India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విటమిన్-సి కోసం చాలామంది సప్లిమెంట్లు తీసుకుంటుంటారు. వాటిని అతిగా వాడితే కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ వైద్యుడు విజయ్ కిరణ్ తెలిపారు. ‘ప్రతిరోజూ మహిళలకు 75 ఎంజీ, పురుషులకు 90 ఎంజీ విటమిన్-సి కనీసావసరం. కానీ దాని కోసం సప్లిమెంట్లను ఆశ్రయించడం శ్రేయస్కరం కాదు. బదులుగా విటమిన్లు సహజంగా లభించే ఆహారం తీసుకోవడం ఉత్తమం’ అని వివరించారు.
అరవింద్ స్వామి, కార్తీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న విడుదల కానుంది. ‘96’ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. తమ మూవీ చాలా అరుదైన స్టోరీతో వస్తోందని కార్తీ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నాకు కె. విశ్వనాథ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఇది సరిగ్గా ఆయన సినిమాల తరహాలోనే ఉంటుంది’ అని తెలిపారు. 27న ‘దేవర’ రిలీజ్ ఉండటంతో తెలుగులో ఒకరోజు లేట్గా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉత్తర భారత ప్రజలు బెంగళూరును వీడితే నగరం మొత్తం ఖాళీ అవుతుందని, ఇక్కడ డబ్బు కొరత ఏర్పడుతుందని ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘కన్నడిగులు తరచూ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ హేళన చేస్తుంటారు. మేము నిజంగానే వెళ్లిపోతే మీ నగరం ఖాళీ అయిపోతుంది’ అంటూ సుగంధ్ శర్మ వ్యాఖ్యానించారు. కొంత మంది ఆమెపై భగ్గుమంటున్నారు. నగరం విడిచి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు తెగుళ్ల బెడద పెరిగి రైతులు అల్లాడిపోతున్నారు. వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పత్తిలో రసం పీల్చే పురుగుల, మెగ్నీషియం లోపం ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలతో కలిసి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తెగుళ్ల నివారణ కోసం రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15వేల కోట్ల మేర రుణం అందిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు మరోసారి అమరావతిలో పర్యటించారు. లింగాయపాలెం గ్రామస్థులతో భేటీ అయ్యారు. భూసమీకరణ, రైతు కూలీల జీవన ప్రమాణాలు, వారి స్థితిగతులపై చర్చించారు. అనంతరం వీఐటీ వర్సిటీలో యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు.
1921: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం
1972: దర్శకుడు శ్రీను వైట్ల జననం
1950: భారత మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ జననం
1975: ప్రముఖ దర్శకుడు, నిర్మాత చక్రపాణి మరణం
2004: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న మరణం
✤ఎన్ఎస్ఎస్ దినోత్సవం
✒ తేది: సెప్టెంబర్ 24, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.22 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
భారత క్రికెటర్లలో అత్యంత ఫిట్ ప్లేయర్ తానేనని బుమ్రా అనడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇతర క్రికెటర్ల ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేశారు. ఈ విషయంపై భారత స్పిన్నర్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బుమ్రా మన క్రికెట్లో కోహినూర్ వజ్రం. భారత జట్టు కిరీటంలో కలికితురాయి. తను అత్యంత విలువైన ఆటగాడు. అతడేమన్నా పర్వాలేదు. తన ఇష్టం. అవన్నీ మేం అంగీకరిస్తాం’ అని స్పష్టం చేశారు.
ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్కు షార్ట్లిస్ట్ అయిన ‘లాపతా లేడీస్’ టీమ్కు హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ కిరణ్ రావు అండ్ టీమ్. కొత్త తరహా కథల్ని చెప్పాలన్న మీ నిబద్ధత ఆ సినిమాలో కనిపించింది. ఆస్కార్లలోనూ మీ సినిమా రాణించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘లాపతా లేడీస్’ తన సినిమా హను-మాన్ను దాటి ఎంపికైనప్పటికీ ఆ మూవీ టీమ్కు ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.