News February 26, 2025

మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్!

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News February 26, 2025

రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. కృష్ణలంక పీఎస్‌లో 5 గంటలపాటు ఆయనను పోలీసులు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తీసుకెళ్తారు.

News February 26, 2025

టాప్-5లోకి కోహ్లీ

image

ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకుకు చేరారు. ఇక నం.1 స్థానంలో 817 పాయింట్లతో గిల్ కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్, రోహిత్ శర్మ, క్లాసెన్ ఉన్నారు. మరోవైపు వన్డేల్లో టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

News February 26, 2025

మార్చి 2 వరకు జాగ్రత్త!

image

తెలంగాణలో 5 రోజుల పాటు ( ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2) ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 40డిగ్రీలు చేరుకునే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో 34-37 డిగ్రీల మధ్య ఉండొచ్చని వెల్లడించింది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

News February 26, 2025

విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు

image

సూడాన్‌లో జరిగిన <<15582145>>విమాన ప్రమాదంలో<<>> మరణాల సంఖ్య పెరిగింది. ఓమ్డర్మన్ నగరంలో జరిగిన ఘటనలో మరణాలు 46కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. పౌర నివాసాలపై విమానం కూలడంతో మిలిటరీ సిబ్బందితో పాటు పౌరులు చనిపోయారని పేర్కొన్నారు. 2023 నుంచి సూడాన్‌లో ఆర్మీకి ర్యాపిడ్ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.

News February 26, 2025

తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు!

image

తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్‌పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు. తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.

News February 26, 2025

రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

image

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.

News February 26, 2025

ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో?: BRS

image

TG: CM రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్-BJP సంకీర్ణ సర్కార్ అని BRS ఆరోపించింది. ‘MLC ఎన్నికల ఓటింగ్‌కు ముందు రోజు BJP ప్రధానిని, కాంగ్రెస్ CM కలవడంలో మర్మం ఏంటి? మేము గెలిచినా ఓడినా మాకు ఏమి ఫరక్ పడదు అని CM అనడంలో మతలబు ఏంటి? ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో? మోదీ అపాయింట్మెంట్ సులువుగా దొరకడం ఏమిటో రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో?’ అంటూ పీఎం, సీఎం భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.

News February 26, 2025

CT: గెలిస్తేనే నిలుస్తారు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టుకే సెమీస్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం, సాదిక్, రహ్మత్, హస్మత్, అజ్మత్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్, ఫరూఖీ
ఇంగ్లండ్: డకెట్, సాల్ట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్ స్టోన్, ఓవర్టన్, ఆర్చర్, రషీద్, వుడ్.

News February 26, 2025

హిందూపండగ సెలవు రద్దుచేసి రంజాన్‌కు కేటాయింపు

image

KMC ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు తీసుకున్న ఓ నిర్ణయం బెంగాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. విశ్వకర్మ పూజ సెలవు (SEP 17)ను రద్దు చేసి రంజాన్‌కు (APR 1) అదనంగా కేటాయించారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కోల్‌కతా మున్సిపల్ కమిషనర్ స్పందించారు. తమకు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. KMCED మేనేజర్ సిద్ధార్థ శంకర్‌కు షోకాజ్ నోటీసు పంపారు. సెలవు నిర్ణయాన్ని రద్దు చేశారు.