India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జనరేషన్ ఆల్ఫాకు రేపటితో గుడ్బై చెప్పనున్న మానవాళి కొత్త ఏడాదిలో జనరేషన్ బీటాకు స్వాగతం పలకనుంది. 2025-2039 మధ్య జన్మించే పిల్లలను ఇక నుంచి జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో వీరు 16% ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, వసతులు వంటి సౌలభ్యాలతో వీరు 22వ శతాబ్దాన్ని కూడా చూస్తారని లెక్కలేస్తున్నారు.

మనోజ్ బాజ్పేయి, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్గా నిలిచాయి. రాజ్-డీకే డైరెక్షన్లో మూడో పార్ట్ కూడా రూపొందుతోంది. ఇందులో మనోజ్ బాజ్పేయి తన షూటింగ్ పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సిరీస్ యూనిట్ అతడిని అభినందించి సెట్లో కేక్ కట్ చేయించింది. ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.

TG: వచ్చే ఏడాది బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. మరోవైపు కొత్త చీఫ్గా తిరిగి KCRను ఎన్నుకుంటారా లేదా కొత్త నాయకుడు వస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇది కాంగ్రెస్ ఢోకా నామ సంవత్సరం అని విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు.

పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేస్తున్నప్పుడు ఎక్కడికెళ్లారంటూ ప్రశాంత్ కిశోర్పై నిరుద్యోగులు మండిపడ్డారు. BPSC పరీక్షల్ని రద్దు చేయాలని బిహార్ గర్దానీబాఘ్లో నిరసనకు దిగిన ఆందోళనకారులపై PCలు గత రాత్రి లాఠీఛార్జ్ చేశారు. అనంతరం PK అక్కడికి చేరుకోగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అయితే మా బ్లాంకెట్లు తీసుకొని మాపైనే యాటిట్యూడ్ చూపిస్తారా అని PK వ్యాఖ్యానించడం ఉద్రిక్తతకు దారితీసింది.

AP: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. YCP అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పనిచేసే సంస్కృతిని చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు.

ఈ ఏడాది టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా(65 వికెట్లు)కు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీల్లో చోటు దక్కింది. మొత్తం నలుగురు ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్(1556 రన్స్), హ్యారీ బ్రూక్(1100 రన్స్), శ్రీలంక నుంచి కమిందు మెండిస్(1049 రన్స్) ఈ రేసులో నిలిచారు. విజేతను నిర్ణయించే మీ ఓటు వేసేందుకు ఇక్కడ <

AP: అల్లు అర్జున్ అంశంపై పవన్ కళ్యాణ్ <<15019011>>స్పందించడంపై <<>>మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో రెస్పాండ్ అయ్యారు. ‘సంఘటన జరిగిన 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నందుకు సంతోషం’ అంటూ Xలో పవన్ను ట్యాగ్ చేశారు.

బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఒకానొక దశలో 850 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 464 పాయింట్ల నష్టంతో 78,222 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 153 Pts తగ్గి 23,657 వద్ద చలిస్తోంది. FIIల అమ్మకాలు, రూపాయి పతనం, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. దీంతో మదుపరులు రూ.4లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

హిందీలో ‘పుష్ప-2’ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. సినిమా విడుదలైన 25 రోజుల్లోనే రూ.770.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద నం.1 చిత్రమిదేనని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1,800 కోట్ల వసూళ్లకు చేరువైంది.

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అనుసరిస్తున్న వ్యూహాలు వివాదాస్పదం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక చేపట్టే స్కీములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆరంభిస్తుండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గెలిచాకే వివరాలు సేకరించొచ్చు కదా అంటున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ వచ్చాక ఓటర్లకు ఆశచూపుతూ పేర్లు, వివరాలు తీసుకోవడం లంచం కిందకు వస్తుంది. కోడ్ వచ్చే ముందు డేటా తీసుకోవడాన్ని BJP, INC వ్యతిరేకిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.