News September 24, 2024

ఇంటర్నెట్ స్పీడ్‌గా రావాలంటే..

image

1.ఫోన్ రీస్టార్ట్ చేయండి.
2.సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉండేట్లు చూసుకోండి.
3.సిగ్నల్ వీక్ ఉన్న దగ్గర ఫోన్ వాడొద్దు.
4.cache, cookies క్లియర్ చేయండి.
>> ఇక వైఫై వాడేవాళ్లు రౌటర్‌ను అప్పుడప్పుడూ రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. అలాగే నెట్ సిగ్నల్ వీక్ ఉంటే రౌటర్ ప్లేస్‌ను మార్చడం బెటర్. ఇక వైఫై కంటే ఈథర్‌నెట్ కనెక్షన్ వేగం బాగుంటుంది.

News September 23, 2024

అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం చంద్రబాబు

image

AP: వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు, అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్లను వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారు.

News September 23, 2024

కేతిరెడ్డిపై మంత్రి సత్య కుమార్ విమర్శలు

image

AP: ధర్మవరం సబ్ జైలు వద్ద మాజీ MLA కేతిరెడ్డి <<14175931>>వాహనంపై<<>> టీడీపీ కార్యకర్త ఎక్కగా దూసుకెళ్లిన ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలకు దిగారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారని దుయ్యబట్టారు. గతంలో చేసిన తప్పులు, కబ్జాలు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని ట్వీట్ చేశారు.

News September 23, 2024

మహీంద్రా థార్ రాక్స్ తొలి కారు వేలం.. ఎంత పలికిందంటే..

image

మహీంద్రా సంస్థ తమ థార్ కారుకు అప్‌డేట్‌గా థార్ రాక్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో తయారుచేసిన తొట్టతొలి కారును ఛారిటీ కోసం తాజాగా వేలం వేయగా ఏకంగా రూ.1.31 కోట్లకు అమ్ముడుపోయింది. VIN 0001 ఛాసిస్ నంబర్ కలిగిన ఈ కారు AX7 L డీజిల్ 4×4 టాప్ వేరియెంట్. ఆనంద్ మహీంద్రా సంతకం ఈ కారుకు మరో ప్రత్యేకత. రాక్స్ బేస్ వేరియెంట్ ఆన్‌రోడ్ ధర రూ.16 లక్షలుగా ఉంది.

News September 23, 2024

‘దేవర’ టికెట్లు వచ్చేశాయ్!

image

ఏపీ, తెలంగాణలో దేవర ఫీవర్ షురూ అయింది. పలు థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు సేల్ అయిపోయాయి. రేపు చాలా థియేటర్లలో బుకింగ్ ఛాన్స్ కల్పించే అవకాశం ఉంది. ఇక రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 27న 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట షోకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

News September 23, 2024

టెట్ హాల్ టికెట్లలో తప్పులు.. అధికారులు ఏమన్నారంటే?

image

AP: టెట్ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే వాటిని పరీక్ష కేంద్రాల వద్ద సరిచేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాజాగా హాల్ టికెట్లు రిలీజ్ చేయగా కొందరికి ఒకే రోజు వేర్వేరు చోట్ల పరీక్షా కేంద్రాలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అవసరమైతే అభ్యర్థులు సర్టిఫికెట్లు చూపించి సరిచేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఫోన్/మెయిల్ ద్వారా పంపవచ్చని చెప్పారు.

News September 23, 2024

అది నా జీవితంలో హైలైట్.. థాంక్యూ మెగాస్టార్: హరీశ్ శంకర్

image

తన డైరెక్షన్లో ఓ యాడ్ షూట్‌లో నటించిన మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు హరీశ్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘2 వారాలుగా జ్వరంతో బాధపడుతున్నా. నా జీవితంలో హైలైట్‌ను ఎట్టకేలకు ఇప్పుడు పంచుకుంటున్నా. కేవలం ప్రకటన కోసమే అయినా ఈ అనుభవం అద్భుతం. సెట్‌లో ప్రతి క్షణం ఓ మ్యాజిక్. ఆ రోజును నా జీవితాంతం మర్చిపోను. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాస్’ అని పేర్కొన్నారు.

News September 23, 2024

AIలో భద్రతా లోపాలు పెనుసవాలే!

image

OpenAI GPT, Google జెమిని, Meta LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లోని భద్రతా లోపాలు, మానవ ఆలోచనా విధానంపై వాటి అవగాహనలేమి ప్రపంచ భ‌ద్ర‌త‌కు పెనుస‌వాలుగా పరిణమిస్తున్నాయి. హానికర AI మోడల్స్‌ టెర్రరిజం, సైబర్, ఆర్థిక నేరాలు, మాల్వేర్, త‌ప్పుడు స‌మాచార సృష్టి, మాదకద్రవ్యాలు-ఆయుధాల తయారీ వంటి కార్యకలాపాల్లో సహాయపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

News September 23, 2024

నిద్ర పోయి రూ.9లక్షలు గెలుచుకుంది!

image

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరికి ఇది సాధ్యమైంది. తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన పరుపుపై 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్. విజయవంతంగా టాస్క్ పూర్తిచేయడంతో ఆమె రూ.9లక్షలు గెలుచుకుంది.

News September 23, 2024

రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ

image

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటివరకు భారత్‌లో రూ.604.22 కోట్లు(నెట్) రాబట్టగా రూ.713 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు తెలిపింది.