India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ను సీఎం రేవంత్ టార్గెట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్ చేసుకున్నారని, అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై ఏం మాట్లాడట్లేదని మీడియాతో చిట్ చాట్లో వ్యాఖ్యానించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు, ఆటో డ్రైవర్లు, రైతులు, నేతన్నల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సరిహద్దు వివాదం నెలకొన్నప్పటికీ భారత్లో చైనా సెంట్రల్ బ్యాంకు (PBOC) భారీ పెట్టుబడులే పెట్టింది. 2024లో రూ.40వేల కోట్ల విలువైన 35 కంపెనీల స్టాక్స్ను హోల్డ్ చేసింది. అత్యధికంగా ICICIలో రూ.6139CR, HDFC BANKలో రూ.5303CR, TCSలో రూ.3619CR, పవర్గ్రిడ్లో రూ.1414CR, కొటక్ బ్యాంకు, HUL, బజాజ్ ఫైనాన్స్లో మొత్తంగా రూ.1500CRను ఇన్వెస్ట్ చేసింది. FDIకి అనుమతి లేకపోవడంతో చైనా FPI, FIIల మార్గం ఎంచుకుంది.

1980-90ల మధ్య జరిగే కథ OG(ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ‘ఎక్కడికెళ్లినా అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే అవి నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. నేను అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చినా చిత్ర బృందాలు సద్వినియోగం చేసుకోలేదు. హరిహరవీరమల్లు 8 రోజుల షూటింగ్ ఉంది. త్వరలోనే రెండు మూవీలను పూర్తిచేస్తా’ అని తెలిపారు.

AP: రాష్ట్రాన్ని అప్పుల కుప్పపై కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబూ? అని వైసీపీ ప్రశ్నించింది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే 6 నెలల్లో రూ.1,12,750 కోట్ల అప్పు చేశారని విమర్శించింది. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో పౌర సరఫరాల సంస్థ పేరుతో, ఏపీఎండీసీ, రాజధాని పేరుతో అప్పులు చేసిందంటూ ఓ పోస్టర్ను షేర్ చేసింది. ఇక మిగిలిన నాలుగున్నరేళ్లలో ఎంత అప్పు చేస్తుందో? అని ఎద్దేవా చేసింది.

సంక్రాంతికి సరదాగా ఎగురవేసే గాలిపటాలకు వాడే మాంజాలు మనకే పాశాలుగా మారుతున్నాయి. ఏటా చైనా మాంజాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జనగామ (TG)లో మాంజా దారం మెడకు చిక్కుకుని నలుగురు గాయపడ్డారు. సెలవులు ఇచ్చి, పండుగ దగ్గర పడేకొద్దీ పతంగులు ఎగరేయడం ఎక్కువవుతుంది. ఈ మాంజా వాడితే ప్రమాదాలూ ఎక్కువయ్యే అవకాశముంది. కాబట్టి గాలిపటం తెగినా ఫర్వాలేదు కానీ వీటిని వాడకండి.
Share It

మెల్బోర్న్ టెస్టులో టీమ్ఇండియా ఘోర ఓటమిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీ, రోహిత్ వీడ్కోలు పలకాలంటూ Retire హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే 55k పోస్టులు పెట్టారు. ‘సిగ్గుంటే రోహిత్, కోహ్లీ రిటైరవ్వాలి’, ‘టెస్టులకు అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం అవమానం కాదు. రోహిత్, కోహ్లీ ఇంకా ఆడుతుండగా ఇవ్వడమే అవమానం’, ‘భారత్కు బ్యాడ్న్యూస్. ఎవ్వరూ రిటైరవ్వడం లేదు’ అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

TG: వాజ్పేయి తరహాలోనే మన్మోహన్ సింగ్కు అంత్యక్రియలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధానిగా సేవలందించిన నెహ్రూ కుటుంబేతర వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తగిన విధంగా గౌరవించలేదని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

Mon ప్రారంభ సెషన్ను లాభాలతో ఆరంభించిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగించాయి. Sensex 78,248 (-450) వద్ద, నిఫ్టీ 23,644 (-168) వద్ద స్థిరపడ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, మెటల్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ ఇండెక్స్ రాణించాయి. Sensexలో 79,090 వద్ద, నిఫ్టీలో 23,900 వద్ద కీలక రెసిస్టెన్స్ సూచీలకు అడ్డుగోడలా నిలిచింది.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది IMDb అత్యంత ఆదరణ పొందిన టాప్-10 చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

CM రేవంత్ గొప్ప నాయకుడని <<15019113>>కొనియాడిన<<>> Dy.CM పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్టు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ‘అల్లు అర్జున్ కోసమే అసెంబ్లీ పెట్టినట్లు ఉంది. పుష్ప-2 విడుదలకు ముందే రేవంత్ సినిమా చూపించారు. వారిమధ్య 14% కమీషన్ దగ్గర చెడినట్లుంది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.