India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎన్నికల కౌంటింగ్లో దూసుకెళ్తున్నారు. 20 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మిసిసిపీ, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో, ఓక్లహామో, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, టెక్సాస్, మిస్సోరీలో విజయం సాధించారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందారు. ఇల్లినోయీ, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్లో గెలిచారు.
ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలానికి మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో భారత్ నుంచి 1,165 మంది ప్లేయర్లు ఉన్నారు. సౌతాఫ్రికా-91, ఆస్ట్రేలియా-76, ఇంగ్లండ్-52, న్యూజిలాండ్-39, వెస్టిండీస్-33, అఫ్గానిస్థాన్-29, శ్రీలంక-29, బంగ్లాదేశ్-12, నెదర్లాండ్స్-12, యూఎస్ఏ-10, ఐర్లాండ్-9, జింబాబ్వే-8, కెనడా-4, స్కాట్లాండ్-2, యూఏఈ-1, ఇటలీ-1 నమోదు చేసుకున్నారు.
AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన నూతన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు బోర్డు సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
అమెరికా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లైవ్ సెషన్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఫలితాల ప్రకటన తర్వాత తన ప్రణాళిక ఎలా ఉంటుందో వెల్లడించారు. ఒకవేళ తన తండ్రి గెలవకపోతే డెమొక్రట్ల పనితీరు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను వేరే దేశానికి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ట్రంప్ 188 ఓట్లతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
తెలంగాణలో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్పై బ్రాండ్ను బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.
TG: నేటి నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలను అడగనున్నారు. అయితే సర్వేలో భాగంగా కుటుంబ ఫొటోలు ఏమీ తీయరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. ఇంట్లో అందరూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది. కుటుంబీకుల్లో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులు వారి ప్రస్తుత, పూర్వపు పదవీ వివరాలు చెప్పాలి. సమాచారం గోప్యంగా ఉంచుతారు.
జీవితంలో ఎన్నో ఒడిదొడుకులతో పాటు తప్పులు కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు కొందరు తప్పు చేశామని ఎంతో బాధపడుతుంటారు. అయితే, మనం చేసే ప్రతి తప్పు ఒక గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటుందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ‘తప్పు దిద్దుకొని ముందడుగు వెయ్యకపోతే ఓటమి నుంచి బయటపడలేమని తెలుసుకొని మసలుకోండి సన్నిహితులారా’ అని ట్విటర్లో పోస్ట్ చేశారు.
సూపర్స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 8 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లోని నీటిని తాగు, సాగుకి వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. 2025 వానాకాలం వరకు రిజర్వాయర్లలో నీరు ఉండేలా చూసుకోవాలని సూచించింది. విద్యుదుత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని, అవసరం లేకుండా ఇతర కాంపోనెంట్ల ద్వారా నీటి తరలింపు ఆపాలంది.
తెలుగు వారిపై అనుచిత<<14525601>> వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. ఆమెపై పలు తెలుగు, తమిళ సంఘాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భారీ నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు సెక్షన్లతో ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ కస్తూరి క్షమాపణలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.