India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి విమర్శలు చేశారు. నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మాట ఆయన పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2లక్షలకు పైగా రుణ భారం ఉందన్నారు. ఇవి సరిపోవన్నట్టుగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారని విమర్శించారు.
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమవ్వగా.. సమద్(29*) అభిషేక్(29), క్లాసెన్(24) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ 3, ఒమర్జాయ్, ఉమేశ్, రషీద్, నూర్ తలో వికెట్ తీశారు. GT టార్గెట్ 163.
AP: వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ‘కోడ్ ఉల్లంఘనపై మేం ఫిర్యాదు చేస్తే ఈసీ ఒక్క నోటీసు కూడా ఇవ్వదు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే నోటీసులు ఇస్తోంది. ఈసీకి ఎందుకింత పక్షపాత ధోరణి? నారా భువనేశ్వరి ప్రలోభాలకు పాల్పడితే ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎన్ని కుట్రలు చేసినా పేదవాడి గుండెల్లో ఉన్న జగన్ను ఏమీ చేయలేరు. కూటమికి ఓటమి తప్పదు’ అని పేర్కొన్నారు.
రేపటి నుంచి క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి.
★ అద్దె చెల్లింపులపై SBI కార్డు రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి.
★ బీమా, గోల్డ్, ఫ్యూయల్ కోసం AXIS క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు లభించవు. ఎయిర్పోర్టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో ₹50వేలు ఖర్చు చేయాలి.
★ ICICI లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో కనీసం ₹35వేలు, YES కార్డుపై ₹10వేలు ఖర్చు చేయాలి.
నకిలీ IPL టిక్కెట్లతో సైబర్ మోసగాళ్లు దోచేస్తున్నారు.. జాగ్రత్త. ఏప్రిల్ 5న హైదరాబాద్లో జరిగే సన్రైజర్స్, చెన్నై మ్యాచ్ టికెట్లు పేటీఎంలో విక్రయించగా అమ్ముడైపోయాయి. అయితే ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయంటూ నేరగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రూ.1000 పంపితే టికెట్ పంపిస్తామని.. ఆ తర్వాత మిగిలిన డబ్బు చెల్లించాలని చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
వేసవిలో రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కనువిందు చేస్తాయి. మామిడి రుచిలోనే కాకుండా విటమిన్లు, మినరల్స్ కలిగిఉండి ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. కంటిచూపు, చర్మసౌందర్యం, రోగనిరోధక శక్తి పెరుగుదలకు సహకరిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
AP: ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సకాలంలో పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన నిధులను అందుబాటులో ఉంచి, పింఛన్ల పంపిణీకి తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీఈవోను కోరారు.
మూవీ షూటింగ్తో మొన్న SRH ఇన్నింగ్స్ చూడలేకపోయానని రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో రాహుల్ మ్యాచ్ చూడొద్దని.. ఆ సమయంలో షూట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పలువురు సూచించారు. మరోవైపు రష్మికను ట్యాగ్ చేస్తూ షూట్ కోసం డేట్స్ ఇవ్వాలని రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ తాను RCB ఫ్యాన్ అయినప్పటికీ ఇవాళ SRH గెలవాలని కోరుకుంటున్నానని.. స్కైప్లో షూట్ చేద్దామని రాహుల్కు ఫన్నీ రిప్లై ఇచ్చారు.
ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ బుక్ చేయగా రాయి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన అతడు రూ.22 వేల విలువైన స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేశాడు. ప్యాక్ ఇంటికి రాగానే ఓపెన్ చేయగా లోపల రాయి కనిపించింది. దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్లిప్కార్ట్ క్షమాపణలు చెప్పింది.
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే CUET-UG-2024 <
Sorry, no posts matched your criteria.