News March 19, 2024

రేపు RC16 షూటింగ్ స్టార్ట్

image

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలోని సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఖరారైంది. వర్కింగ్ టైటిల్ RC16తో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు ఉదయం 10.10 గంటలకు జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో చెర్రీకి జంటగా జాన్వీకపూర్ నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‌‌’లో నటిస్తున్నారు.

News March 19, 2024

విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు.. చిక్కుల్లో ఎమ్మెల్యే

image

AP: పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ చిక్కుల్లో పడ్డారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు.. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు అందించారు.

News March 19, 2024

త్వరలోనే వారికి వేతనాల పెంపు!

image

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతనం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెంపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News March 19, 2024

కేరళలో పోలింగ్ తేదీ మార్చాలి: కాంగ్రెస్

image

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు ఏడు దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేరళలో ఏప్రిల్ 26న(శుక్రవారం) పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే శుక్రవారం, ఆదివారం పోలింగ్ పెడితే వివిధ వర్గాలకు అసౌకర్యంగా ఉంటుందని, పోలింగ్ తేదీని మార్చాలని ఎన్నికల సంఘాన్ని కేరళ కాంగ్రెస్ కమిటీ కోరింది.

News March 19, 2024

పది పరీక్ష రాసి వచ్చేసరికి అమ్మను కోల్పోయాడు!

image

ఓ వైపు తల్లికి అనారోగ్యం.. మరోవైపు టెన్త్ పరీక్ష. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పరీక్ష రాయాలని కొత్తగూడెంకు చెందిన మహేశ్ నిర్ణయించుకున్నారు. అయితే, పరీక్ష బాగా రాసానమ్మా అని చెప్పాలని తిరిగి వచ్చిన అతడికి కన్నీరే మిగిలింది. అప్పటికే అతడి తల్లి చనిపోయింది. ఇలానే.. ఖమ్మంలో అఖిల్, సూర్యాపేటలో మౌనిక, కామారెడ్డిలో స్రవంతి, SRCLలో శ్రవణ్, MHBNRలో అజయ్ తల్లిదండ్రులను కోల్పోయినా.. పది పరీక్షకు హాజరయ్యారు.

News March 19, 2024

ALERT: ఈ మెసేజ్‌తో జాగ్రత్త

image

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP ‘వికసిత్‌ భారత్‌ సంపర్క్’ పేరుతో వాట్సాప్‌ మెసేజ్‌లు పంపుతోంది. మోదీ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్‌తో పాటు సలహాలు ఇవ్వాలని అడుగుతోంది. అయితే ఈ మెసేజ్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముంది. వికసిత్‌ భారత్‌ మెసేజ్ 9275536906, 9275536919 నంబర్లతో మాత్రమే వస్తుంది. ఇతర నంబర్లతో వస్తే అది ఫేక్ అని, రిప్లై ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారు.

News March 19, 2024

వైజాగ్ బీచ్‌లో క్లీంకార, రామ్ చరణ్

image

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి విశాఖ బీచ్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. క్లీంకారను బీచ్‌లో ఆడిస్తూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.

News March 19, 2024

ఇండియా కూటమి ప్రచార జోరు తగినంత లేదా?

image

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఇండియా కూటమి ప్రచారం చర్చనీయాంశమైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మణిపుర్-ముంబై రాహుల్ యాత్ర చేసినా అది రాజకీయంగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనేది విశ్లేషకుల మాట. ఇండియా కూటమి బీజేపీపై విమర్శలకు పరిమితం కాకుండా తమ ఎజెండా ఎంటో వివరించి, ప్రచారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

News March 19, 2024

19 మంది వాలంటీర్లపై వేటు

image

AP: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. ‘సిద్ధం’ సభలో పాల్గొనడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లపై వేటు పడింది. అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇటు అనకాపల్లి(D)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. పల్నాడు(D) పెదకూరపాడులో పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌పై వేటు వేశారు.

News March 19, 2024

అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే!

image

అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోనిదేనని ఇటీవల చైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆ ఈశాన్య రాష్ట్రం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. పదేపదే నిరాధార వాదనలు చేసినంత మాత్రాన అవి నిజమైపోవని పేర్కొంది. దేశం నుంచి ఆ రాష్ట్రాన్ని విడదీయలేమంది. అభివృద్ధి కార్యక్రమాలతో అరుణాచల్ ప్రజలు భవిష్యత్తులోనూ లబ్ధి పొందుతారని తెలిపింది.