News March 29, 2024

ఘోరం.. 32,552 మంది పాలస్తీనియన్లు మృతి

image

ఇజ్రాయెల్-గాజాల మధ్య యుద్ధం ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ కాల్పుల్లో గాజా స్ట్రిప్‌లో 32,552 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 91 మందికి గాయాలయ్యాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతీకారంగా చేసిన ప్రతిదాడిలో అప్పుడు 1200 మంది చనిపోయారు.

News March 29, 2024

డీజిల్ ఎగుమతి ఆదాయం ఢమాల్!

image

ఈ ఆర్థిక ఏడాది డీజిల్ ఎగుమతులతో భారత్‌కు వచ్చే ఆదాయం అంతకుముందుతో పోలిస్తే 25శాతం క్షీణించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో 11 నెలల్లో (APR-FEB) వచ్చిన మొత్తం $20 బిలియన్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో అంతకుముందుతో పోలిస్తే డీజిల్ ఎగుమతి 25.8 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 26mmtకి పెరిగినా ఫలితం లేకపోయింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతుల ఆదాయం సైతం 13% క్షీణించి $10 బిలియన్లుగా నమోదైంది.

News March 29, 2024

పిల్లల కోసం తండ్రులు జంప్!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో BRSలో కీలకంగా ఉన్న నాయకులు సైతం ఇతర పార్టీలకు జై కొడుతున్నారు. ఫిరాయింపులు నచ్చకపోయినా వారి పిల్లల కోసమే పార్టీ వీడుతున్నారట. కుమార్తె కావ్య కోసం కడియం శ్రీహరి, కూతురు విజయలక్ష్మి కోసం కేకే, తనయుడు భరత్ కోసం పోతుగంటి రాములు పార్టీని వీడారు. అయితే, కాంగ్రెస్‌ని వీడకుండా అంటిపెట్టుకున్న జానారెడ్డి విజయం సాధించారు. తన వారసుల్లో ఒకరిని MLA చేయగా.. మరొకరికి MP సీటు లభించింది.

News March 29, 2024

పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్

image

పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది మూత్రాశయం, సమీప అవయవాలకు వ్యాపిస్తుంది. దీనిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్ర ప్రవాహంలో ఇబ్బందులు, రాత్రి వేళల్లో ఎక్కువగా యూరిన్ రావడం, యూరినేషన్ సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రమైన వారి కాళ్లలో వాపు కనిపిస్తుందట.

News March 29, 2024

కేసీఆర్ పాపాల వల్లే ఈ కరవు: కోమటిరెడ్డి

image

TG: మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల వల్లే ఈ కరవు వచ్చిందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చేసిన పాపాలే తనకు చుట్టుకున్నాయని ఆరోపించారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని కోమటిరెడ్డి అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మంత్రి మండిపడ్డారు.

News March 29, 2024

ప్రతి ప్లేయర్‌ను గౌరవించాలి.. వారే మన హీరోలు: సోనూసూద్

image

MI కెప్టెన్‌ను మార్చడంతో హార్దిక్‌పై రోహిత్ ఫ్యాన్స్ ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈక్రమంలో నటుడు సోనూసూద్ ఫ్యాన్స్‌కు పలు సూచనలు చేశారు. ‘మన దేశాన్ని గర్వపడేలా చేసిన ఆటగాళ్లను మనం గౌరవించాలి. ప్రతి భారత క్రికెటర్‌ని నేను ప్రేమిస్తున్నాను. ప్లేయర్ ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడన్నది ముఖ్యం కాదు. కెప్టెన్‌గా ఆడినా 15వ ప్లేయర్‌ అయినా సరే. వారే మన హీరోలు’ అని ట్వీట్ చేశారు.

News March 29, 2024

ఏ సంచలనం నమోదు చేస్తారో?

image

ఇవాళ RCB, కేకేఆర్ మధ్య బెంగళూరు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచుల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. IPLలోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ(49) KKRపై చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరోవైపు సొంత మైదానంలో KKRపై 2015 తర్వాత విజయం సాధించలేకపోయింది. మరి ఈ మ్యాచులో గెలిచి పరాజయాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.

News March 29, 2024

కేజ్రీవాల్ అరెస్ట్.. జర్మనీ, అమెరికా బాటలోనే యూఎన్ కూడా!

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించి కేంద్రం నుంచి జర్మనీ, అమెరికాలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితి చేరింది. ‘భారత్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌర హక్కులకు భంగం కలగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాము’ అని UN పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందా? అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది.

News March 29, 2024

బుమ్రా పేరిట చెత్త రికార్డు

image

టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కారు. 2013లో ఐపీఎల్ డెబ్యూ చేసిన బుమ్రా ఇప్పటి వరకు 29 నో బాల్స్ వేశారు. అతడి తర్వాతి స్థానాల్లో ఉమేశ్ యాదవ్(24), శ్రీశాంత్(23), ఇషాంత్ శర్మ(22), అమిత్ మిశ్రా(21), లసిత్ మలింగ(18) ఉన్నారు.

News March 29, 2024

మార్చి 31లోపు చేయాల్సిన పనులివే

image

* మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు రీకేవైసీ పూర్తి చేయాలి.
* బ్యాంకుల్లో ఆధార్, పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్‌డేట్ చేయాలి.
* ఐటీ రిటర్న్, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయాలి.
* SBI అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది.
* గృహ రుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్న ప్రత్యేక రాయితీలు మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి.