India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. అందరికీ న్యాయం చేయడం కోసమే సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని సూచించారు.
JEE అడ్వాన్స్డ్ పరీక్షలను ఇకపై వరుసగా మూడేళ్లు రాయొచ్చు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉండగా, 2025లో నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష నుంచి మూడు సార్లు అటెంప్ట్ చేయొచ్చని కేంద్రం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2023లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ సారి పరీక్ష రాయవచ్చని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొంది.
ఆస్ట్రేలియాతో జరిగే BGTలో విఫలమైతే రోహిత్ టెస్టులకు గుడ్బై చెప్పొచ్చని మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు BCCI ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అతడి వయసు పెరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కివీస్ సిరీస్లో ఆడలేదని రోహిత్ అంగీకరించడం గ్రేట్. అతను గాడినపడేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ విఫలమైతే అతడే తప్పుకుంటాడు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ప్రభుత్వ పాలనలో ఆయనకు సాయపడతానని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఫెడరల్ ఏజెన్సీల సంఖ్యను కుదిస్తానని పేర్కొన్నారు. ‘మన బ్యూరోక్రసీ చాలా పెద్దది. పైగా మన దేశంలో నియంత్రణలు ఎక్కువ. వాటిని తగ్గించాల్సి ఉంది. అమెరికాను మరింత మెరుగ్గా నిర్మించేవాళ్లకు సాయపడాలి’ అని టక్కర్ కార్ల్సన్షోలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా గెలుస్తారని మస్క్ నమ్మకంతో ఉన్నారు.
AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది. మచిలీపట్నం-రేపల్లె మధ్య 45.30KM DPR కోసం ₹1.13 కోట్లు, బాపట్ల-రేపల్లె మధ్య 45.81KM మేర DPRకై రూ.1.15 కోట్లు విడుదలయ్యాయి. ఈ 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే చెన్నై-హౌరా వెళ్లే రైళ్లు విజయవాడ వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా రాకపోకలు సాగించవచ్చు. విజయవాడ స్టేషన్పై భారం తగ్గుతుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. APలో 200, TGలో 200 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్లో స్థానిక భాషను చదివి ఉన్నవారు అర్హులు. వయసు OCT 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం రూ.77 వేల వరకు పొందొచ్చు. వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘ఆవేశం’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ను మాస్ మహారాజా రవితేజ కొనుగోలు చేశారని, దీనిని ఆయన రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. జీతూ మాధవన్ ‘ఆవేశం’ మూవీని తెరకెక్కించగా ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజై రూ.150కోట్లు వసూలు చేసింది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, US ఎన్నికల ఫలితాలు ఒకే దిశగా సాగుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 5% తగ్గడం అనిశ్చితి తగ్గిందనడానికి నిదర్శనం. సెన్సెక్స్ 79911 (+435), నిఫ్టీ 24,386 (+173) వద్ద ట్రేడవుతున్నాయి. IT, రియాల్టి, Oil & Gas సూచీలు అదరగొడుతున్నాయి. Infy, Trent టాప్ గెయినర్స్.
అమెరికా ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కువ ఓట్లు(పాపులర్ ఓటింగ్) పొందిన అభ్యర్థి కాకుండా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ వచ్చినవారే ప్రెసిడెంట్ అవుతారు. 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటాయి. పార్టీలు నిలబెట్టిన ఎలక్టర్లకు ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్లు ప్రెసిడెంట్, వైస్ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. 2016లో హిల్లరీకి అధిక ఓట్లు వచ్చినా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు.
APలో మరో ఘోరం జరిగింది. నెల్లూరు నగరంలో రీల్స్ పేరుతో బాలిక(14)ను మభ్యపెట్టి ఆటోడ్రైవర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి, ఇతర బంధువులు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై నవాబుపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.