India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్ర పరిస్థితులు, అభివృద్ధి గురించి మోదీతో చర్చించారు. అమరావతికి రూ.15 వేల కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని కోరగా మోదీ అంగీకరించారు. జనవరి 8న వైజాగ్ వస్తానని మోదీ చెప్పారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు.

పెట్టుబడి పరంగా 2024లో బంగారం సిరులు కురిపించింది. ఏకంగా 27% రాబడి అందించింది. నిఫ్టీ 50, నిఫ్టీ 500 కన్నా ఇదెంతో ఎక్కువ. దేశాల యుద్ధాలు, ప్రభుత్వాలు కూలిపోవడం, జియో పొలిటికల్ అనిశ్చితి వల్ల గోల్డుకు గిరాకీ పెరిగింది. RBI సహా అనేక సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ కొనడం ధరల పెరుగుదలకు మరో కారణం. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 2025లోనూ ఇదే ఒరవడి కొనసాగొచ్చని అంచనా. నేడు 24K బంగారం గ్రాము ధర ₹7,751.30.

‘ఈరోజు నా కొడుకు జోరో చనిపోయాడు. అతడు లేని నా లైఫ్ జీరో. నేను నా కుటుంబం షాక్లో ఉన్నాం’ అని హీరోయిన్ త్రిష Xలో పోస్ట్ చేశారు. దీంతో షాకైన ఫ్యాన్స్ ‘మీకు పెళ్లెప్పుడైంది? కొడుకు ఎప్పుడు పుట్టాడు?’ అని ఆరా తీశారు. తర్వాత ఆమె తన కుక్క చనిపోయిన ఫొటోలను షేర్ చేశారు. త్రిష చెప్పిన ‘కొడుకు’ కుక్క అని తెలియడంతో ‘ఆ విషయం ముందే చెప్పొచ్చుగా? ఎందుకు గందరగోళం సృష్టించడం?’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

నవ సత్యాగ్రహం పేరుతో మరోసారి సత్యాగ్రహ స్ఫూర్తిని రగిలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తెలిపింది. 1924, డిసెంబరు 26న కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ పగ్గాలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బెళగావిలో రేపు ‘నవ సత్యాగ్రహ బైఠక్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఎల్లుండి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.

డయాబెటిస్తో ఇబ్బందిపడేవారు జీవితంలో నడకను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 150 నిమిషాల నడక ఉండాలని పేర్కొంటున్నారు. ‘మధుమేహులు రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం 5 రోజులు నడవాలి. డయాబెటిస్ను అదుపులోకి తీసుకురావడంలో వాకింగ్ మంచి ఫలితాన్నిస్తుంది. ఒకేసారి అరగంట నడవలేకపోతే 10 నిమిషాల చొప్పున మూడు లేదా నాలుగుసార్లు నడుస్తున్నా ప్రయోజనం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.

ఢిల్లీకి చెందిన ఓ యువతి ఆరు పెళ్లిళ్లు చేసుకుని.. ఏడోదానికి సిద్ధమవుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పెళ్లి కుమార్తెగా, సంజన ఆమె తల్లిగా నటిస్తూ ఒంటరిగా ఉండే పురుషులను టార్గెట్ చేస్తారు. ఇలా పూనమ్ ఆరుమందిని పెళ్లాడింది. పెళ్లైన వెంటనే ఇంట్లోని బంగారం, నగదుతో ఉడాయిస్తారు. UPకి చెందిన శంకర్ ఉపాధ్యాయ్ను కూడా వీరు మోసం చేయాలని చూడగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

AP: మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్కడ అమలవుతోన్న మహాలక్ష్మీ పథకం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం అక్కడ తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాల గురించి రేవంత్తో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ CM ఆతిశీని అక్రమ కేసులో అరెస్టు చేస్తారన్న కేజ్రీవాల్ మాటలపై చర్చ జరుగుతోంది. మహిళలకు నగదు బదిలీ, సంజీవనీ స్కీములేమీ లేవంటూ HFW శాఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. దీన్నుంచి డైవర్ట్ చేయడమే ఆయన ప్లానని కొందరు అంటున్నారు. ఆప్లో ఆయన్ను మించి ఎవర్నీ ఎదగనివ్వరని, క్రమంగా ఆతిశీని సైడ్లైన్ చేస్తున్నారని మరికొందరి అంచనా. పార్టీ ఫౌండింగ్ మెంబర్స్ను తరిమేయడాన్ని ఉదహరిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనులపై చర్చిస్తారని సమాచారం. కాగా ఇంతకుముందే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.