News February 17, 2025

కృష్ణా జలాలపై CM రేవంత్ కీలక ఆదేశాలు

image

TG: శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఏపీ ఏకపక్షంగా వ్యవహరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. నీటి సరఫరాలో టెలిమెట్రీ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. టెలిమెట్రీ నిర్వహణకు అవసరమైన నిధులన్నీ తెలంగాణనే భరిస్తుందని చెప్పారు. వెంటనే టెలిమెట్రీ అమలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు.

News February 17, 2025

రంజాన్ మాసం: సా.4 గంటల వరకే ఆఫీస్

image

TG: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 2 నుంచి 31 వరకు వారంతా సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లిపోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లకు ఇది వర్తించనుందని తెలిపింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీలోనూ ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.

News February 17, 2025

టారిఫ్స్ తగ్గించుకొనేందుకు సిద్ధమైన US, భారత్!

image

కొన్ని వస్తువులపై టారిఫ్స్ తగ్గించుకొనేందుకు భారత్, అమెరికా ఒప్పుకున్నాయని తెలిసింది. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగే ట్రేడ్ డీల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2030 నాటికి భారత్, అమెరికా మధ్య వాణిజ్యాన్ని $500Bకు పెంచుకోవాలని ట్రంప్, మోదీ టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ, శ్రామిక ఆధారిత, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను పెంచుకోనున్నాయి.

News February 17, 2025

21న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లు ఈ నెల 21న విడుదలవుతాయని టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోసం రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది. అలాగే ఈ నెల 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

News February 17, 2025

చాహల్ భార్యకు రూ.60 కోట్ల భరణం?

image

టీమ్ఇండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ధన శ్రీ వర్మ జంట త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ డివోర్స్ తీసుకోనున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. విడాకుల తర్వాత భరణం కింద చాహల్ తన భార్యకు రూ.60 కోట్లు ఇవ్వనున్నట్లు మరో వార్త చక్కర్లు కొడుతోంది. కాగా, విడాకులపై ఇరువురి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

News February 17, 2025

యూట్యూబ్‌లో చూసి చికిత్స.. రోగి మృతి!

image

విపరీతమైన వాంతులతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడికి యూట్యూబ్‌లో వీడియోలు చూసి చికిత్స చేశారు బిహార్‌లోని పట్నాకు చెందిన ఓ వైద్యుడు. దీంతో రోగి ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందారు. రోగి మరణానికి కారణం వైద్యుడి అసమర్థతేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ దాడికి దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News February 17, 2025

ఇవాళ పర్‌ఫ్యూమ్ డే.. మీరూ వాడతారా?

image

ఎంత మందిలో ఉన్నా ఓ వ్యక్తి పర్‌ఫ్యూమ్ వాడితే అతను మరింత స్పెషల్ అయిపోతాడు. కొందరు స్నానం చేయలేక పర్‌ఫ్యూమ్ వాడితే, మరికొందరు ఫ్రెష్‌గా కనిపించేందుకు దీనిని వేసుకుంటుంటారు. అలాంటి పర్‌ఫ్యూమ్‌కూ ఓ రోజు ఉందనే విషయం మీకు తెలుసా? నేడు వరల్డ్ పర్‌ఫ్యూమ్ డే. సైకాలజీ ప్రకారం మనిషి వాడే ఫ్రాగ్రన్స్‌ను బట్టి అతనెలాంటి వారో చెప్పొచ్చంటారు. వీటి సువాసనలు భావోద్వేగాలు, జ్ఞాపకాలను రేకెత్తిస్తాయంటారు.

News February 17, 2025

GBSపై ఆందోళన చెందొద్దు: కృష్ణబాబు

image

AP: జీబీఎస్‌ అంటువ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. ఎవరైనా తిమ్మిర్లు, నడవలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఆయన సూచించారు. ‘జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాం. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. అన్ని జీజీహెచ్‌ల్లో ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News February 17, 2025

ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు: TPCC చీఫ్

image

TG: ఐదేళ్ల పాటు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ, ఏదో ఒక రోజు తెలంగాణకు BCనే సీఎం అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీసీ సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్‌లో తప్ప వేరే పార్టీలో లేదు. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయి. త్వరలో రాష్ట్రంలో చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఉంటుంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.

News February 17, 2025

‘లైలా’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు!

image

విశ్వక్‌సేన్ ‘లైలా’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. వాలంటైన్స్ డే సందర్భంగా FEB 14న రిలీజైన ఈ మూవీ 4వ రోజైన ఇవాళ తొలి రెండు షోల్లో కేవలం రూ.7లక్షల కలెక్షన్లే రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తొలి రోజు రూ.కోటి 40 లక్షలు వసూలు చేయగా 2వ రోజు రూ.60లక్షలు, 3వ రోజు రూ.65 లక్షలు సాధించింది. ఓవరాల్‌గా 4 రోజుల్లో రూ.2.72 కోట్లు వసూలు చేసింది. ‘లైలా’ బడ్జెట్ రూ.40Cr అని మేకర్స్ తెలిపారు.