News December 27, 2024

ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స‌మాచార హ‌క్కు చ‌ట్టం వంటి కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు.

News December 27, 2024

సీఎం-సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఈ మీటింగ్‌ను చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. హీరోలకు ఏవైనా వ్యాపార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సీఎంతో జరిగిన భేటీలో ఇండస్ట్రీ నుంచి ఒక్క నటి కానీ మహిళా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ పాల్గొనలేదు. దీనిని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేశారు.

News December 27, 2024

ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి

image

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (97) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. కాగా కొద్ది రోజులుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయన ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డా.వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించగా పూర్తిగా కోలుకున్నారు.

News December 27, 2024

ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలపాగా, గడ్డం లేకుండా ఆయన కనిపించారు. కాగా మన్మోహన్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.

News December 27, 2024

మ‌న్మోహ‌న్‌ను రాజ‌కీయాల్లోకి తెచ్చింది పీవీనే

image

RBI గవర్నర్‌గా ఉన్న మ‌న్మోహ‌న్‌కు రాజ‌కీయాలు ప‌రిచ‌యం చేసింది PV న‌ర‌సింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భ‌ర ఆర్థిక ప‌రిస్థితుల నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించ‌డానికి సింగ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. Liberalisation, Privatisation, Globalisation పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి.

News December 26, 2024

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు

image

1932 Sep 26న ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో మ‌న్మోహ‌న్ సింగ్ జ‌న్మించారు. 2004-2014 వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లకు పెద్దపీట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ త‌రువాత అత్య‌ధిక కాలం దేశ ప్ర‌ధానిగా కొన‌సాగారు. 33 ఏళ్ల‌పాటు పార్ల‌మెంటు స‌భ్యుడిగా కొన‌సాగారు. 1991లో రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టారు. PV హయాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, RBI గవర్నర్‌గా కూడా పనిచేశారు.

News December 26, 2024

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత

image

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) క‌న్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వారు ప్రకటించారు.

News December 26, 2024

రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే భరోసా వర్తించదని తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చనుంది. పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది.

News December 26, 2024

రేపు వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.

News December 26, 2024

ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

SBI 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఇది 16 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <>sbi.co.in<<>>