India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అతి సర్వత్ర వర్జయేత్! టెక్నాలజీతో మానవ జీవితం మారిపోయింది. శ్రమ తగ్గింది. కన్వీనియెన్స్ పెరిగింది. మరీ ఎక్కువ కన్వీనియెన్స్ మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ను మార్చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. EX. పిక్నిక్ వెళ్లినప్పుడు పులి ఎదురైతే అక్కడ్నుంచి పారిపోవడం మానవ నైజం. లేదు అదే వెళ్లిపోతుందిలే అని సెల్ఫీ దిగడం లేజీనెస్. కన్వీనియెన్స్తో వచ్చే ప్రమాదాలు ఇలాంటివే.
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్నారని, 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా క్రిష్ గతంలో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టితో ‘ఘాటీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి వస్తారని మాజీ క్రికెటర్ ఆర్ శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టూర్లో ఆయన కమ్బ్యాక్ ఇస్తారన్నారు. ‘ఆస్ట్రేలియాలో కోహ్లీని బీస్ట్ మోడ్లో చూడబోతున్నాం. ఆయనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం. అక్కడి ప్రతికూల పరిస్థితుల్లో అడేందుకు కోహ్లీ ఎంతగానో ఇష్టపడతారు. మీరు ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ బెస్ట్ను చూడబోతున్నారు’ అని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచారు.
NRE/NRO ఖాతాలు ఉన్న NRIలు UPI ద్వారా రోజుకు ₹లక్ష వరకూ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని NPCI కల్పించింది. ఇందుకోసం యూజర్లు తమ బ్యాంకు అకౌంట్కు లింకై ఉన్న ఇంటర్నేషన్ ఫోన్ నంబర్తో ఏదైనా యూపీఐ ఎనేబుల్డ్ యాప్లో లాగిన్ చేసుకోవాలి. US, కెనడా, UK, UAE, సింగపూర్, AUS వంటి దేశాల్లో ఉన్న వారికి ఇది అందుబాటులో ఉంది. HDFC, ICICI, IDFC, AXIS, DBS వంటి బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ఈ సేవలను వాడుకోవచ్చు.
తమిళనాడులోని మింజూర్ రైల్వేస్టేషన్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ సీన్ రిపీటైంది. నెల్లూరుకు చెందిన తండ్రీ కూతురు.. సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ ఓ మహిళను చంపి సూట్కేసులో కుక్కి రైల్వేస్టేషన్లో విసిరేశారు. దీనిని ఓ కానిస్టేబుల్ గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో కూడా ఇలాగే కొంతమందిని హత్య చేసి సూట్కేసుల్లో కుక్కి పట్టాల పక్కన పడేసేవారు.
AP: పల్నాడు జిల్లాలో జగన్కు చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలనకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్లాల్సింది. బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు!’ అని రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
అమెరికా ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ కాలిఫోర్నియా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్ను ఎలాన్ మస్క్ లేవనెత్తారు. నెల రోజుల క్రితమే అక్కడ ఎన్నికలలో IDని చూపించడాన్ని చట్టవిరుద్ధం చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఓటింగ్లో చీటింగ్ చేసేందుకే ఇది తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ప్రతిచోట ఐడీ చూపించాలని నిబంధన పెట్టి, ఎంతో ముఖ్యమైన ఓటింగ్ సమయంలో చూపించడం నేరమంటే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
కెనడాలో సిక్కులు, హిందువులను విడదీయడమే ఖలిస్థానీల టార్గెట్ కావొచ్చని ఆ దేశ మాజీమంత్రి ఉజ్జల్ దేవ్ దోసాంజి అన్నారు. అక్కడి విభజన విత్తనాన్ని మెల్లగా భారత్లో నాటాలన్నదే ప్లాన్ అని పేర్కొన్నారు. ఖలిస్థానీ ఇష్యూపై అక్కడి నేతలు నిద్ర నటిస్తున్నారని, కనీసం ఆ పేరే ఎత్తడం లేదని విమర్శించారు. చాన్నాళ్లుగా ఖలిస్థానీ తీవ్రవాదం మరుగున పడిందని, ట్రూడో రాగానే మళ్లీ మొదలైందని వివరించారు.
కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు అరకోటి జంటలు ఒక్కటవుతాయని, రూ.6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని నిపుణులు <<14533225>>అంచనా<<>> వేస్తున్నారు.
TG: రాష్ట్ర ఆదాయానికి జీవధార అయిన రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు వేసిందని KTR అన్నారు. ముందుచూపు లేని ప్రభుత్వ నిర్ణయాలతో ఆదాయానికి పోటు పడిందని ట్వీట్ చేశారు. ‘కేవలం పరిపాలన దక్షత లోపం. విజన్ లేని పాలనా విధానమే దీనికి కారణం. KCR పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ మంటూ ఉరికింది. కాంగ్రెస్ పాలనలో నై నై అంటోంది’ అని విమర్శించారు. HMDA ఆదాయం, రిజిస్ట్రేషన్లు, రాబడులు తగ్గాయన్న వార్తలను షేర్ చేశారు.
Sorry, no posts matched your criteria.