News November 5, 2024

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీన్ రిపీట్

image

తమిళనాడులోని మింజూర్ రైల్వేస్టేషన్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ సీన్ రిపీటైంది. నెల్లూరుకు చెందిన తండ్రీ కూతురు.. సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ ఓ మహిళను చంపి సూట్‌కేసులో కుక్కి రైల్వేస్టేషన్‌లో విసిరేశారు. దీనిని ఓ కానిస్టేబుల్ గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో కూడా ఇలాగే కొంతమందిని హత్య చేసి సూట్‌కేసుల్లో కుక్కి పట్టాల పక్కన పడేసేవారు.

News November 5, 2024

ఆడబిడ్డల పరామర్శకు వెళ్లండి పవన్: అంబటి

image

AP: పల్నాడు జిల్లాలో జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలనకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్లాల్సింది. బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు!’ అని రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

News November 5, 2024

చీటింగ్ చేసేందుకే ఆ చట్టం తెచ్చారు: ఎలాన్ మస్క్

image

అమెరికా ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ కాలిఫోర్నియా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్‌ను ఎలాన్ మస్క్ లేవనెత్తారు. నెల రోజుల క్రితమే అక్కడ ఎన్నికలలో IDని చూపించడాన్ని చట్టవిరుద్ధం చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఓటింగ్‌లో చీటింగ్ చేసేందుకే ఇది తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ప్రతిచోట ఐడీ చూపించాలని నిబంధన పెట్టి, ఎంతో ముఖ్యమైన ఓటింగ్ సమయంలో చూపించడం నేరమంటే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు.

News November 5, 2024

సిక్కులు, హిందువుల విభజనే ఖలిస్థానీల టార్గెట్: కెనడా మాజీ మంత్రి

image

కెనడాలో సిక్కులు, హిందువులను విడదీయడమే ఖలిస్థానీల టార్గెట్ కావొచ్చని ఆ దేశ మాజీమంత్రి ఉజ్జల్ దేవ్ దోసాంజి అన్నారు. అక్కడి విభజన విత్తనాన్ని మెల్లగా భారత్‌లో నాటాలన్నదే ప్లాన్‌‌ అని పేర్కొన్నారు. ఖలిస్థానీ ఇష్యూపై అక్కడి నేతలు నిద్ర నటిస్తున్నారని, కనీసం ఆ పేరే ఎత్తడం లేదని విమర్శించారు. చాన్నాళ్లుగా ఖలిస్థానీ తీవ్రవాదం మరుగున పడిందని, ట్రూడో రాగానే మళ్లీ మొదలైందని వివరించారు.

News November 5, 2024

ఈ రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే

image

కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు అరకోటి జంటలు ఒక్కటవుతాయని, రూ.6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని నిపుణులు <<14533225>>అంచనా<<>> వేస్తున్నారు.

News November 5, 2024

రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు.. రాష్ట్ర ఆదాయానికి పోటు: KTR

image

TG: రాష్ట్ర ఆదాయానికి జీవధార అయిన రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు వేసిందని KTR అన్నారు. ముందుచూపు లేని ప్రభుత్వ నిర్ణయాలతో ఆదాయానికి పోటు పడిందని ట్వీట్ చేశారు. ‘కేవలం పరిపాలన దక్షత లోపం. విజన్ లేని పాలనా విధానమే దీనికి కారణం. KCR పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రయ్‌ మంటూ ఉరికింది. కాంగ్రెస్ పాలనలో నై నై అంటోంది’ అని విమర్శించారు. HMDA ఆదాయం, రిజిస్ట్రేషన్లు, రాబడులు తగ్గాయన్న వార్తలను షేర్ చేశారు.

News November 5, 2024

US బ్యాలెట్‌లో ‘బెంగాలీ’.. భారత్ నుంచి ఇదొక్కటే!

image

ఇవాళ జరిగే US ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అక్కడ బ్యాలెట్ పేపర్‌తోనే పోలింగ్ జరుగుతుంది. దీంతో వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచారు. అందులో భారత్ నుంచి బెంగాలీ మాత్రమే చోటు దక్కించుకుంది. మన జాతీయ భాష హిందీ అయినప్పటికీ న్యూయార్క్‌లో బెంగాలీల సంఖ్య ఎక్కువ. అందుకే 2013 నుంచి ఆ భాషను బ్యాలెట్‌లో కొనసాగిస్తున్నారు. దాంతోపాటు చైనీస్, స్పానిష్, కొరియన్ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉంటుంది.

News November 5, 2024

పంత్‌కు రూ.50 కోట్లు ఇచ్చినా తక్కువే: పాక్ మాజీ క్రికెటర్

image

IPL మెగా వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ రూ.కోట్లు కొల్లగొడతారని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ జోస్యం చెప్పారు. అతడికి రూ.25 కోట్లు కాదు.. 50 కోట్లు ఇచ్చినా తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘పంత్ షాట్ల ఎంపికలో తెలివైనవాడు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఆడకూడదని ఆయనకు తెలుసు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మరే భారత బ్యాటర్ అతడిలా ఆడలేకపోయారు. నా దృష్టిలో అతడో ఛాంపియన్ ’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 5, 2024

US Elections: అతనొక్కడే ఏకగ్రీవం

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒకే ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి జార్జ్ వాషింగ్టన్ 1789లో ఏకగ్రీవంగా ఎన్నికై USకు తొలి అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పటివరకు 46 మంది అధ్యక్షులుగా పనిచేయగా, వాషింగ్టన్ తప్ప అందరూ ఎన్నికలు ఎదుర్కొన్నవారే. FD రూస్‌వెల్ట్ అధ్యక్షుడిగా 4సార్లు ఎన్నికయ్యారు. పదవిలో ఉండగానే ఆయన మరణించడంతో ఆపై ఎవరూ 2సార్లకు మించి అధ్యక్షుడు కాకుండా రాజ్యాంగ సవరణ చేశారు.

News November 5, 2024

కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నిరంజన్

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి <<14533351>>కులగణన సర్వే<<>> జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.