News November 5, 2024

ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు DSP ఉద్యోగానికి రాజీనామా

image

TG: ప్రజాసేవ చేయాలన్న తపన ఆయనతో DSP ఉద్యోగానికి రాజీనామా చేయించింది. నిజామాబాద్(D) ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ DSP ఉద్యోగం నుంచి VRS తీసుకున్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల MLC ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన గంగాధర్ 1998 బ్యాచ్ ఎస్సైగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు.

News November 5, 2024

SUPER: 150కి 150 మార్కులు

image

AP: టెట్ ఫలితాల్లో పలువురు పేదింటి విద్యార్థులు సత్తా చాటారు. 150కి 150 మార్కులు సాధించి అదరగొట్టారు. విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని, నంద్యాల(D) గొర్విమానుపల్లె వాసి మంజుల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ వంద శాతం మార్కులు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. టీచర్ ఉద్యోగం సాధించి పేద విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే లక్ష్యమని వారు వెల్లడించారు.

News November 5, 2024

డెమొక్రాట్VSరిపబ్లికన్: ఎవరిది ఆధిపత్యం?

image

అమెరికాలో చిన్నాచితకా పార్టీలు ఎన్ని ఉన్నా డెమొక్రటిక్(గుర్తు గాడిద), రిపబ్లికన్ల(సింబల్ ఏనుగు) మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 1854 నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. 1790లో ఏర్పడిన డెమొక్రటిక్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్టీల్లో ఒకటి. ఆ పార్టీ తరఫున ఇప్పటి వరకు 16 మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1854లో ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ నుంచి 19 మంది ప్రెసిడెంట్లుగా పనిచేశారు.

News November 5, 2024

షమీని వదలనంటున్న బ్యాడ్ లక్!

image

భారత జట్టులోకి తిరిగిరావడానికి ప్రయత్నిస్తున్న పేసర్ మహ్మద్ షమీకి షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ నెక్స్ట్ రెండు రౌండ్లకు బెంగాల్ టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. అక్కడ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలనుకున్న అతనికి ఇది బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. 2023 ODI WC తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన షమీ, సర్జరీ తర్వాత కోలుకుని బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇటీవల తాను 100% ఫిట్‌నెస్ సాధించినట్లు చెప్పారు.

News November 5, 2024

సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!

image

AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.

News November 5, 2024

గ్రాడ్యుయేట్లకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

image

TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.

News November 5, 2024

అమెరికాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎంతంటే?

image

1876లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో US చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఆ ఎలక్షన్లలో ఏకంగా 81.8 శాతం మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1792 ఎలక్షన్స్‌లో కేవలం 6.3 శాతం మందే ఓట్లు వేశారు. ఇదే అమెరికా చరిత్రలో అత్యల్ప ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో దాదాపు 66 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది పెరుగుతుందని అంచనా.

News November 5, 2024

₹4000+Cr ప్రాఫిట్: 4 ఏళ్లలో తీసుకుంది ఐదుగురినే!

image

Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్‌సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.

News November 5, 2024

తెలంగాణకు టెస్లా రాదా? ఇది అవమానకరం: KTR

image

TG: టెస్లా సంస్థను రాష్ట్రానికి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించడం లేదని కేటీఆర్ విమర్శించారు. తమిళనాడు, గుజరాత్, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఏదైనా ఒక రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటయ్యే ఛాన్సుందనే వార్తలపై ఆయన స్పందించారు. తెలంగాణను ఆ సంస్థ కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం అవమానకరమని అన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించిన సీఎం, మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు.

News November 5, 2024

BREAKING: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత

image

AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా పెదగోగాడలో ఇవాళ మరణించారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. NTR హయాంలో మంత్రిగా పనిచేశారు. TTD బోర్డు మెంబర్‌గా కూడా ఆయన సేవలందించారు. కాగా మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన నిరాడంబర జీవితం గడిపారు. RTC బస్సుల్లోనే ఆయన ప్రయాణించేవారు.