India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది. మచిలీపట్నం-రేపల్లె మధ్య 45.30KM DPR కోసం ₹1.13 కోట్లు, బాపట్ల-రేపల్లె మధ్య 45.81KM మేర DPRకై రూ.1.15 కోట్లు విడుదలయ్యాయి. ఈ 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే చెన్నై-హౌరా వెళ్లే రైళ్లు విజయవాడ వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా రాకపోకలు సాగించవచ్చు. విజయవాడ స్టేషన్పై భారం తగ్గుతుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. APలో 200, TGలో 200 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్లో స్థానిక భాషను చదివి ఉన్నవారు అర్హులు. వయసు OCT 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం రూ.77 వేల వరకు పొందొచ్చు. వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘ఆవేశం’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ను మాస్ మహారాజా రవితేజ కొనుగోలు చేశారని, దీనిని ఆయన రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. జీతూ మాధవన్ ‘ఆవేశం’ మూవీని తెరకెక్కించగా ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజై రూ.150కోట్లు వసూలు చేసింది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, US ఎన్నికల ఫలితాలు ఒకే దిశగా సాగుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 5% తగ్గడం అనిశ్చితి తగ్గిందనడానికి నిదర్శనం. సెన్సెక్స్ 79911 (+435), నిఫ్టీ 24,386 (+173) వద్ద ట్రేడవుతున్నాయి. IT, రియాల్టి, Oil & Gas సూచీలు అదరగొడుతున్నాయి. Infy, Trent టాప్ గెయినర్స్.
అమెరికా ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కువ ఓట్లు(పాపులర్ ఓటింగ్) పొందిన అభ్యర్థి కాకుండా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ వచ్చినవారే ప్రెసిడెంట్ అవుతారు. 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటాయి. పార్టీలు నిలబెట్టిన ఎలక్టర్లకు ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్లు ప్రెసిడెంట్, వైస్ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. 2016లో హిల్లరీకి అధిక ఓట్లు వచ్చినా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు.
APలో మరో ఘోరం జరిగింది. నెల్లూరు నగరంలో రీల్స్ పేరుతో బాలిక(14)ను మభ్యపెట్టి ఆటోడ్రైవర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి, ఇతర బంధువులు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై నవాబుపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో కొందరు విదేశీ స్టార్ ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ప్రకటించుకున్నారు. వీరిలో వార్నర్, స్టార్క్, స్టీవ్ స్మిత్, స్టొయినిస్, బెయిర్స్టో, జంపా, అట్కిన్సన్, బట్లర్, రబాడ, మ్యాక్స్వెల్, విలియమ్సన్, మార్క్ వుడ్, ఆర్చర్, మార్ష్, జంపా తదితరులు ఉన్నారు. వీరిలో ఎవరు అత్యధిక ధర పలుకుతారో కామెంట్ చేయండి.
TG: సమగ్ర కుటుంబ సర్వేలో వినియోగించే ఫారాల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు ప్రత్యేక కాలమ్స్ ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులేంటో తెలియజేయాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొంది. దీనిపై పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంది. విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.
తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ <<14532979>>గ్రాడ్యుయేట్<<>>, టీచర్ MLC, APలోని గుంటూరు-కృష్ణా, తూర్పు-ప.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల <
AP: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు YCPకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపై YSR జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారించి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదులతో ఏప్రిల్లోనే ఆయనను ఈసీ సస్పెండ్ చేయగా, చర్యల్లో భాగంగా విచారణకు ప్రభుత్వం నిన్న ఆదేశాలిచ్చింది.
Sorry, no posts matched your criteria.