News February 14, 2025

మహిళా జడ్జిపై చెప్పుతో దాడి చేసిన ఖైదీ

image

TG: కోర్టులో మహిళా జడ్జిపై చెప్పుతో దాడి చేశాడో ఖైదీ. సర్దార్ చీమకొర్తి(22) 2023లో HYD శివారు నార్సింగి ORR సమీపంలో దారి దోపిడీకి పాల్పడి ఒకరిని హత్య చేశాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పోలీసులపై తల్వార్‌తో దాడి చేశాడు. ఈ కేసులో RR కోర్టు జడ్జి అతడికి జీవితఖైదు విధించారు. మరో కేసు విచారణ కోసం నిన్న కోర్టులో హాజరుపర్చగా జడ్జిపై చెప్పు విసిరాడు. దీంతో అక్కడే ఉన్న లాయర్లు అతడిని చితకబాదారు.

News February 14, 2025

మే 19 నుంచి EAPCET

image

AP: 2025-26లో ఉన్నత విద్య ప్రవేశాలకు పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. EAPCET మే 19న ప్రారంభం కానుంది. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ.. 21-27 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అలాగే, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు మే 2 – JUN 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. పైఫొటోలో పూర్తి వివరాలు చూడొచ్చు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేశ్ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలన్నారు.

News February 14, 2025

Pulwama Attack: మీ వీరమరణాలు మరవం సోదరుల్లారా!

image

2019లో సరిగ్గా ఇదే రోజున భారతీయుల గుండెలు పగిలాయి. జమ్మూ, శ్రీనగర్ హైవేపై పుల్వామా వద్ద CRPF జవాన్లపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఓ ఉగ్రవాది కారులో పేలుడు పదార్థాలు నింపుకుని నేరుగా జవాన్ల బస్సును ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించి బస్సులోని 40 మంది జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. శరీరాలు ముక్కలుముక్కలుగా తెగిపడ్డాయి. ఇందుకు ప్రతీకారంగా భారత్ PAKలోని ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.

News February 14, 2025

అంగన్‌వాడీల మెనూలో మార్పులు

image

AP: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల మెనూలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణులకు అందించే పాలు, బాలామృతంలో మార్పులు చేస్తోంది. పాలకు బదులు పాలపొడి, బాలామృతంలో మరిన్ని పోషకాలు జోడించి అందించనుంది. ఇప్పటికే దీనిని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. మెనూ మార్పు బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించారు.

News February 14, 2025

మాది MIGA మీది MAGA మన భాగస్వామ్యం MEGA: మోదీ

image

ప్రెసిడెంట్ ట్రంప్ తరచూ MAGA గురించి మాట్లాడతారని PM మోదీ అన్నారు. భారత్‌లో తాము ‘వికసిత్ భారత్’ దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. US కాంటెక్ట్స్‌లో దీనిని MIGAగా (Make India Grate Again) అనువదించుకోవచ్చన్నారు. ఇక భారత్, అమెరికాది MEGA పార్ట్‌నర్‌షిప్‌గా వర్ణించారు. అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో అద్భుతమైన మీటింగ్ జరిగిందని ట్వీట్ చేశారు. ఆయన్ను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.

News February 14, 2025

జియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ విలీనం

image

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ జియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ విలీనం పూర్తైంది. ఈ యాప్‌కు జియోహాట్‌స్టార్‌గా నామకరణం చేశారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటి కిందకు చేరడంతో జియోహాట్‌స్టార్‌ అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. ఇకపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట దర్శనమివ్వనుంది. ప్లేస్టోర్‌లో జియోకు 100 మిలియన్, హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి.

News February 14, 2025

ఇసుక.. ఇకపై 24 అవర్స్ ఆన్‌లైన్ బుకింగ్

image

TG: నేటి నుంచి ఇసుక 24 గంటల ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్‌లు, డంపింగ్ యార్డుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక లోడ్ లారీలను అనుమతించవద్దని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు ఇసుక వినియోగంపై వివరాలను మార్చి 31లోపు సమర్పించాలని జాతీయ రహదారులు, R&B, TGMSIDC, సాగునీటి, పంచాయతీరాజ్ శాఖలను కోరారు.

News February 14, 2025

గురుకుల విద్యార్థులకు చికెన్ బంద్

image

AP: రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఈఎంఆర్‌ఎస్ స్కూళ్లలో విద్యార్థులకు చికెన్ నిలిపేస్తున్నట్లు గురుకులాల సెక్రటరీ సదా భార్గవి తెలిపారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చికెన్ బదులుగా పండ్లు, స్వీట్లు, వెజ్ కర్రీ అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చికెన్ పెట్టకూడదని ఆమె అధికారులను ఆదేశించారు.

News February 14, 2025

శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

image

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల 19-మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్‌పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ చెప్పారు. అటవీ ప్రాంతంలోకి 2-5L వాటర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చని, చెత్తకుండీల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9- ఉ.6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో అనుమతించరు.

News February 14, 2025

Stock Markets: భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 100pts లాభంతో మొదలవ్వడం దీనినే సూచిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందాలు కుదరడమూ పాజిటివ్ సెంటిమెంటును నింపింది. డాలర్ ఇండెక్స్ తగ్గడం శుభపరిణామం. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 23,250, సపోర్టు 22,900 వద్ద ఉన్నాయి. సూచీ 23,200 పై స్థాయిలో నిలదొక్కుకుంటేనే బలం పెరిగినట్టు లెక్క.