News March 30, 2024

DK శివకుమార్‌కు ఐటీ నోటీసులు

image

కర్ణాటక డిప్యూటీ CM డికె.శివకుమార్‌కు ITశాఖ నోటీసులు ఇచ్చింది. తనకు నిన్న రాత్రి ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘కేంద్రంలోని BJP ప్రతిపక్షాలను ఎందుకు ఇలా వేధిస్తోంది? ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతో ఇవన్నీ చేస్తోంది. చివరికి కమ్యూనిస్టు పార్టీ నేతలను కూడా బీజేపీ టార్గెట్ చేసింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని మండిపడ్డారు.

News March 30, 2024

అందుకే అతడితో కెమిస్ట్రీ కుదిరింది: శ్రుతి హాసన్

image

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన స్నేహితుడని.. అందుకే ‘ఇనిమేల్’ పాటలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ అన్నారు. ‘లోకేశ్ గొప్ప దర్శకుడే కాకుండా నటుడు కూడా. ఈ పాట చేయడానికి ఆయన అంగీకరించినప్పుడు ఎగిరి గంతేశా. కెమెరా ముందు ఆయన బాగా నటించారు. తొలుత ఈ పాటను ఇంగ్లిష్‌లో రాశాం. ఆ తర్వాత నాన్న (కమల్ హాసన్) సాయంతో తమిళంలో చేశాం’ అని ఆమె చెప్పారు.

News March 30, 2024

తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: సీఎం

image

TG: వేసవి నేపథ్యంలో విద్యుత్, తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరుందని, నిరంతర నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

News March 30, 2024

IPL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

image

పంజాబ్‌తో మ్యాచులో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో నికోలస్ పూరన్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కు రెస్ట్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
PBKS: ధావన్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కరన్, జితేష్, శశాంక్, బ్రార్, హర్షల్, రబడా, చాహర్, అర్ష్‌దీప్
LSG: డీకాక్, రాహుల్, పడిక్కల్, బదోనీ, పూరన్, స్టోయినిస్, కృనాల్, బిష్ణోయ్, మొహ్సిన్, మయాంక్ యాదవ్, మణిమారన్

News March 30, 2024

పెళ్లైన కొన్ని గంటల్లోనే వధువు మృతి

image

AP: పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ నవ వధువు మృతిచెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డలో జరిగింది. నిన్న రాత్రి 10 గంటలకు ఓ యువకుడితో అఖిల (20) వివాహం జరిగింది. ఆ తర్వాత నీరసంగా ఉందంటూ నిద్రపోయారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా స్పందించకపోవడంతో వెంటనే ఆమెను సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.

News March 30, 2024

లాంగ్ లైఫ్ కావాలా? చదువుకోండి ఫస్టు: పరిశోధకులు

image

వ్యాయామం శరీరానికి మేలు చేసినట్టే చదువు కూడా చేస్తుందట! మూడు తరాలకు చెందిన 3,101 మందిపై US, నార్వే, UKకు చెందిన నిపుణులు పరిశోధించి ఈ విషయం కనుగొన్నారు. విద్యపై ఎంత ఎక్కువ కాలం గడిపితే వృద్ధాప్యం అంత నెమ్మదిగా వస్తుందట. శరీరంలోని కణాలు డ్యామేజ్ కావడాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఇది కచ్చితంగా ఎలా జరుగుతోందనే విషయంపై పరిశోధన చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

News March 30, 2024

ఏప్రిల్‌లో టీ20 WCకు భారత జట్టు ప్రకటన

image

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును BCCI ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. WC కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ICC గడువిచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు BCCI సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా IPL స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

News March 30, 2024

త్వరలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు

image

AP: గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై APPSC సభ్యుడు పరిగె సుధీర్ కీలక అప్డేడ్ ఇచ్చారు. త్వరలో గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఫిబ్రవరి 25న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 4 లక్షల మంది హాజరయ్యారు.

News March 30, 2024

ఎన్నికల తర్వాతే డీఎస్సీ, టెట్ ఫలితాలు: ఈసీ

image

AP: ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.

News March 30, 2024

KCR పర్యటన షెడ్యూల్ ఇదే..

image

ఎండిన పంటలను పరిశీలించేందుకు BRS అధినేత KCR రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉ.8:30గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరుతారు. 10:30కు ధ‌రావ‌త్ తండాకు(జ‌న‌గామ), 11:30కి తుంగ‌తుర్తి, అర్వ‌ప‌ల్లి, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాలు(సూర్యాపేట), మ.2గంటలకు సూర్యాపేట MLA ఆఫీసులో భోజనం, 3గంట‌ల‌కు ప్రెస్ కాన్ఫ‌రెన్స్, సా.4:30లకు నిడ‌మ‌నూరు మండ‌లం, సా.6గంటలకు ఎర్ర‌వల్లికి బ‌య‌ల్దేర‌తారు.