News March 18, 2024

రూ.1.5లక్షలు లంచం తీసుకుంటూ..

image

TS: హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారి ఎం. శ్రీనివాసరావు ఏసీబీ వలలో చిక్కారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఓ టీ షాపును, ‘చెన్నపట్నం చీరలు’ బోర్డును కూల్చివేయకుండా ఉండేందుకు ఆయన శ్రీరాములు అనే వ్యక్తి వద్ద రూ.1.5లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

News March 18, 2024

సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకంటే?

image

ఉత్త‌ర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకునే వారికి రూ.35వేలు అందిస్తోంది. ఇందుకోసం ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే దొంగ పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయానికి వరుడిని తెచ్చుకోకపోవడంతో మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. ఆమెకు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాజ్‌గంజ్‌ అధికారులు షాకయ్యారు.

News March 18, 2024

శారీ రన్‌లో పాల్గొనడం గర్వకారణం: బ్రాహ్మణి

image

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిన్న శారీ రన్ కార్యక్రమాన్ని తాను జెండా ఊపి ప్రారంభించడం సంతోషంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు. ‘ధగధగ మెరిసిపోయే, కళాత్మకంగా నేసిన ముచ్చటైన చీరల్లో వందలాది మహిళలను చూడటం ఎంతో బాగుంది. చేనేతకు ప్రఖ్యాతిగాంచిన మంగళగిరిలో శ్రమ, ప్రేమ కలగలిపి అక్కడి మహిళలు అల్లిన చేనేత చీరను ధరించి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం’ అని ఆమె ట్వీట్ చేశారు.

News March 18, 2024

ఆ పార్టీకి రూ.5 కోట్ల విరాళాలు ఇచ్చిన సీఎస్కే యాజమాన్యం

image

ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు వచ్చిన విరాళాల జాబితాను ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK యాజమాన్యం మెజారిటీ విరాళాలను అందజేసింది. ఆ పార్టీకి రూ.6.05 కోట్లు విరాళాలు రాగా, వాటిలో సీఎస్కే యాజమాన్యమే రూ.5 కోట్లు ఇచ్చినట్లు ఈసీ గణాంకాలు పేర్కొన్నాయి. 2019 ఏప్రిల్‌లో ఈ విరాళాలు ఇవ్వడం గమనార్హం.

News March 18, 2024

భారత్-చైనా సరిహద్దులో జవాన్ల కోసం స్పెషల్ బంకర్స్

image

చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వద్ద గడ్డకట్టే చలిలోనూ మన జవాన్లు గస్తీ కాస్తుంటారు. అందుకే వారి కోసం కేంద్రం పెద్ద ప్రత్యేక బంకర్లను నిర్మిస్తోంది. సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ బంకర్లు -30 డిగ్రీల్లోనూ 22 డిగ్రీల వెచ్చని వాతావరణం కల్పిస్తాయట. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు చోట్ల ఏర్పాటైన ఈ బంకర్లను ఇప్పుడు ప్రభుత్వం ఆధునీకరించి మరిన్ని చోట్లకు విస్తరిస్తోంది.

News March 18, 2024

‘శక్తిమాన్’కు రణ్‌వీర్ కరెక్ట్ కాదు: ముకేశ్ ఖన్నా

image

ముకేశ్ ఖన్నా హీరోగా 1997 నుంచి 2005 మధ్యకాలంలో ప్రసారమైన శక్తిమాన్ సీరియల్ చిన్నారుల్ని విపరీతంగా అలరించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌తో దీన్ని సినిమాగా తెరకెక్కించనున్నారు. ఆ నిర్ణయంపై ముకేశ్ పెదవివిరిచారు. ‘శక్తిమాన్ అంటే కేవలం సూపర్ హీరో మాత్రమే కాదు. ఒక టీచర్. ఆ పాత్ర చేసే వ్యక్తి ఏదైనా చెప్తే పదిమంది వినేలా ఉండాలి. రణ్‌వీర్ ఇమేజ్ అందుకు అడ్డు నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.

News March 18, 2024

లిక్కర్ స్కామ్‌లో 15 మంది అరెస్ట్: ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజుల కస్టడీకి అనుమతించిందని పేర్కొంది. మరోవైపు కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

News March 18, 2024

నీటి ఆదాకు డాక్టర్ టిప్స్

image

కర్ణాటకలో కొన్ని రోజులుగా నీటి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటి ఆదా విషయంలో బెంగళూరు డాక్టర్ దివ్యశర్మ తాను పాటించిన టిప్స్ చెప్పారు. ఓవర్ హెడ్ షవర్ల తొలగింపు, కుళాయిల నుంచి నీరు ధారగా పడకుండా ఏరేటర్స్ ఏర్పాటు, ప్యూరిఫయర్ నుంచి వచ్చే నీటితో ఇల్లు తుడవడం, మొక్కలకు వాడటం, కార్ వాషింగ్ ఆపేసి తడి వస్త్రంతో శుభ్రం చేశామని చెప్పుకొచ్చారు. డాక్టర్ టిప్స్‌ను పలువురు స్వాగతిస్తున్నారు.

News March 18, 2024

ఇది యూకేజీ ఫీజా.. ఆస్తులు అమ్మాల్సిందే!

image

పిల్లల్ని కిండర్‌గార్టెన్(కేజీ) చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చు. అంతేకదా..? కానీ ఓ పాఠశాలలో మాత్రం అక్షరాలా రూ.2,72,718 కట్టాల్సి ఉంటుంది. అందులో రూ.33వేలు తర్వాత రిఫండ్ ఇస్తారట. దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘ఇది యూకేజీ ఫీజా..? పిల్లల్ని ఇలా చదివించాలంటే మా ఆస్తులు అమ్మాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 18, 2024

నాలుగు నెలల మనవడికి మూర్తి రూ.240కోట్లు గిఫ్ట్!

image

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం మూర్తి షేర్లు 0.40% నుంచి 0.36శాతానికి తగ్గాయి. కాగా గత ఏడాది నవంబరులో నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి-అపర్న కృష్ణన్ దంపతులు ఏకగ్రహకు జన్మనిచ్చారు.