News March 31, 2024

DANGER: మీ ఫోన్‌లో ఇలా చేస్తున్నారా?

image

మీ ఫోన్లలో ఫేస్‌బుక్, X సహా సోషల్ మీడియా అకౌంట్లు, యాప్‌లను లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాల ఆటోఫిల్ ఆప్షన్‌కు ఓకే చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే. దీనివల్ల మొబైల్ OSలో పాస్‌వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని, సైబర్ నేరగాళ్లు సులభంగా దాడి చేస్తారని IIIT HYD ప్రొఫెసర్ అంకిత్ గంగ్వాల్ చేసిన పరిశోధనలో తేలింది. అందుకే సొంతంగా పాస్‌వర్డ్ టైప్ చేయాలని సూచిస్తున్నారు.

News March 31, 2024

సందీప్ కిషన్ కొత్త మూవీ ‘వైబ్’

image

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ డైరెక్షన్‌లో హీరో సందీప్ కిషన్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వైబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. కాగా సందీప్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఇటీవల విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

News March 31, 2024

మాల్దీవులు, చైనాకు మధ్య బలమైన బంధానికి కారణాలు ఇవేనా?

image

మాల్దీవులకు చైనా సైనిక సహాయాన్ని ఫ్రీగా అందిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకొంటోంది. అంబులెన్స్‌‌లు, సివిల్ వాహనాలు గిఫ్ట్‌గా ఇస్తోంది. తాగునీటిని పంపిస్తోంది. మాలేలో రోడ్లను ఫ్రీగా నిర్మించేందుకు అంగీకరించింది. వ్యవసాయ రంగ వృద్ధికి సాయపడే పలు ఒప్పందాలు చేసుకుంది. ఇవన్నీ ఇరు దేశాల బంధాన్ని బలపరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

News March 31, 2024

విషాదం: గొంతులో చేప ఇరుక్కుని..

image

TG: గొంతులో పచ్చి చేప ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్ (45) మోతిఘణపూర్‌ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. ఒక చేపను తినేందుకు ప్రయత్నించగా అది గొంతులో ఇరుక్కుపోయింది. స్నేహితులు ఆ చేపను అతని నోట్లో నుంచి తీసేలోపే ఊపిరి ఆడక అతను ప్రాణాలు కోల్పోయాడు.

News March 31, 2024

యశ్‌కు సిస్టర్‌గా కరీనా కపూర్?

image

యశ్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించనుందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. మూవీలో కరీనా యశ్‌ సోదరి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక యశ్ సరసన కియారా అద్వానీ నటించనుందని సమాచారం. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

News March 31, 2024

నేడు హస్తినకు షర్మిల

image

APCC చీఫ్ షర్మిల ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. AICC నేతలతో ఆమె భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇటీవల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర కాంగ్రెస్.. వాటిని స్క్రూటినీ చేసింది. ఇవాళ ఢిల్లీ పెద్దలతో చర్చించి, ఆ జాబితాను ఫైనల్ చేయనున్నారు. మరోవైపు మరో నలుగురు MP అభ్యర్థులను ఖరారు చేసేందుకు TG CM రేవంత్ రెడ్డి కూడా హస్తిన వెళ్లనున్నారు.

News March 31, 2024

OTTలోకి బ్లాక్‌బస్టర్ మూవీ!

image

మాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ ఏప్రిల్ 5 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో మలయాళంలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనుంది. లోతైన గుహలో జారిపడిన యువకుడిని స్నేహితులు ఎలా కాపాడారన్న అంశంతో వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

News March 31, 2024

మెడికల్ కాలేజీల్లో 5,819 పోస్టుల భర్తీకి ఈసీ అనుమతి

image

TG: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,819 ఉద్యోగాల భర్తీకి ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సుల పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలని స్పష్టం చేశారు.

News March 31, 2024

సత్తెనపల్లి గడ్డపై సత్తా చాటేదెవరో?

image

AP: రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న నియోజకవర్గం పల్నాడు(D) సత్తెనపల్లి. ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడి నుంచే 2సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్ 4సార్లు, స్వతంత్రులు 3సార్లు, CPM, TDP 2సార్లు, CPI, YCP ఒక్కోసారి నెగ్గాయి. ఈసారి రాజకీయాల్లో తలపండిన అంబటి రాంబాబు (YCP), కన్నా లక్ష్మీనారాయణ(TDP) ఢీకొంటున్నారు.
#ELECTIONS2024

News March 31, 2024

ఉద్యోగులకు రేపు ఆప్షనల్ సెలవు

image

TG: షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఆప్షనల్ సెలవును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో మార్చి 31న సెలవును(ఇవాళ) ప్రకటించగా, తాజాగా దాన్ని సవరించింది.