India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాధనం వృథా చేసినందుకు ఆయనపై FIR నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా 2019లో ద్వారకాలో కేజ్రీవాల్, ఎమ్మెల్యే గులాబ్ సింగ్, కౌన్సిలర్ నిఖితా శర్మ పబ్లిక్ మనీతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. దీనిపై 2019లో కేసు నమోదైంది. 2022లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ కేసును కొట్టివేశారు.

TG: సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్ను కేంద్రం నియమించింది. తొలి వీసీగా ఎంపికైన ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. 30 ఏళ్లకుపైగా ఇంగ్లిష్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేషన్, ఉస్మానియా యూనివర్సిటీలోని పలు విభాగాల్లో ఆయన సేవలు అందించారు. శ్రీనివాస్ను నియమించినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు చెప్పారు.

త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్తోనే కొత్త నోట్లు ఉంటాయని RBI పేర్కొంది. ఇవి అందుబాటులోకి వచ్చినా పాతవి చెల్లుతాయని వెల్లడించింది.

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు JFCM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదోని కేసుకు సంబంధించి న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆయనకు మూడు కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

UPI, రూపే డెబిట్ కార్డు లావాదేవీల విషయంలో వ్యాపారులకు షాక్ తగిలే అవకాశం ఉంది. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను(MDR) మళ్లీ తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. GST వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు మించిన వారికి మాత్రమే ఇది వర్తించనుంది. 2022 ముందు వ్యాపారులు ఒక శాతానికంటే తక్కువగా MDR కట్టేవారు. ఆ తర్వాత బ్యాంకులు ఈ ఛార్జీలను తొలగించాయి.

ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఫ్లిప్ ఫోన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్ ల్యాప్టాప్ను తాజాగా లెనోవో కంపెనీ లాంచ్ చేసింది. సాధారణంగా ఇది 13.9 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. వివిధ అవసరాల కోసం ఫ్లిప్ ఓపెన్ చేస్తే 18.1 ఇంచుల డిస్ప్లేగా మారుతుంది. ఇది OLED, 120HZ టచ్ స్క్రీన్తో ఉంటుంది. అలాగే 16.9MM మందంతో 1.4 కిలోల బరువు ఉంటుంది. దీని ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసింది. అందులోని ఆరుగురు సైనికుల్ని చంపింది. 350మందికి పైగా ప్రయాణికుల్ని, 100మంది సైనికుల్ని బందీలుగా తీసుకుంది. ‘మా పోరాటవీరులు రైల్వే పట్టాల్ని పేల్చేసి రైలును హైజాక్ చేశారు. మాపై ఏమైనా సైనిక చర్యలకు ఉపక్రమిస్తే అదే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంది, అందర్నీ చంపేస్తాం’ అని హెచ్చరించింది. తమ డిమాండ్లు ఏంటన్నది ఇంకా చెప్పలేదు.

TG: సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఫీచర్, జాతీయ సమైక్యత, బాలలు, హెరిటేజ్, పర్యావరణం, చరిత్ర, డెబిట్ ఫీచర్, యానిమేషన్, సోషల్ ఎఫెక్ట్స్, డాక్యుమెంటరీ చిత్రాలకు ఈ పురస్కారం అందిస్తారు. అలాగే నటులు, టెక్నీషియన్లతోపాటు తెలుగు సినిమాలపై పుస్తకాలు, వ్యాసాలు రాసినవారికీ ఈ అవార్డులు ఇస్తారు. BRS హయాంలో వచ్చిన సినిమాలకూ ఈ అవార్డు ఇవ్వనున్నారు.

గత IPL సీజన్లో KKRకు టైటిల్ సాధించి పెట్టినా తనకు సరైన గుర్తింపు దక్కలేదని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా వృథాగా మారుతుందని చెప్పారు. ‘భారత టెస్టు టీమ్లో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించినప్పుడు ఎంతో బాధపడ్డా. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా నిలిచారు. నన్ను నిరూపించుకునేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యా’ అని పేర్కొన్నారు.

తన వారసుడు చైనాకు బయట స్వేచ్ఛాప్రపంచంలోనే పుడతాడని తన కొత్త పుస్తకం ‘వాయిస్ ఫర్ ది వాయిస్లెస్’లో టిబెట్ బౌద్ధగురువు దలైలామా రాశారు. ‘తన ముందటి దలైలామా పనిని కొనసాగించడమే కొత్త దలైలామా పని. ఈ సంప్రదాయ బాధ్యత కొనసాగించేందుకు నా వారసుడు వస్తాడు’ అని అందులో స్పష్టం చేశారు. 1959లో మావో జెడాంగ్ నియంతృత్వాన్ని వ్యతిరేకించిన 14వ దలైలామా, ఆ పోరాటం విఫలం కావడంతో తన అనుచరులతో భారత్కు వచ్చేశారు.
Sorry, no posts matched your criteria.