News March 30, 2024

ఫసల్ బీమా స్కీమ్.. రాష్ట్ర వాటా రూ.1500 కోట్లు!

image

TG: రాష్ట్రంలో PM ఫసల్ బీమా యోజన పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రీమియంలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రతి సీజన్‌కు ₹1500 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అలాగే రాష్ట్రమంతటా ఒకే బీమా విధానం కాకుండా ప్రాంతం, పంటల ఆధారంగా వేర్వేరు ప్రీమియంలు ఉండాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది.

News March 30, 2024

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: ఈసీ

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై EC ఆంక్షలు విధించింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ రోజైన జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలు, సర్వేలు ప్రసారం చేయొద్దని ఆదేశించింది.

News March 30, 2024

బీజేపీ ఎమ్మెల్యేలూ టచ్‌లో ఉన్నారు: కోమటిరెడ్డి

image

బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. విపక్షాల నేతలు వారి వారి పార్టీలతో విసుగెత్తిపోయారని అభిప్రాయపడ్డారు. ‘ఈ వరద ఇప్పట్లో ఆగదు. ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయి. మేం గేట్లు తెరవలేదు. నేతలే గేట్లను బద్దలుగొట్టి మరీ పార్టీలో చేరుతున్నారు. 12మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

News March 30, 2024

డీఎస్సీ వాయిదా

image

AP: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో DSC నిలిచిపోయింది.

News March 30, 2024

నేను గొర్రెను కాను: RSP

image

TG: ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తాను BRS పార్టీని వీడనని RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ‘కడియం, కేకే వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంతో నేను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. బహుజనవాదం, తెలంగాణవాదం కలిసేందుకే నేను KCRతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.

News March 30, 2024

నేటి నుంచి పవన్ ప్రచారం

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ‘వారాహి విజయభేరి యాత్ర’ పేరిట ప్రచారం చేయనున్నారు.

News March 30, 2024

ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

image

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

News March 30, 2024

IPL: నేడు లక్నో-పంజాబ్ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఎల్ఎస్‌జీ, పంజాబ్ కింగ్స్ లక్నోలో తలపడనున్నాయి. గత ఏడాది ఈ రెండూ పంజాబ్‌లో మ్యాచ్ ఆడాయి. లక్నో 257 పరుగులు చేయగా.. పంజాబ్ 201 రన్స్ చేసి ఓడింది. లక్నో పిచ్ మందకొడిగా ఉండటంతో ఈరోజు మ్యాచ్‌లో ఆ స్థాయిలో పరుగులు రాకపోవచ్చంటున్నారు క్రీడా విశ్లేషకులు. ప్రస్తుతం పంజాబ్ 2 మ్యాచులాడి ఒక విజయాన్ని సాధించగా.. లక్నో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.

News March 30, 2024

రష్యాతో యుద్ధం.. ఉక్రెయిన్‌కు విద్యుత్ సంక్షోభం

image

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌పై విద్యుత్ సంక్షోభపు కత్తి వేలాడుతోంది. ఆ దేశ విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా మాస్కో దాడులు చేస్తోంది. పలు చోట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల కరెంటు కోతలు చేపట్టామని, మున్ముందు ఇది మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఇంధన ఉగ్రవాదమేనంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2024

మే మొదటివారం రాష్ట్రానికి పీఎం మోదీ

image

TG: ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మే నెలలో రాష్ట్రానికి రానున్నారు. మే 5 నుంచి 7 వరకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. మే 13న పార్లమెంటు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం ఎన్నికలకు వీలైనంత సమీపంలో ఉండేలా బీజేపీ ప్రణాళిక రచించుకుంటున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఈసారి రెండంకెల సీట్లను సాధిస్తామంటోంది కాషాయదళం.