India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెస్లా కార్ల కంపెనీ చవకైన సైబర్ ట్రక్లను తయారుచేస్తోందని ఇన్వెస్టర్ సావ్యర్ మెర్రిట్ తెలిపారు. తక్కువ ఖరీదైన నాన్-ఫౌండేషన్ సిరీస్ సైబర్ట్రక్లను ఆర్డర్ చేసుకోవచ్చని టెస్లా అధికారికంగా ఆహ్వానించడం మొదలుపెట్టింది. దీని విలువ $79,990 వద్ద ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520KMS వెళ్తుంది. కాగా, టి-మోటార్ సైబర్ బీస్ట్ కూడా $99,990కు ఆర్డర్ చేయవచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ ‘కిక్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీ రీమేక్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. దర్శక నిర్మాత సాజిద్ నడియాద్వాలా ‘కిక్-2’ మూవీని ప్రకటించారు. బ్లాక్ బనియన్లో సల్మాన్ స్టిల్ను Xలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాతో సల్మాన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహాయుతి ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బెహన్ స్కీమ్తో మహిళలకు లబ్ధి కలుగుతున్నా మరోవైపు వారిపై అఘాయిత్యాలు పెరిగాయని NCP SCP నేత శరద్ పవార్ అన్నారు. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందించారు. గణేశ్ పూజకోసం CJI ఇంటికి PM వెళ్లడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. వారివి అత్యున్నత పోస్టులని, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. MVA సీట్ల పంపకాల చర్చల్లో తాను పాల్గొనడం లేదన్నారు.
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరింత సంపన్నులయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్($205 బిలియన్లు)ను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జుకర్బర్గ్ నికర విలువ $206.2 బిలియన్లకు పెరిగింది. కాగా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ $256.2 బిలియన్లతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని నిలుపుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ $193 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో SIT ఏర్పాటు చేసి అందులో CBI నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. CBI డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.
చైనా పర్యావరణ పరిరక్షణలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. దశాబ్దాల క్రితం కాలుష్యంతో నిండిపోయిన నదులు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేసింది. ప్రజల కోసం స్వచ్ఛమైన గాలి, నీరును అందిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. 1998లో చైనాలోని లియాంగ్మా నది అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు చుట్టూ పచ్చదనం, పరిశుభ్రత, నీటితో నిండిపోయింది. హాంగ్జౌలోని వెస్ట్ లేక్ని కూడా బ్యూటిఫుల్గా మార్చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు నమ్మకం ఉందని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా అన్నారు. అయితే విచారణపై కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. సుప్రీం ఏం చెబుతుందో వేచి చూడాలి.
AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికే హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పురుషాధిక్యం, లింగ సమానత్వానికి సంబంధించిన కథాంశంతో శ్రీవిష్ణు హీరోగా ‘స్వాగ్’ మూవీ రూపొందింది. రాజరాజ చోర ఫేమ్ హసిత్ గోలీ తెరకెక్కించిన ఈ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బాగున్నాయి. 4 విభిన్న పాత్రల్లో హీరో యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. రీతూవర్మ, మీరాజాస్మిన్, సునీల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. గందరగోళంగా ఉన్న ఫస్టాఫ్, క్లైమాక్స్, స్క్రీన్ప్లే మైనస్.
*రేటింగ్: 2.25/5
Sorry, no posts matched your criteria.