India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని కొన్ని ఏరియాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు ఏర్పడి వెదర్ చల్లగా మారింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?

కొత్త సంవత్సరంలో PM మోదీ పర్యటనల క్యాలెండర్ను విదేశీ వ్యవహారాల శాఖ సిద్ధం చేస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన అనంతరం ఆయనతో భేటీ అయ్యేందుకు మోదీ US వెళ్లే అవకాశం ఉంది. ఇక బ్రెజిల్లో బ్రిక్స్, చైనాలో SCO సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. ఈక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆయన ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మసీదు-మందిర్ వివాదాలపై RSS చీఫ్ మోహన్ భాగవత్తో ఆ శాఖ అనుబంధ మ్యాగజైన్ విభేదించింది. ఈ తరహా వివాదాలు అధికమవుతుండడంపై భాగవత్ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు కలిసి ఉండగలరన్న ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగజైన్ మాత్రం సివిలైజేషన్ జస్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.

తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

భారత ఉద్యోగులపై నియర్ కో ఫౌండర్ ఫ్రాంకో పెరేరా చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని US వారికంటే భారతీయులకు తక్కువ వేతనం ఇవ్వడం తప్పుకాదని ఆయన linkedinలో పోస్ట్ చేశారు. ఇండియా, లాటిన్ అమెరికా, ఫిలిప్పీన్స్ గురించి ఇలా చెప్పారు. సమానమైన పని చేస్తున్నప్పటికీ ఇండియన్స్ ఇలా పనిదోపిడీకి గురవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

INDIA కూటమి నుంచి కాంగ్రెస్ని తొలగించాలని మిత్రపక్షాల్ని కోరుతామని ఆప్ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి BJPతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. BJP గెలుపు కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కేజ్రీవాల్ను యాంటీ నేషనల్ అని విమర్శించిన అజయ్ మాకన్పై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే కూటమి నుంచి ఆ పార్టీని తొలగించాలని కోరతామన్నారు.

జైషే మహమ్మద్ ఫౌండర్, టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ హార్ట్ ఎటాక్కు గురైనట్లు వార్తలొస్తున్నాయి. అఫ్గాన్లోని ఖోస్త్ ప్రావిన్స్లో ఉండగా గుండెనొప్పి రావడంతో చికిత్స కోసం పాక్లోని కరాచీకి తరలించారని సమాచారం. ప్రత్యేక వైద్యనిపుణులు ఇస్లామాబాద్ నుంచి కరాచీకి చేరుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేయడంతో భారత ప్రభుత్వం మసూద్ను జైలు నుంచి విడుదల చేసింది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంసీజీ టెస్టులో ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగుతారని జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు, మూడు టెస్టుల్లో శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను తిరిగి ఓపెనర్గా బరిలోకి దించాలని నిర్ణయించినట్లు నాయర్ పేర్కొన్నారు. కేఎల్ రాహుల్ 3వ స్థానంలో ఆడనున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్టెల్ నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొబైల్ డేటా & బ్రాడ్బ్యాండ్ సేవలు రెండింటిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వెబ్సైట్ స్టేటస్ ట్రాకింగ్ టూల్ Downdetector.com ప్రకారం దాదాపు 46% మంది మొత్తం బ్లాక్అవుట్ను ఎదుర్కొంటున్నారు. 32% మందికి సిగ్నల్ లేదు & 22% మందికి మొబైల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?

సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్పై నిర్మాణ సంస్థ SVC ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ప్రభుత్వం & టాలీవుడ్ ప్రతినిధుల మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ దూరదృష్టి గల నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. షూటింగ్లకు HYDని గ్లోబల్ హబ్గా మార్చేందుకు DY.CM భట్టి, మంత్రి కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నారు. టాలీవుడ్ TG ప్రభుత్వానికి మద్దతునిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో పాల్గొంటుంది’ అని తెలిపింది.
Sorry, no posts matched your criteria.