India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టెట్ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం గందరగోళానికి గురి చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ ఆన్లైన్లో హాల్ టికెట్లు పొందుపర్చారు. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్ష జరగనుంది. 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
AP: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, సహకార సంఘం సభ్యులకు రూ.25 వేల వరద రుణం మంజూరు చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. వరదలతో పూర్తిగా నష్టపోయిన వారికి ఈ రుణాన్ని అందిస్తారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని డిపోలు, విజయవాడలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు, ఎండీ కార్యాలయంలో పని చేసే వారికి ఇది వర్తిస్తుందని సంఘం కార్యదర్శి తెలిపారు. రుణం కావాల్సిన వారు సంబంధిత డిపో, యూనిట్ మేనేజర్ను సంప్రదించాలన్నారు.
నరేంద్రమోదీ, జో బైడెన్ మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ అన్నారు. 2 దేశాల్లోని ప్రజలకు వారిద్దరూ ప్రతినిధులని పేర్కొన్నారు. ‘భారత చరిత్రలోనే మోదీలాంటి ప్రో అమెరికన్ పీఎంను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇక అమెరికా చరిత్రలో అత్యంత ప్రో ఇండియన్ ప్రెసిడెంట్ బైడెన్’ అంటూ ఆయన వర్ణించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి సమస్యల పరిష్కారానికే క్వాడ్ ఉందన్నారు.
తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.
AP: పల్నాడు(D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.
AP: వరదలతో నష్టపోయిన బాధితుల అకౌంట్లలోకి రేపు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. విజయవాడలో 179 సచివాయాల పరిధిలోని ప్రజలకు సాయం అందనుంది. వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్కు రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. ధ్వంసమైన దుకాణాలకు రూ.25వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున అందిస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నారు.
AP: ఎప్పటిలానే గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు కడలిపాలైంది. ఈ సీజన్లో 3 సార్లు గోదావరికి వరదొచ్చింది. జూన్ 1 నుంచి SEP 23 వరకు ధవళేశ్వరం బ్యారేజీకి 3715.128 TMCల నీరు రాగా, 3629.955 TMCల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అత్యధికంగా జులై 28న 15.90 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. నిన్న 1,62,276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. OCT నెలాఖరు వరకు ఇన్ ఫ్లో అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
TG: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతో యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని HYDలోని ఓ ల్యాబ్కు పంపారు. మదర్ డెయిరీ ఈ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గుడిలో అమ్మే లడ్డూ, పులిహోర నాణ్యతపైనా ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. అటు అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.
TG: SC, ST, BC, మైనార్టీ, జనరల్ గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని గురుకుల విద్యా JAC డిమాండ్ చేసింది. నైట్ స్టడీ అవర్స్ అనంతరం రా.9 గంటలకు ఇళ్లకు వెళ్లేందుకు మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారంది. టైమింగ్స్ మార్చకపోతే ఈ నెల 28న చాక్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో పాటు మెస్ ఛార్జీలు పెంచాలని, 010 కింద జీతాలు, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరింది.
TG:బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దేశంలో తొలిసారిగా ఓ కోర్సును తీసుకొస్తోంది. దీనిని ఈ నెల 25న CM రేవంత్ ప్రారంభిస్తారు. 18 ఇంజినీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో అమలు చేసి కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్, ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగమూ లభించేలా చూస్తారు.
Sorry, no posts matched your criteria.