India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

* ANR వల్లే మరోస్థాయికి టాలీవుడ్ ఖ్యాతి: మోదీ
* ఏపీలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
* ఏపీలో సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
* ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి!
* ఏపీలో రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్లు
* తిరుమలలో అందరినీ సమానంగా చూడాలి: శ్రీనివాస్ గౌడ్
* అల్లు అర్జున్కు ఓయూ జేఏసీ హెచ్చరికలు
* టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్కు అరుదైన గౌరవం
*రామ్చరణ్ భారీ కటౌట్.. ప్రపంచ రికార్డు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం అధికారులు, ఉద్యోగులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇటీవల జరుగుతున్న దాడుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో చర్చించనున్నారు. ఉద్యోగుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కార్యాలయాల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలా? అనే అంశాలపై ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోనున్నారు.

AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.

AP కొత్త సీఎస్గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎస్ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును JAN 10 వరకు పెంచారు. CBSEలో 70% మార్కులతో టెన్త్ పాసైన అమ్మాయిలు దీనికి అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం ₹8లక్షలలోపు ఉండాలి. 11వ తరగతి పూర్తైన వారు మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఇక్కడ <

తెలంగాణలో రానున్న 5 రోజులు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. రేపు 17-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

AP: మాతృ భాష తల్లిపాలలాంటిదని, పరాయి భాష పోతపాలలాంటిదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. గత ప్రభుత్వం తెలుగు భాషకు తూట్లు పొడిచింది. ఇంగ్లిష్ మీడియం పేరుతో తెలుగుకు ద్రోహం చేసింది. తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యువత పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

TG: హైదరాబాద్ ORR లీజుకు ఇవ్వడంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. హరీశ్రావు కోరడంతోనే దీనిపై SIT విచారణకు ఆదేశించామని, దీనిలోనూ అవకతవకలు బయటపడతాయన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులో దొంగలు దొరికారని పరోక్షంగా KTRపై మండిపడ్డారు. అటు 2017లో ఆగిపోయిన RRR ప్రాజెక్టుపై తమ కృషి వల్లే ముందడుగు పడిందని, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సరికొత్త ఆవిష్కరణలకు అండగా ఉండాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న హీరోయిన్ <<15004135>>సమంత <<>>బేబీ బంప్తో ఉన్న ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, తాజాగా మరో నటి కీర్తి సురేశ్ ఫొటోలనూ గర్భంతో ఉన్నట్లు క్రియేట్ చేశారు. దీంతో ఇలాంటివి క్రియేట్ చేసే వారికి AIని దూరంగా ఉంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.