India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నెమరేసుకున్నారు. ‘గతంలో నేను జైలుకు వెళ్లినప్పుడు సింగ్ అండగా నిలిచారు. మలేషియా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, నా పిల్లల చదువు కోసం స్కాలర్షిప్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనను నేను సున్నితంగా తిరస్కరించా’ అంటూ సింగ్ మరణవార్త తెలిసి Xలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

పంజాబ్లోని బఠిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల మేరకు వంతెనపై రెయిలింగ్ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. 18 మంది ప్రయాణికులు షాహిద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

డాలర్తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే ఒకరోజు అతిఘోర పతనం చవి చూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది. నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 వద్ద ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్ఫ్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, FIIలు వెళ్లిపోవడమే పతనానికి కారణాలు.

ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన థాయిలాండ్కు చెందిన బేబీ హిప్పో ‘మూ డెంగ్’కు జాక్ పాట్ లభించింది. ఖావో ఖీవో జూలో ఉండే ఈ హిప్పో సంరక్షణకు Ethereum సహ-వ్యవస్థాపకుడు $290,000 (సుమారు రూ. 2.51 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ 5 నెలల పిగ్మీ హిప్పో కోసం భారీ క్రిస్మస్ కానుక అందించినట్లు తెలిపారు. గత నెలలో ఆయన జూను సందర్శించినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.1719.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 2024లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ‘పుష్ప-2’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్తో పాటు న్యూ ఇయర్ సెలవులతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల BRS అధినేత KCR సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ‘తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారు. ఆయన ప్రధానిగా ఉండగానే రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్కు ఘన నివాళులు’ అని KCR పేర్కొన్నారు. అటు రేపు జరిగే ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాలని KTR సహా పార్టీ నేతలను KCR ఆదేశించారు.

Dr.Reddy’s షేర్లు ఈ నెలలో 15% మేర ఎగిశాయి. గత 51 నెలల్లో మంత్లీ పెరుగుదలలో ఇదే అత్యధికం. 2020 Sepలో 22%, అలాగే 2023 జూన్లో 14.5% ఎగిశాయి. రేటింగ్ ఏజెన్సీ నోమురా Dr Reddysకు Neutral నుంచి Buy ఇవ్వడంతో గత 7 సెషన్లలో Price 11% పెరగడం గమనార్హం. 2026లో ఇతర సంస్థలతో పోటీ, నిర్వహణ ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉండడం సంస్థ పనితీరుకు పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు.

నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై శివసేన(షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్మోహన్ గొప్ప నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటివరకు చెరిగిపోలేదు’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘అప్పుడు మీరూ ఆ ప్రభుత్వంలోనే ఉన్నారుగా’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల MH అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు Friday లాభాలతో ముగిశాయి. Sensex 78,699 (+226) వద్ద, Nifty 87 పాయింట్లు ఎగసి 23,837 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా 1.30%, ఆటో 0.97%, హెల్త్కేర్ 0.80% లాభపడడంతో సూచీలు గ్రీన్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సెషన్ ప్రారంభంలో గంటపాటు ర్యాలీ జరిగినా Sensexలో 79,000 వద్ద, Niftyలో 23,900 వద్ద బలమైన Resistance ఉండడంతో సూచీలు రివర్సల్ తీసుకున్నాయి.

దూరదృష్టితో దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సింగ్ మరణం బాధాకరమని, ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మన్మోహన్ భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు.
Sorry, no posts matched your criteria.