News February 19, 2025

24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

image

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారనేది బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించనున్నారు.

News February 19, 2025

ఎక్స్‌ట్రా టికెట్లు ఎందుకు అమ్మారు?: ఢిల్లీ HC ఆగ్రహం

image

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఇటీవల తొక్కిసలాట జరిగి 18మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు CJI ధర్మాసనం విచారణ జరిపింది. కోచ్‌లో పట్టే ప్రయాణికుల కంటే రైల్వే అదనపు టికెట్లు ఎందుకు అమ్ముతోందని మండిపడింది. కోచ్‌లో ప్రయాణికుల పరిమితిపై, అనుమతి లేకుండా కోచ్‌ల్లోకి ప్రవేశిస్తున్న వారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారని రైల్వేస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

News February 19, 2025

కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండండి: కేసీఆర్

image

TG: రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని వ్యాఖ్యానించారు.

News February 19, 2025

నిద్ర చెడగొడుతోందని కోడిపై RDOకు ఫిర్యాదు..

image

పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తోందని కేరళ, పల్లిక్కల్ వాసి రాధాకృష్ణ కురూప్ ఓ కోడిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా నిద్రను చెడగొడుతూ ప్రశాంతమైన తన జీవితానికి భంగం కలిగిస్తోందని ఆయన స్థానిక RDOకు మొరపెట్టుకున్నారు. దానిని సీరియస్‌గా తీసుకున్న అధికారి వెంటనే ఇంటికొచ్చి పరిశీలించారు. పక్కింటి మేడపై కోళ్ల షెడ్డును గమనించి దానిని 14 రోజుల్లో మరోచోటకు మార్చాలని ఆదేశించారు.

News February 19, 2025

త్వరలో.. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు!

image

బ్యాంకు కస్టమర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.8-12 లక్షలకు పెంచబోతోందని సమాచారం. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది. ఈ నెలాఖరు నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రావొచ్చని పేర్కొంది. ఫిక్స్‌డ్, సేవింగ్స్, కరెంట్, రికరింగ్ A/Cకు ఇవి వర్తిస్తాయంది.

News February 19, 2025

మాజీ సీఎం KCR ఆగ్రహం

image

TG: కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు భ్రమల్లో నుంచి బయటకు రావాలన్నారు. అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దూరంగా ఉండటమేంటని ప్రశ్నించారు. అటు BRS సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని, పార్టీ కమిటీలను నియమించాలని నేతలను ఆదేశించారు.

News February 19, 2025

MUDA SCAM: సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్‌చిట్

image

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట దక్కింది. ‘ముడా’ ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతి తదితరులపై ఆరోపణలు వచ్చాయి. వీటికి ఎలాంటి ఆధారాల్లేవని తాజాగా లోకాయుక్త పోలీసులు వెల్లడించారు.

News February 19, 2025

పాకిస్థాన్‌లో రెపరెపలాడిన భారత జెండా

image

ఎట్టకేలకు పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్‌ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.

News February 19, 2025

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

image

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం YS జగన్‌కు, YCP MLAలకు లేదని విమర్శించారు. ‘నేరస్థులను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని ట్వీట్ చేశారు.

News February 19, 2025

100% మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పోరాడగలదని, పార్టీ నేతలు ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని చెప్పారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.