News March 31, 2024

ఎండుతున్న చెరువులు

image

TG: రాష్ట్రంలో 50శాతం చెరువులు ఎండిపోయాయి. గతేడాది నుంచి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పాటు ప్రాజెక్టుల్లో నీరు లేక కాలువలకు వదలడంలేదు. మరో 10 రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటే మరిన్ని చెరువులు అడుగంటనున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో నీరు రావడంలేదు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు గ్రాసం కొరత ఏర్పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 31, 2024

వేల మంది ప్రాణాలు కాపాడిన లోకో‌పైలట్

image

లోకోపైలట్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై హైవోల్టేజ్ విద్యుత్ లైన్ పడి ఉండటాన్ని గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. కర్ణాటకలోని తుమూకూరు(D)లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ హాసన్‌కు బయలుదేరగా కుణిగల్ సమీపంలోని ట్రాక్‌పై విద్యుత్ తీగ పడి ఉంది. లోకో‌పైలట్ గమనించి రైలుని నిలిపివేశాడు. దీంతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

News March 31, 2024

2 నెలలు వేసవి సెలవులు.. నేటి నుంచే

image

TG: ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అటు ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌లో వెలువడే అవకాశాలున్నాయి.

News March 31, 2024

నేడు ఆ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగు నీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండా, సూర్యపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మ.3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించి, అనంతరం నల్గొండ జిల్లా నిడమనూరులో రైతులతో మాట్లాడతారు.

News March 31, 2024

మొదలైన రిటైర్మెంట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి సర్కార్ ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61కి పెంచింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణ మరో మూడేళ్లు పెరిగింది. ఆ గడువు మార్చి 31తో ముగుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సుమారు 336 మంది ఉద్యోగులు నిన్నే విరమణ పొందారు.

News March 31, 2024

ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా?

image

భారతీయులకు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొందరు నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు వెంటనే కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలి. retrieve-eid-uid వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News March 31, 2024

హౌస్ అలవెన్స్ కోసం ఇతరుల పాన్‌కార్డ్ వాడేస్తున్నారు!

image

అద్దె ఇంట్లో ఉంటున్న వారు హౌస్ అలవెన్స్ కోసం రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు మోసానికి తెరతీసినట్లు ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్ కార్డుల్ని అనధికారికంగా వాడేస్తున్నారట. సదరు పాన్‌కార్డుదారుడికీ ఆ విషయం తెలీదు. ఇలా అద్దెకు లేకపోయినా రెంట్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్న 8-10వేల కేసులపై దర్యాప్తు చేస్తున్నారు.

News March 31, 2024

రైల్వేలో 733 ఉద్యోగాలు

image

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 733 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ITI కోర్సుల్లో పాసై ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి. చివరి తేదీ ఏప్రిల్ 12.
> secr.indianrailways.gov.in

News March 31, 2024

‘దసరా’ కాంబోలో మరో సినిమా

image

సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది. గతేడాది వీరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నాని 33 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మేరకు ప్రీ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నాయకుడిగా ఉండటానికి గుర్తింపు అవసరం లేదు’ అని క్యాప్షన్ ఇచ్చారు.

News March 31, 2024

వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ: కారుమూరి

image

AP: చంద్రబాబు, ఆయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి లేఖ రాయించి వాలంటీర్ల సేవలను నిలిపివేయించారని దుయ్యబట్టారు. ‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా బాబుకి నచ్చదు. పెన్షన్ల కోసం వృద్ధులు ఎండలో నిలబడి సొమ్మసిల్లి పడిపోతే ఆయనకు సంతోషం. వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ నేడు బయటపడింది’ అంటూ విరుచుకుపడ్డారు.