News September 24, 2024

అంబానీ కుమారుడికి సెబీ ఫైన్

image

అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీకి సెబీ షాకిచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో అవకతవకల కేసులో రూ.కోటి ఫైన్ వేసింది. కంపెనీ జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ రూల్స్‌ను ఆయన పాటించలేదని చెప్పింది. వీసా క్యాపిటల్ పార్ట్‌నర్స్, అక్యూరా ప్రొడక్షన్ కంపెనీలకు రూ.20 కోట్ల చొప్పున అన్ సెక్యూర్డ్ లోన్లకు అనుమతించారని వెల్లడించింది. తాము పంపిన ఈ‌మెయిల్స్‌కు ‘ఓకే’ అని బదులివ్వడమే దీనికి నిదర్శనమంది.

News September 24, 2024

HYDRAది ద్వంద్వ వైఖరి: BRS

image

TG: హైడ్రా ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలైందని BRS ఆరోపించింది. ‘దుర్గం చెరువు ఆక్రమణలకు నోటీసులు ఇచ్చి, అందులో రేవంత్ సోదరుడు ఉండటంతో మీనమేషాలు లెక్కిస్తోంది. బడాబాబుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. పేదోళ్ల ఇళ్లను కూలుస్తూ బడాబాబులకు మాత్రం నోటీసుల పేరుతో సమయం ఇస్తోంది’ అని ట్వీట్ చేసింది.

News September 24, 2024

అక్టోబర్ 15 నుంచి ‘ఇందిరమ్మ’ అర్హుల ఎంపిక: మంత్రి

image

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధివిధానాలను వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందించే విషయంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

News September 24, 2024

మోదీలాంటి నాయకుడుంటే ‘$7ట్రిలియన్ల ఎకానమీ’ సాధ్యమే: JP మోర్గాన్

image

‘$7ట్రిలియన్ల ఎకానమీ’ని భారత్ సాధించగలదని JP మోర్గాన్ CEO జేమీ డిమాన్ అన్నారు. ఇందుకు PM మోదీలాంటి బలమైన నాయకత్వం అవసరమన్నారు. ‘ఆధార్, బ్యాంకింగ్ A/Cs, GST రిఫార్మ్స్, ఇన్ఫ్రా బిల్డింగ్, నియంత్రణల తగ్గింపు సంపన్నులకే కాకుండా దేశం, తక్కువ ఆదాయ వర్గాలకూ సాయపడ్డాయి. గతంతో పోలిస్తే దేశం మరింత డెవలప్ అయింది. మేమిక్కడి నుంచే ఎందరో క్లైంట్లకు సేవలందిస్తున్నాం. మాకు 55వేల ఉద్యోగులున్నారు’ అని చెప్పారు.

News September 24, 2024

బుల్ రంకెలు: ఫస్ట్‌టైమ్ 85,000 బ్రేక్ చేసిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. చరిత్రలో తొలిసారి BSE సెన్సెక్స్ 85,000 స్థాయిని టచ్ చేసింది. 85,021 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంతో 85,014 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ వేగంగా 26,000 వద్దకు పరుగులు తీస్తోంది. ఇంట్రాడేలో 25,971 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ 26 పాయింట్లు ఎగిసి 25,965 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, హిందాల్కో టాప్ గెయినర్స్.

News September 24, 2024

చేనేతలకు ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా: సీఎం చంద్రబాబు

image

AP: చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో నూతన టెక్స్‌టైల్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఆప్కోలో పొరుగు సేవల సిబ్బంది నియామకానికి అనుమతిచ్చారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం GST ఎత్తివేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొన్నారు. చేేనేతలకు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామన్నారు.

News September 24, 2024

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: KTR

image

TG: ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని KTR విమర్శించారు. ‘రోగాలు, నొప్పులు, వ్యాధులు, బాధలతో జనం అల్లాడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు. ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు’ అని ట్వీట్ చేశారు.

News September 24, 2024

జగన్‌ను నిందించట్లేదు.. కానీ: పవన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో తాను మాజీ సీఎం జగన్‌ను నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి. లడ్డూ వ్యవహారంలో దోషులను శిక్షించమని చెప్పాలి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

News September 24, 2024

పీవీ సింధుకు కొత్త కోచ్: ఎవరంటే?

image

పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. భారత మాజీ షట్లర్ అనూప్ శ్రీధర్ ఆమెకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత కోచ్ అగస్ ద్వి శాంటోసో పదవీకాలం ఒలింపిక్స్‌తోనే ముగిసింది. కాగా శ్రీధర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. లక్ష్యసేన్‌కు ఈ ఏడాది జనవరి వరకు కోచ్‌గా ఉన్నారు

News September 24, 2024

అంబానీ కొత్త విమానం.. కదిలే ఇంద్రభవనమే!

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ విమానం కొన్నారు. దీని విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఈ విమానం గంటకు 838 కి.మీ వేగంతో నాన్ స్టాప్‌గా 11,770 కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో ముకేశ్ అభిరుచులకు తగ్గట్లు సకల సౌకర్యాలు ఉండేలా స్విట్జర్లాండ్‌లో రీ మోడల్ చేయించారు. త్వరలోనే ఈ విమానాన్ని ముంబైకి తీసుకువస్తారు. ఇప్పటికే ముకేశ్ వద్ద 9 ప్రైవేట్ జెట్లు ఉండగా ఈ కొత్తదానితో వాటి సంఖ్య 10కి చేరింది.