India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: డాక్టర్లతో తాము ఏర్పాటు చేసిన బృందం ఆసుపత్రులను సందర్శిస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని BRS ప్రశ్నించింది. వైద్యారోగ్య సేవల తీరుపై అధ్యయనం చేసే డాక్టర్ల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. డా.తాటికొండ రాజయ్య, డా.కల్వకుంట్ల సంజయ్, డా.మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంది. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హితవు పలికింది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో ఫైర్ విభాగంలో 1130 కానిస్టేబుల్ తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ పూర్తి చేసి, 18-23 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ లింక్: https://cisfrectt.cisf.gov.in/
స్టాక్ మార్కెట్లు ఆరంభంలోనే అదుర్స్ అనిపించాయి. లాభాలతో మొదలైన సూచీలు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. BSE సెన్సెక్స్ 84,843, NSE నిఫ్టీ 25,910 లెవల్స్ను టచ్ చేశాయి. ఇదే జోరు ప్రదర్శిస్తే సెన్సెక్స్ 85K, నిఫ్టీ 26Kను బ్రేక్ చేయడం ఖాయమే. M&M, శ్రీరామ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్ టాప్ గెయినర్స్. ICICI బ్యాంకు, హిందాల్కో, HCL టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, JSW స్టీల్ నష్టపోయాయి.
TG: డెబ్బై ఏళ్లు పైబడిన వారిని సైతం ఆయుష్మాన్ భారత్ కింద చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారు 5లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. వీరందరికీ ఆయుష్మాన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు.
TG: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ సిఫార్సులకై ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఆపై ఫిట్మెంట్, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పూర్తి నివేదిక సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీ గడువును మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP: కాకినాడ(R) MLA పంతం <<14168792>>నానాజీ <<>>పట్ల వైద్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. కాకినాడ RMC వైద్యుడిపై దాడి చేసిన ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. MLA, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయనుండగా, రేపు ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ SPకి ఫిర్యాదు చేయనుంది. ఈ ఘటనపై MLA ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఫిర్యాదుతో అరెస్టైన నిందితుడు కుక్కల విద్యాసాగర్కు ఏసీఎంఎం కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 4 వరకు విద్యాసాగర్ రిమాండ్లో ఉండనున్నారు. అతడిని డెహ్రాడూన్ నుంచి నిన్న విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేయించి తెల్లవారుజామున 4వ ఏసీఎంఎం జడ్జి ఇంటి వద్ద హాజరుపర్చారు.
గూగుల్, Nవిడియా, అడోబి సహా 15 టెక్ కంపెనీల CEOలను PM మోదీ MITలో కలిశారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయో టెక్నాలజీ రంగాలపై చర్చించారు. హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎకానమీని టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్చిందన్నారు. మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతున్న భారత్లో ఇన్నోవేషన్కు అనువైన వాతావరణం ఉందన్నారు. దీనిని క్యాపిటలైజ్ చేసుకోవాలన్న తన సూచనకు CEOలు సానుకూలంగా స్పందించారని ట్వీట్ చేశారు.
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పారు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో జడ్డూ 86 పరుగులతో పాటు 5 వికెట్లు తీశారు. ఇలా ఒక టెస్టులో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు 5 వికెట్లు తీయడం జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ లిస్టులో జడ్డూనే టాప్లో ఉన్నారు. ఆ తర్వాత అశ్విన్(11), కపిల్ దేవ్(7), హర్భజన్(3) ఉన్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా-2024గా రియా సింఘా నిలిచారు. జైపూర్లో దీనికి సంబంధించిన పోటీలు జరిగాయి. ఇందులో విజేతగా నిలిచిన రియా మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఈవెంట్కు నటి, మిస్ యూనివర్స్ ఇండియా- 2015 ఊర్వశీ రౌతేలా జడ్జిగా వ్యవహరించారు. ఈసారి తప్పకుండా ఇండియా గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.