News December 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా నిన్న YCP ఆందోళనలు చేపట్టగా సీపీఎం కూడా పోరు బాటపట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో ఛార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఫిబ్రవరి 1-4 తేదీల్లో నెల్లూరు జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని నేతలు తెలిపారు.

News December 28, 2024

నేడు స్కూళ్లకు సెలవు ఉందా?

image

మాజీ PM మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్రం ఇవాళ హాఫ్ డే సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా, నిన్న తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

News December 28, 2024

వాచ్‌మెన్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.2.32కోట్లు

image

దుబాయ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న HYDకు చెందిన రాజమల్లయ్య(60)కు జాక్‌పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను 30ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నానని, ఇప్పుడు అదృష్టం వరించిందని తెలిపారు. ఈ మొత్తాన్ని కుటుంబం, స్నేహితులతో పంచుకుంటానని తెలిపారు.

News December 28, 2024

దటీజ్ మన్మోహన్: ఆపరేషన్ తర్వాత తొలి ప్రశ్న.. ‘నా దేశం ఎలా ఉంది?’

image

మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉండగా 2009లో హార్ట్ సర్జరీ జరిగింది. 11 గంటల శస్త్రచికిత్స తర్వాత బ్రీతింగ్ పైప్ తీసేయగానే ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని అడిగారు. తన ధ్యాసంతా సర్జరీపై కాకుండా దేశంపైనే ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా ఓ సందర్భంలో వెల్లడించారు. మన్మోహన్ మానసికంగా చాలా బలంగా ఉండేవారని తెలిపారు.

News December 28, 2024

దివ్యాంగులకు షాక్.. సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత

image

AP: సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్‌దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం. తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.

News December 28, 2024

లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్

image

లైంగిక వేధింపుల కేసులో క‌న్నడ బుల్లితెర న‌టుడు చరిత్ బాలప్పను BNGL పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని వేధించేవాడని, ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామని బెదిరించాడని ఆమె పేర్కొంది. ఇతను కన్నడలో పాపులర్ ‘ముద్దులక్ష్మీ’తోపాటు తెలుగులో పలు సీరియళ్లలో నటించాడు. గతంలో నటి మంజును పెళ్లాడి విడాకులు తీసుకున్నాడు.

News December 28, 2024

స్టాక్స్‌కు దూరం.. FDలకే మన్మోహన్ మొగ్గు

image

ఆర్థికవేత్తగా తన సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మన్మోహన్ సింగ్ స్టాక్‌మార్కెట్‌కి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. అందులో ఒడిదుడుకులతో నిద్ర కోల్పోవడం తనకు ఇష్టం లేదని 1992లో పార్లమెంటులో ఆయన చెప్పారు. తన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో మాత్రమే పెట్టేవారు. 2019 నాటికి ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.15కోట్లు. అందులో FDల్లో రూ.7 కోట్లు, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షలు ఉంది.

News December 28, 2024

నేడు మన్మోహన్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.

News December 28, 2024

రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ

image

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.

News December 28, 2024

TG టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు

image

JAN 2 నుంచి 20 వ‌ర‌కు టెట్ పరీక్ష జరగనుంది. ఉ.9 నుంచి 11.30 వ‌ర‌కు, మ‌.2 నుంచి 4.30 వ‌ర‌కు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ల‌ను క్లోజ్ చేస్తారు. అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.