News March 18, 2024

రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం

image

ఆర్సీబీ మహిళల జట్టు WPL కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకు శుభాకాంక్షలు చెప్పే బదులు పురుషుల జట్టును ట్రోల్ చేసేలా రాజస్థాన్ రాయల్స్ ఓ ట్వీట్ చేసింది. పురుషులు చేయలేనిది మహిళలు చేశారన్న అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. దానిపై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.

News March 18, 2024

పోలీసుల తీరుపై అనుమానాలున్నాయి: నాదెండ్ల

image

AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్‌లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.

News March 18, 2024

పెంగ్విన్లను లెక్కపెట్టడమే పని!

image

మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్‌రాయ్‌లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య ఐదు నెలల పాటు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే కోసం పనిచేయాలట. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

News March 18, 2024

CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని SECకి అచ్చెన్న లేఖ

image

AP: 23 ప్రభుత్వ వెబ్‌సైట్లలో CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ‘ఈ నెల 16వ తేదీ మ.3 గంటల నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదు. కానీ ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఇంకా సీఎం, మంత్రుల చిత్రాలు ఉన్నాయి. వెంటనే వాటిని తొలగించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News March 18, 2024

BREAKING: ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నాయి.

News March 18, 2024

బ్రెజిల్‌లో 62.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత!

image

బ్రెజిల్‌లోని రియోలో రికార్డు స్థాయిలో 62.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తాజాగా నమోదైంది. 2014లో రియో ఉష్ణోగ్రత నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఉష్ణోగ్రత 60ల్లో ఉన్నా, ఉక్కబోత కారణంగా 100 డిగ్రీల సెల్సియస్‌లా అనిపిస్తుందని అధికారులు తెలిపారు. అక్కడ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు తరచూ నమోదవుతున్నాయన్నారు. వేడికి తాళలేక రియో వాసులు భారీ సంఖ్యలో బీచ్‌లకు చేరుకుంటున్నారు.

News March 18, 2024

బ్యాంకులకు RBI హెచ్చరిక!

image

సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు చేసింది. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని RBI డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ సైతం ఇటీవల పేర్కొనడం గమనార్హం.

News March 18, 2024

పల్టీలు కొట్టిన ఆర్సీబీ ప్లేయర్

image

ఆర్సీబీ 16 ఏళ్ల కలను నెరవేర్చిన మహిళా ప్లేయర్లు మైదానంలో సంతోషంతో కేరింతలు కొట్టారు. టైటిల్ గెలుపు ఆనందంలో ఆ టీమ్ ఓపెనర్ సోఫీ డివైన్ పల్టీలు కొడుతూ సందడి చేశారు. పలువురు ప్లేయర్లు సెల్ఫీలు తీసుకుంటూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇక బెంగళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ‘ఈ సాలా కప్‌ నమదే’ నిజమైందంటూ నినాదాలు చేశారు.

News March 18, 2024

రేపు ‘కంగువ’ టీజర్

image

శివ డైరెక్షన్‌లో సూర్య నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’ టీజర్‌ను రేపు సా.4.30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో 10 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

News March 18, 2024

20న కోస్తాంధ్రలో భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విభిన్న వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతోపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఈ నెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.