India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మరికొన్ని గంటల్లో USA అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారు. నాసా పంపిన అప్లికేషన్లో వారు ఓటేయగానే ఆ డేటాను శాటిలైట్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. దీనిని ఓటరు, ఎన్నికల అధికారి మాత్రమే చూడగలరు. కాగా, ఇలా తొలిసారి 1997లో డేవిడ్ వోల్ఫ్ ఓటేయగా చివరిసారి 2020లో కేట్ రూబిన్స్ ఓటేశారు.
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య అనుష్క శర్మ ఇన్స్టాలో ఓ ఫొటోను షేర్ చేశారు. కూతురు వామిక, కొడుకు అకాయ్తో కోహ్లీ సరదాగా గడిపిన సందర్భాన్ని ఫొటోలో చూపించారు. అయితే, ఇద్దరు పిల్లల ముఖాలు కనిపించకుండా స్టిక్కర్తో కవర్ చేశారు. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
TG: ఫుడ్ పాయిజన్తో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ విద్యార్థినులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
వయనాడ్లో ప్రియాంకా గాంధీ గెలిస్తే తరువాత నియోజకవర్గంలో పెద్దగా కనిపించరని వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. తన కుమారుడు బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నప్పుడు అతణ్ని చూసేందుకు నిత్యం వెళ్లేదాన్నని, అయితే కొన్ని రోజులకు రావడం తగ్గించండని ప్రిన్సిపల్ కోరారని తెలిపారు. ఆ ప్రిన్సిపల్ మాదిరిగానే ఇక్కడికి రావడం తగ్గించి ఢిల్లీలో ఉండండని వయనాడ్ ప్రజలు చెప్పే రోజు వస్తుందన్నారు.
డుగ్.. డుగ్ అని సౌండ్ చేస్తూ రోడ్డుపై వెళ్తోన్న వారి చూపును అట్రాక్ట్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎలక్ట్రిక్ వెహికల్ను లాంఛ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో లాంఛ్ అయిన ఈ బైక్ 2026లో అందుబాటులోకి రానుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం వాడిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఇంజిన్ ఉండే చోట బ్యాటరీని ఉంచారంతే. 100 KM రైడింగ్ రేంజ్ ఉండొచ్చు.
భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న ‘పుష్ప-2’ సినిమా ప్రమోషనల్ టూర్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. మిడ్ నవంబర్లో ట్రైలర్ ఈవెంట్ సహా 6 నగరాల్లో మూవీ టీమ్ ప్రోమోషన్స్లో పాల్గొంటుందని సినీ వర్గాలు తెలిపాయి. పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో అల్లు అర్జున్ సందడి చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
కేంద్ర మంత్రి కుమార స్వామి, అయన కుమారుడు నిఖిల్పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ అనుమతుల మంజూరు కేసులో దర్యాప్తు చేస్తున్నతనను కుమార స్వామి బహిరంగంగా బెదిరించారని ఆరోపిస్తూ సిట్ చీఫ్, ADGP చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా కర్ణాటక క్యాడర్ నుంచి మరో క్యాడర్కు బదిలీ చేయిస్తానని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ను భారత్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఈ లేఖను Oct 1న పంపినట్టు తెలిసింది. గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వహణపై భారత ఆకాంక్షను వ్యక్తం చేశారు.
AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.
AP: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మాజీ సీఎం జగన్ తన ఇంటి గేటు దగ్గర సిబ్బందికే రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినా కొన్ని నేరాలు జరుగుతుండటంతో బాధగా ఉంది. శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆమె హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.