News March 4, 2025

SLBC: ఇంకా లభించని కార్మికుల ఆచూకీ

image

TG: SLBC సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయి 10 రోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా సొరంగం లోపలి పరిస్థితులు అనుకూలించడం లేదు. మట్టి, నీరు తొలగిస్తున్న కొద్ది మళ్లీ వచ్చి చేరుతోంది. దేశంలోని అన్ని రంగాల నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నా ఫలితం లేదు. 2, 3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

News March 4, 2025

దుబాయ్‌లోనే నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి

image

సినీ నిర్మాత <<15577363>>కేదార్ సెలగంశెట్టి<<>> అంత్యక్రియలు దుబాయ్‌లో జరిగాయి. ఆయన మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని అక్కడి పోలీసులు విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని భార్య రేఖా వీణకు అప్పగించారు. ఇండియాలో రాజకీయ దుమారం రేగుతుందని అక్కడే దహనసంస్కారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కేదార్ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదని సమాచారం.

News March 4, 2025

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?

image

AP: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ప్రకటించారు.

News March 4, 2025

ఆలపాటి రాజా భారీ విజయం

image

AP: గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 50 శాతానికిపైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్‌పై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి.

News March 4, 2025

ICC నాకౌట్స్ అంటే హెడ్‌కు పూనకాలే!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన ODI WC సెమీస్‌లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్‌తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.

News March 4, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’లో విలన్‌గా సన్నీ డియోల్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు

image

AP: సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు (42 శాతం) అత్యంత పేద జిల్లాగా నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 4, 2025

నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 4, 2025

చికెన్ 65కు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

image

చికెన్ 65 రెసిపీకి చాలా క్రేజ్ ఉంది. కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని అందరికీ డౌట్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంఎం బుహారి అనే చెఫ్ చెన్నైలో ఓ రెస్టారెంట్ స్థాపించారు. అందులో బ్రిటీష్ వారికి సరికొత్త మాంసాహారం అందించేవారు. ఓ సైనికుడు భాష సమస్య కారణంగా మెనూ కార్డులో 65వ నంబర్‌లో ఉండే చికెన్ వంటకం తెమ్మనేవాడు. మిగతా కస్టమర్లు కూడా అలానే చెప్పేవారు. అది కాస్త చికెన్ 65గా స్థిరపడింది.

News March 4, 2025

సెమీస్‌లో ఎదురే లేని టీమ్ ఇండియా

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్‌తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.