News November 5, 2024

వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

image

AP: దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. పూజారులకు రూ.15వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మొత్తంగా 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

News November 5, 2024

జగన్.. ఐదేళ్లలో నువ్వేం చేశావ్?: మంత్రి అనిత

image

AP: ఇప్పుడు లా&ఆర్డర్ గురించి మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు వైసీపీ పాపాలే కారణమన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. వాస్తవాలను కాకుండా జగన్ సైకో బ్యాచ్‌ సోషల్ మీడియాలో తమపై బురదజల్లుతూ, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.

News November 5, 2024

ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద‌’న్న అవుతారు!

image

అమెరికా ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌యం సాధిస్తే అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అధిక వ‌య‌స్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బైడెన్ వ‌య‌సు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాటి వ‌య‌సుతో పోల్చితే ట్రంప్ వ‌య‌సు ఐదు నెల‌లు అధికం. ఈ లెక్క‌న ట్రంప్ గెలిస్తే అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసే పెద్ద‌ వ‌య‌స్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చ‌రిత్ర సృష్టిస్తారు.

News November 5, 2024

తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్

image

TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.

News November 5, 2024

రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో శరద్ పవార్!

image

రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని శ‌ర‌ద్ ప‌వార్ (83) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బారామ‌తి ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ ‘రాజ్య‌స‌భ MPగా ఏడాదిన్న‌ర పద‌వీకాలం మిగిలింది. ఇప్పటివరకు పోటీ చేసిన 14 ఎన్నిక‌ల్లో ప్ర‌తిసారీ న‌న్ను గెలిపించారు. ఇక ఎక్క‌డో ఒక‌చోట ఆపేయాలి. రాబోయే 30 ఏళ్లపాటు పనిచేసే కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మంచి చేయ‌డానికి రాజ‌కీయాలు అవ‌స‌రం లేద‌న్నారు.

News November 5, 2024

రాంగ్ రూట్‌లో వెళ్తే రూ.2,000 ఫైన్

image

హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ పకడ్బందీగా అమలులోకి వచ్చాయి. రూల్స్ బ్రేక్ చేస్తే మునుపటిలా చూసీచూడనట్లు వదిలేయడం ఇక ఉండదు. హెల్మెట్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే రూ.200 ఫైన్ వేస్తారు. రాంగ్ రూట్‌లో నడిపితే రూ.2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌పై సస్పెన్షన్ కూడా విధిస్తారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

News November 5, 2024

గంభీర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్

image

తన పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ గంభీర్‌ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రిప్లై ఇచ్చారు. ‘ఈయనే 25 ఏళ్ల వ్యక్తి. ప్రతి ఏటా మీ శక్తి, తేజస్సు మరింత పెరుగుతూ వస్తోంది. మీరు ఎప్పటికీ ప్రేమను పంచుతూ ఉండండి’ అని గంభీర్ ట్వీట్ చేశారు. దీనికి షారుఖ్ స్పందిస్తూ ‘నాకు 25 ఏళ్లా? నేనింకా చిన్నవాడిని అనుకున్నానే. హ హ. స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు థాంక్స్. మీరెప్పటికీ నా కెప్టెనే’ అని రిప్లై ఇచ్చారు.

News November 5, 2024

నా వ్యాఖ్యలు బాధపెడితే క్షమించండి: కస్తూరి

image

తాను చేసిన <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళ నటి కస్తూరి ప్రకటన విడుదల చేశారు. ‘రెండ్రోజులుగా నాకు బెదిరింపులు వస్తున్నాయి. నేను నిజమైన జాతీయవాదిని. కుల, ప్రాంతీయ భేదాలకు నేను అతీతం. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను మాట్లాడింది నిర్దిష్ట వ్యక్తుల గురించి మాత్రమే. ఎవరినైనా బాధపెడితే క్షమించండి. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News November 5, 2024

అక్టోబర్ మాసం: దేశంలో 4లక్షల కార్ల విక్రయం

image

అక్టోబర్‌లో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా, దీపావళి పండుగలు ఉండటంతో ప్రజలు భారీగా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేశారు. ఒక్క నెలలోనే దేశంలో 4,01,447 కార్ల అమ్మకం జరిగింది. వీటిలో మారుతీ సుజుకి అధికంగా 1,59,591 కార్లను విక్రయించింది. వీటి తర్వాత హుండాయ్(55,568), మహీంద్రా (54,504), టాటా మోటార్స్ (48,131), టయోటా (30,845), కియా మోటార్స్(28,545) ఉన్నాయి.

News November 5, 2024

బిర్యానీ తిని యువతి మృతి

image

TG: కొన్ని రోజుల క్రితం HYDలో మోమోస్ తిని ఓ మహిళ మరణించిన ఘటన మరవకముందే మరో విషాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్‌తో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్‌కు చెందిన 15-20 మంది నిర్మల్‌లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్‌లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ పూల్ కలి బైగా(19) మృతి చెందింది.