News March 16, 2024

లోక్‌సభ పోలింగ్ తర్వాత J&K ఎన్నికలు: రాజీవ్‌కుమార్

image

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై CEC రాజీవ్‌కుమార్ స్పందించారు. ‘లోక్‌సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన తెలిపారు.

News March 16, 2024

లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 1/2

image

ఎన్నికల నగారా మోగింది. బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగమైన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. సీపీఐ-3, సీపీఎం-2తో గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన లెఫ్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. ఈసారి తేడా వస్తే అది కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.

News March 16, 2024

లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 2/2

image

లెఫ్ట్ పార్టీలకు కేరళ ఒక్కటే కంచుకోటగా మిగిలింది. LDF, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని UDF రాష్ట్రంపై పట్టుబిగించాలని భావిస్తున్నాయి. 2004లో గరిష్ఠంగా CPM (43), CPI (10), రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (3), ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (3) లోక్‌సభ సీట్లు గెలిచాయి. ఆ తర్వాత పతనమవసాగాయి. పొత్తులతో సీట్ల కేటాయింపు తగ్గడం, BJP విస్తరిస్తుండటంతో లెఫ్ట్ పార్టీలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

News March 16, 2024

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు జవాన్ల మృతి

image

పాకిస్థాన్‌లోని నార్త్ వజిరిస్థాన్ సెక్యూరిటీ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఆర్మీ అధికారులతోపాటు ఆరుగురు టెర్రరిస్టులు మరణించారు. టెర్రరిస్టులు పేలుడు సామగ్రితో కూడిన వాహనంతో వచ్చి చెక్‌పోస్టును ఢీకొట్టి పేల్చేశారు. తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా సైనికులు కాల్చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News March 16, 2024

దేనికి సిద్ధం జగనన్న?: షర్మిల

image

AP: సిద్ధం సభలకు YCP రూ.600కోట్లు ఖర్చు పెట్టిందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. విశాఖలో న్యాయసాధన సభలో ప్రసంగించిన ఆమె.. ‘ప్రత్యేక హోదాను, పోలవరాన్ని, వైజాగ్ స్టీల్‌ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను, 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం జగనన్న? ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధం’ అని అన్నారు.

News March 16, 2024

CSKకు బిగ్ షాక్

image

వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయంతో ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ 21 ఏళ్ల బౌలర్ స్నాయువు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో కనీసం 4-5 వారాల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. గత సీజన్‌లో 19 వికెట్లతో సత్తా చాటిన అతడు CSK టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు.

News March 16, 2024

ఓటరు కార్డు లేకున్నా పర్వాలేదు: సీఈవో

image

AP: ఎన్నికల్లో ఓటు కోసం దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

News March 16, 2024

BIG BREAKING: కవిత భర్తకు ఈడీ నోటీసులు

image

TS: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత భర్తతో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే నలుగురి ఫోన్లను సీజ్ చేశారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆయన వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

News March 16, 2024

ఏసీలు కొంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

image

* రూమ్ సైజుకు తగిన సామర్థ్యం ఉన్న ఏసీ తీసుకోవాలి. 110 sq ft గదికి 1 టన్ను కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది.
* ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ కొంటే కరెంటును ఆదా చేస్తుంది.
* స్టెబిలైజర్ కూడా తీసుకోవాలి. ఏసీ పాడవకుండా ఉంటుంది.
* కనీసం ఐదేళ్ల పీసీబీ వారంటీ, పదేళ్ల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్నవి కొనడం ఉత్తమం.
* ఈ కామర్స్ సంస్థలు, డీలర్ల వద్ద కొనేముందు ధరల మధ్య తేడాను గమనించాలి.

News March 16, 2024

బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ

image

AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.