India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ‘గతంలో ఓ పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరినీ అరెస్టు చేయలేదు. తప్పు జరిగితే 30ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు’ అని చెప్పారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు.
AP: మధ్యాహ్న భోజన పథక స్వరూపాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే మెనూ ఉండగా, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా 4 రకాల మెనూ అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు ఇష్టపడే, పౌష్టికాహారం ఉండేలా <<14428656>>మెనూలను<<>> అధికారులు తయారుచేశారు. మరింత కసరత్తు అనంతరం కొత్త మెనూను డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్న కాంగ్రెస్ ట్వీట్కు TGBJP కౌంటర్ ఇచ్చింది. ‘OCT 6న PM మోదీకి సీఎం రేవంత్ రాసిన లేఖలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇప్పుడు ఈ సంఖ్య 40 లక్షలకు చేరింది. వాస్తవమేంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. రూ.15వేలు రైతు భరోసాగా ఇస్తామని చెప్పి గాడిద గుడ్డు అందించింది’ అని పేర్కొంది.
డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్కు సంబంధించిన మెసేజ్లను సెపరేట్గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్కూ సెపరేట్ ఫోల్డర్ను ఇన్స్టా యాడ్ చేసింది.
తమ అభిమాన హీరోను కలవాలని, ఆయనతో ఓ ఫొటో దిగాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే, అది కొందరికే సాధ్యమవుతుంది. తాజాగా ఓ వీరాభిమాని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ను కలిసేందుకు సాహసమే చేశారు. ఝార్ఖండ్కు చెందిన ఓ అభిమాని ఖాన్ను కలిసేందుకు ఆయన ఇంటి బయట 95 రోజులుగా ఎదురుచూశాడు. ఈ విషయాన్ని సెక్యురిటీ ఆయనకు చెప్పడంతో అభిమానిని లోపలికి పిలిచి అతనితో ఫొటో దిగారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2025 సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డైరెక్టర్ ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శివ కార్తికేయన్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
UP మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విద్యాసంస్థలు స్థాపించి, నిర్వహించే మైనార్టీల హక్కులను అడ్డుకోవద్దని UP ప్రభుత్వానికి CJI చంద్రచూడ్ సూచించారు. UP మదర్సా బోర్డ్ ఎడ్యుకేషన్ యాక్ట్- 2004కు రాజ్యాంగబద్ధత ఉందన్నారు. మదర్సాల్లో మత బోధనలు చేస్తుండటంతో సెక్యులరిజ సూత్రాలకు విరుద్ధమని AHC ఈ APRలో ఈ యాక్టును కొట్టేయగా బోర్డు SCని ఆశ్రయించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం తేలిపోతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. వారికి ఆ టూర్ అగ్ని పరీక్ష లాంటిదేనని అభిప్రాయపడ్డారు. ‘సీనియర్ల బ్యాటింగ్ టెక్నిక్లో ఎలాంటి తప్పులు లేవు. కానీ 10, 12 ఓవర్లకు మించి ఆడలేకపోతున్నారు. బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం సహనంతో ఉండాలి. మళ్లీ వారి బ్యాట్ నుంచి పరుగులు రాలడం చూడాలనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
TG: HYD మధురానగర్లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.
Sorry, no posts matched your criteria.