India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో హీరో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ చిత్ర షూటింగ్లో చైతూ బిజీగా ఉన్నారు.
AP: శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఏటా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పార్కింగ్, శౌచాలయం, మంచినీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. ఓవరాల్గా తొలి రెండు రోజుల్లో రూ.45.3 కోట్లు కొల్లగొట్టింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు.
తనను ఎంపీగా గెలిపిస్తే పేదలకు విదేశీ మద్యం ఇస్తానని ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో వనితా రౌత్ అనే ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఈ వినూత్న ప్రచారం చేస్తున్నారు. సబ్సిడీ ధరలకు బీరు, విస్కీ ఇస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో ఎంపీ నిధులతో విదేశీ మద్యం, బీర్లతో బార్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. పేదలకు ఒకే ఒక విలాసం మద్యం తాగడమని.. అందుకే వారికి ఈ పథకం అవసరమన్నారు.
ప్రభుత్వంపై తమిళనాడు రైతులకు ఉన్న ఆగ్రహం 1996లో ఎన్నికల సంఘానికి పెద్ద పని పెట్టింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టగా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ ఏడాది ఎన్నికల్లో ఈరోడ్ MP స్థానానికి 1,033 నామినేషన్లు వేశారు. పత్రికల మాదిరి అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్ పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. ఈ ఘటనతో సెక్యూరిటీ డిపాజిట్ని రూ.500 నుంచి రూ.10 వేలకు EC పెంచింది.
#ELECTIONS2024
AP: వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీకి పెన్షనర్ల ఓట్లు పోవడం ఖాయమని చెప్పారు. ‘ఈసీకి ఫిర్యాదులు చేసి పెన్షన్లు ఆపింది టీడీపీ నేతలే. ఇప్పుడు త్వరగా ఇవ్వాలంటూ గొడవలు చేస్తోంది వాళ్లే. వృద్ధులు మూడు నెలల పాటు సచివాలయంకి వెళ్లి పెన్షన్లు తీసుకునేలా చంద్రబాబు చేశారు. ప్రజలకు, సచివాలయం సిబ్బందికి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం
1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
తేది: ఏప్రిల్ 01 , సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:58
సూర్యోదయం: ఉదయం గం.6:11
జొహర్: మధ్యాహ్నం గం.12:20
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:29
ఇష: రాత్రి గం.07.42
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
జేఈఈ మెయిన్స్-2024 పేపర్ 1(బీఈ/బీటెక్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లను http://jeemain.nta.ac.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.