News December 26, 2024
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
1932 Sep 26న ఇప్పటి పాక్లోని చక్వాల్లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004-2014 వరకు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ తరువాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా కొనసాగారు. 33 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టారు. PV హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, RBI గవర్నర్గా కూడా పనిచేశారు.
Similar News
News January 21, 2025
వారిని ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు: ట్రంప్
అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ అన్నారు. ‘నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తాం. అమెరికన్ డ్రీమ్ అనేది ప్రపంచ నలుమూలల్లోని ప్రతిభావంతుల కల. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు. శాంతి నెలకొల్పేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాం. నిన్న గాజాలో బందీలు విడుదల కావడం సంతోషంగా ఉంది’ అని ట్రంప్ వివరించారు.
News January 21, 2025
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ: ట్రంప్
2025 అమెరికా ప్రజలకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తాం. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. భిన్న సంస్కృతుల, సంప్రదాయాల కలయికే అమెరికా. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తా. రాజ్యాంగబద్ధంగా, ప్రజస్వామ్యబద్ధంగా పని చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.
News January 21, 2025
సంచలనం: కుటుంబసభ్యులకు బైడెన్ క్షమాభిక్ష
అధికారం నుంచి దిగిపోయే 20 ని.ల ముందు బైడెన్ తన కుటుంబానికి చెందిన ఐదుగురికి క్షమాభిక్ష ప్రకటించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని, ట్రంప్ రాజకీయ దాడులకు బలవుతారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. క్షమాభిక్ష పొందినవారిలో బైడెన్ సోదరుడు జేమ్స్, అతడి భార్య సారా, బైడెన్ సోదరి వలేరి, ఆమె భర్త జాన్, బైడెన్ మరో సోదరుడు ఫ్రాన్సిస్ ఉన్నారు. 2024 DECలోనూ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించారు బైడెన్.