India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్లో ఉన్న ఓ హుక్కా పార్లర్పై అర్ధరాత్రి రైడ్ చేసి, అతనితో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. హెర్బల్ హుక్కా ముసుగులో పొగాకు ఆధారిత హుక్కా వాడుతున్నారన్న సమాచారం రావడంతో రైడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పొగాకు హుక్కా పీల్చినట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
TG: తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి నేడు సీజేఐ చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి(D) బుద్వేల్లో సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పాత భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్ కోర్టు అవసరాలకు వినియోగించనున్నారు.
మార్చి-జూన్ మధ్య వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో ఈసీ అప్రమత్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, సరైన నీడ, మెడికల్ కిట్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలంది. సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, పోలింగ్ ఏజెంట్లకు ఫర్నీచర్తో పాటు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
క్రికెటర్ అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం!!’ అని రాయుడు పోస్ట్ చేశారు. నేటి నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రాయుడు ‘సిద్ధం’ అని పోస్ట్ చేయడంతో మళ్లీ వైసీపీలోకి వస్తారా? అనే చర్చ మొదలైంది. కాగా, గతేడాది DECలో వైసీపీలో చేరిన రాయుడు.. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ను కలిశారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటిదాకా బీజేపీ 405 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో 103 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించింది. పూర్తి జాబితా వచ్చేసరికి ఈ సంఖ్య పెరగొచ్చు. గత ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరించినప్పటికీ BJP 300కు పైగా సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఏకంగా 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా.. అభ్యర్థుల మార్పు ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.
డాషింగ్ ప్లేయర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ జట్టు ఫ్రాంచైజీకి ఆడినప్పుడు తన ఆటతీరు మారిందని.. స్ట్రైక్ రేట్ తగ్గిపోయిందని చెప్పారు. జట్టుకు తగినట్లుగా ఉండాలనేది ఈ విషయంలో రుజువైందన్నారు. ప్లేయర్లు సరిగా ఆడకపోవడంతో పంజాబ్ ట్రోఫీ గెలవలేకపోయిందని తెలిపారు. IPLలో సెహ్వాగ్ ఢిల్లీ, పంజాబ్ జట్ల తరఫున ఆడిన సంగతి తెలిసిందే. 104 మ్యాచుల్లో 2,728 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
AP: YCP అధినేత జగన్ నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్నారు. మ.ఒంటిగంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, VNపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సా.4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేస్తారు.
AP: నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇవాళ పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరి, శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో CBN పర్యటించనున్నారు.
TS: సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ గ్రామంలో విషాదం జరిగింది. సాయితేజ అనే 14 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో పాఠశాల ఆవరణలోనే ప్రాణాలు వదిలాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉంది. ఆపరేషన్ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినా ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేకపోయారు. ఈ క్రమంలో నిన్న స్కూల్ ఆవరణలోనే గుండెపోటుతో చనిపోయాడు.
TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఆరుబయట పనిచేసేవారు, పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలు రికార్డయ్యాయి.
Sorry, no posts matched your criteria.