India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఘటన వెనుక ఎవరున్నా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మరోవైపు ఉగ్రదాడిని అమెరికా, ఐక్యరాజ్య సమితి, ఈయూ ఖండించాయి. అయితే ఉగ్రదాడి జరగొచ్చని వారం క్రితమే రష్యాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించడం గమనార్హం.
AP: అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్టుల నిర్వహణకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మేలో జరిగే పరీక్షల తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంది. 26 జిల్లా కేంద్రాలతో పాటు ఢిల్లీలోనూ పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
ఓటు వేయాలని ఒకరిని ఎలా బలవంతం చేస్తారని మద్రాసు హైకోర్టు ఓ పిటిషనర్ను ప్రశ్నించింది. తమిళనాడు తిరుచ్చెందూర్కు చెందిన రామ్కుమార్ ‘చట్టప్రకారం ఉద్యోగులు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నారు. వారు ఓటు వేసినట్లు తెలిపే ధ్రువపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేయాలి’ అని పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ధ్రువపత్రం సమర్పించాలని ఆదేశించలేమని తీర్పిచ్చింది.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడనున్నారు. IPLలో భాగంగా ఇవాళ పంజాబ్తో మ్యాచులో అతడు బరిలోకి దిగనున్నారు. 2022 డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకున్న అతడు పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఇటీవలే ఫుల్ ఫిట్నెస్ సాధించిన ఈ ఢిల్లీ కెప్టెన్ బ్యాటింగ్ కోసం అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఉచిత బోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవాలని కోరారు. https://apms.apcfss.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశం కల్పిస్తామని తెలిపారు.
TG: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్(మే 13) రోజు వేతనంతో కూడిన సెలవును ఇస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు మంజూరు చేసినట్లు పేర్కొంది.
AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లు కాగా గతేడాది ఇదే సమయానికి 166.97 మి.యూనిట్లుగా ఉంది. 43.01% మేర పెరిగింది. గత సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ సమ్మర్లో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
TG: గుజరాత్ నేరస్థులను అందలం ఎక్కిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యావ్యవస్థపై దాడి చేస్తూ అశాస్త్రీయ విషయాలను అందులో చొప్పిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.
TG: ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు లేఖ అందజేసింది. వీరు బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొంది. కాగా తమ ఫిర్యాదుపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
AP: రాష్ట్రంలోని 20 స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. ఇందులో కుప్పం, హిందూపురం, చీరాల, కొండెపి, పర్చూరు, గుంటూరు 2, గన్నవరం, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, టెక్కలి, ఇచ్చాపురం స్థానాలు ఉన్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.