News March 31, 2024

వాలంటీర్లూ జర జాగ్రత్త

image

AP: వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సస్పెన్షన్‌కు గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇది వారి భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. చాలా మంది వాలంటీర్లుగా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వచ్చే వీరిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెన్షన్ వేటు పడినా, ఉద్యోగం కోల్పోయినా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరిస్తున్నారు.

News March 31, 2024

వామ్మో.. ఉబర్ ప్రయాణికుడికి రూ.7.6 కోట్ల బిల్

image

ఉబర్ ఛార్జీ చూసి ప్రయాణికుడి గుండె గుభేల్‌మంది. ఉబర్ ఆటోలో ప్రయాణించిన అతడికి ఏకంగా ₹7.6 కోట్ల ఛార్జీ చూపించింది. నోయిడాకు చెందిన దీపక్ ఆఫీస్‌కు వెళ్లేందుకు ఉబర్ ఆటో బుక్ చేసుకున్నారు. మొదట ఛార్జీ ₹62 చూపించగా.. ట్రిప్ పూర్తయ్యేసరికి రూ.7,66,83,762లు చూపించింది. దీంతో షాక్‌కు గురైన దీపక్ ఈ విషయాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. టెక్నికల్ ఇష్యూతోనే ఇలా జరిగిందని ప్రయాణికుడికి ఉబర్ క్షమాపణలు చెప్పింది.

News March 31, 2024

ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘Click Here’

image

ట్విటర్‌లో ‘Click Here’ అనే ఇమేజ్ ట్రెండ్ అవుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు, సంస్థలు, ఎంటర్‌టైన్మెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అయితే ఇది కేవలం Alt ఇమేజ్ టెక్స్ట్ అన్నమాట. ‘Click Here’ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో Alt అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ ట్విటర్ యూజర్ చెప్పాలనుకున్న సందేశం కనిపిస్తుంది. దీన్ని Alt Text లేదా ఇమేజ్ డిస్క్రిప్షన్ అని కూడా అంటారు.

News March 31, 2024

స్కాలర్‌షిప్ దరఖాస్తుకు నేడు చివరి తేదీ

image

TG: SC, ST, BC, PWD విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5-10 తరగతులు చదువుతోన్న వారు 2024-25 విద్యాసంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరో ఛాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్కాలర్‌షిప్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారికీ ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వెబ్‌సైట్: https://telanganaepass.cgg.gov.in/

News March 31, 2024

ముగిసిన టెన్త్ పరీక్షలు.. రేపటి నుంచి మూల్యాంకనం

image

AP: నిన్నటితో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 18న ప్రారంభమైన ఎగ్జామ్స్‌కు 6,18,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. సుమారు 50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి 25వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

News March 31, 2024

BIG ALERT: ఈ మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. నిన్న 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో వడగాలులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 33 మండలాలు, రేపు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వడగాలుల ప్రభావం ఉండే మండలాల జాబితాను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.

News March 31, 2024

ఎలక్షన్స్.. 931 కేజీల వెండి స్వాధీనం

image

AP: ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీగా వెండి, నగదు పట్టుబడింది. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 931 కేజీల వెండి, రూ.21 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి తమిళనాడుకు చెందిన వ్యాపారులు సంపత్, కన్నాకు చెందిన సొత్తుగా గుర్తించారు. పట్టుబడిన వెండి, నగదును జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.

News March 31, 2024

మ్యాచ్‌కు ముందు కాస్త ఆందోళన పడ్డా: మయాంక్

image

PBKSతో మ్యాచులో 155కి.మీ వేగంతో బంతిని విసరడంపై LSG బౌలర్ మయాంక్ స్పందించారు. ‘ఇంతకుమించిన అద్భుతమైన అరంగేట్రం ఉంటుందని అనుకోవడం లేదు. మ్యాచ్‌కు ముందు కాస్త ఆందోళన పడ్డా. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు వేయాలని ముందే నిర్ణయించుకున్నా. మధ్యలో స్లో బంతులు వేయాలనుకున్నా.. కుదరలేదు. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బంతిని విసరడం జీవితంలో మరిచిపోలేను. కెరీర్‌లో తొలి వికెట్ ఎప్పటికీ ప్రత్యేకమే’ అని తెలిపారు.

News March 31, 2024

DANGER: మీ ఫోన్‌లో ఇలా చేస్తున్నారా?

image

మీ ఫోన్లలో ఫేస్‌బుక్, X సహా సోషల్ మీడియా అకౌంట్లు, యాప్‌లను లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాల ఆటోఫిల్ ఆప్షన్‌కు ఓకే చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే. దీనివల్ల మొబైల్ OSలో పాస్‌వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని, సైబర్ నేరగాళ్లు సులభంగా దాడి చేస్తారని IIIT HYD ప్రొఫెసర్ అంకిత్ గంగ్వాల్ చేసిన పరిశోధనలో తేలింది. అందుకే సొంతంగా పాస్‌వర్డ్ టైప్ చేయాలని సూచిస్తున్నారు.

News March 31, 2024

సందీప్ కిషన్ కొత్త మూవీ ‘వైబ్’

image

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ డైరెక్షన్‌లో హీరో సందీప్ కిషన్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వైబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. కాగా సందీప్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఇటీవల విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే.