India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం కేంద్రమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పవన్ వివరించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా చర్చించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రేపు రాత్రి రాష్ట్రానికి తిరుగుపయనం కానున్నట్లు సమాచారం. కాగా హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.
TG: టెట్ దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తులు ఆలస్యమవుతుండడంపై స్పందించిన విద్యాశాఖ ఈనెల 7 నుంచి అప్లై చేసుకోవాలని సూచించింది. వాస్తవానికి నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తగా అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో IRCTC కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు చేసింది. రైలు ప్రయాణం చేసేవారికి బీమా ప్రీమియం 45 పైసలుగా నిర్ణయించింది. ఇ-టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది తప్పనిసరి చేసింది. అయితే టికెట్లు బుక్ చేసుకున్నా 5 ఏళ్ల లోపు వారిని ఈ పాలసీలోకి చేర్చలేదు. టికెట్ బుక్ చేసుకున్నాక బీమా కంపెనీ సైట్లో నామినీ వివరాలు సమర్పించాలి.
ఐపీఎల్ మెగావేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆయా జట్లు రిటెన్షన్ జాబితాను సమర్పించాయి. ఈ మెగా వేలం కోసం 1,574 ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 320 మంది క్యాప్డ్, 1,224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.
కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మికంగా మరణించడంతో ఫ్లిప్కార్ట్లో డెలివరీ పర్సన్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తామామ, పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఆమె రేయింబవళ్లు శ్రమిస్తోంది. సుప్రీతి ఎందరికో స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
AP: పోలవరం ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ముఖ్యమని తెలిపారు. 2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.
TG: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ నేతలకు మాట ఇస్తే అది శాసనమని అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పారు. దీనిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్-దీపికా తమ కూతురికి ‘దువా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలువురు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. దువా అనేది ఇతర మతానికి సంబంధించిన పేరని, హిందూ పేరు పెట్టడానికి మనసు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో పేరు పెట్టడం తల్లిదండ్రుల ఇష్టమని, ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు.
అమెరికా ఎన్నికల్లో పోలైన ఓట్లను ముందుగా లెక్కిస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్, అభ్యంతరాలు ఉన్న ఓట్లను, విదేశాల్లో ఉన్నవారి ఓట్లు లెక్కిస్తారు. ఉన్న ఓట్లతో పోలైన ఓట్లను వెరిఫై చేస్తారు. ప్రతి బ్యాలెట్ను క్షుణ్నంగా పరిశీలించి డ్యామేజీ, చిరిగిన వాటిని చెల్లని ఓట్లుగా ధ్రువీకరిస్తారు. మొత్తంగా పేపర్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ బ్యాలెట్, మెయిల్-ఇన్ ఓట్లను స్కాన్ చేసి ఫలితాలను లెక్కిస్తారు.
AP: రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జీవో 77 రద్దుతో పాటు స్పోర్ట్స్, డేటా సెంటర్, డ్రోన్, సెమీకండక్టర్ పాలసీలకు ఆమోదం తెలిపే ఛాన్సుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 స్థానంలో కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. YCP ప్రభుత్వం తెచ్చిన నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది.
Sorry, no posts matched your criteria.