.

News February 22, 2025

మెమరీ పవర్: 13.5 సెకన్లలో 80 డిజిట్స్ గుర్తించిన భారత విద్యార్థి

image

పుదుచ్చేరి కుర్రాడు విశ్వారాజ్‌కుమార్ అద్భుతం చేశారు. 13.50సెకన్లలో 80 ర్యాండమ్ డిజిట్స్‌ను వరుసగా గుర్తుతెచ్చుకొని మెమరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు సృష్టించారు. ఆన్‌లైన్‌లో 16 మందికి తెరపై నంబర్లు, చిత్రాలు చూపించి రికాల్ షీట్లో రాయమన్నారు. 8.53సెకన్లలోనే అతడు 30 చిత్రాలు గుర్తుతెచ్చుకోవడం విశేషం. తన విజయానికి హైడ్రేషన్ ఉపయోగపడిందని విశ్వ అన్నారు. మెమరీ మెరుగవ్వాలంటే నీరు తాగాలన్నారు.

News February 22, 2025

జైల్లో నరకం అనుభవించా: బిలియనీర్ కుమార్తె

image

ఉగాండాలో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ తన జైలు అనుభవాలను పంచుకున్నారు. . ‘మా నాన్న దగ్గర పనిచేసే ఓ ఉద్యోగిని కిడ్నాప్ చేసి చంపాననే ఆరోపణలతో నన్ను జైల్లో వేశారు. కానీ అతడు టాంజానియాలో బతికుండటంతో నన్ను విడుదల చేశారు. జైల్లో ఉన్న 2 వారాలపాటు నరకం చూశా. మా నాన్న లంచం ఇచ్చి మరీ ఫుడ్ పంపించారు. జైలు అధికారులు నన్ను స్నానం కూడా చేయనీయలేదు’ అని చెప్పారు.