News September 22, 2024

శ్రీవాణి లెక్కలు కూడా తేల్చాలి: పవన్ కళ్యాణ్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ <<14169086>>విచారణను<<>> డిప్యూటీ CM పవన్ స్వాగతించారు. ‘CM చంద్రబాబు నిర్ణయంతో తిరుమలలో ఎవరి వల్ల ఈ అపవిత్రత జరిగిందనే విషయం బయటకు వస్తుంది. ఇదే సమయంలో శ్రీవాణి టికెట్ల వ్యవహారంపైనా విచారించాలి. భగవంతుడికి చేసే సేవల విషయంలోనే కాదు. ఆర్థికపరమైన అంశాలలోనూ గత పాలకులు ఏ విధమైన పెడపోకడలు అవలంభించారో ప్రజలకు తెలియాల్సిన సమయం ఇది. ధర్మో రక్షతి రక్షిత:’ అని Xలో ట్వీట్ చేశారు.

News September 22, 2024

ఇక నుంచి రోజుకి ₹100, నెలకు ₹250 కూడా పెట్టుబ‌డి పెట్టొచ్చు

image

చిన్న‌మొత్తంలో పెట్టుబ‌డి పెట్టేవారిని ప్రోత్స‌హించేలా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మైక్రో-SIPల‌ను తీసుకురావ‌డానికి సెబీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీని ద్వారా ఇక నుంచి రోజుకు రూ.300 కాకుండా రూ.100 కూడా పెట్టుబ‌డిగా పెట్టొచ్చు. అలాగే నెల‌కు రూ.వెయ్యికి బదులుగా రూ.250, మూణ్నెళ్లకు రూ.3 వేల‌కు బ‌దులుగా రూ.750 వ‌ర‌కు పెట్టుబడి పెట్ట‌వ‌చ్చు. అక్టోబర్ మొదటివారంలో LIC MF అలాంటి ప్లాన్ ప్రారంభించనుంది.

News September 22, 2024

వదంతులపై నటి సిమ్రాన్ ఆగ్రహం

image

ఒకప్పటి నటి సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాపై ఎన్ని రాసినా ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నా. నేను ఏ పెద్ద హీరోతోనూ కలసి పనిచేయాలన్న ఆరాటంతో లేను. నా పేరును వాడటం మానండి. నాపై వదంతులు వ్యాప్తి చేస్తున్నవారు నాకు క్షమాపణ చెప్పాలి’ అని స్పష్టం చేశారు.

News September 22, 2024

అందుకే గాంధీ వచ్చారు: శ్రీధర్ బాబు

image

TG: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సీఎల్పీ సమావేశం జరగడంతో సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యే అరెకపూడి <<14167699>>గాంధీ<<>> వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హరీశ్ రావు నియోజకవర్గానికి సీఎం వెళ్తే ఆయన వెళ్తారా లేదా అని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ దిట్ట అని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

News September 22, 2024

ఇలా జరిగిందేంటి ‘దేవర’?

image

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఈ ఈవెంట్ ఔట్‌డోర్‌లో నిర్వహించాల్సిందని ఫ్యాన్స్ వాపోతున్నారు. వేలాదిగా అభిమానులు తరలివస్తారని తెలిసి కూడా నిర్వాహకులు వేదికను ఎంచుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందని అంటున్నారు. రేపు ఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి మళ్లీ ఈవెంట్ నిర్వహించాలంటే ఆయన యూఎస్ పర్యటన రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.

News September 22, 2024

అందుకే శ్యామలరావును ఈఓగా నియమించా: చంద్రబాబు

image

AP: TTD ప్రక్షాళన కోసం శ్యామలరావును ప్రత్యేకంగా నియమించినట్లు CM చంద్రబాబు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యతను దేవుడు తనకిచ్చాడని చెప్పారు. ‘ఘుమఘులాడాల్సిన శ్రీవారి లడ్డూ పేలవంగా మారింది. మూడు రోజులకే చెడిపోతోంది. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రసాదాన్ని కల్తీ చేశారు. అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. రూ.319కి కిలో నెయ్యి కొన్నారు. ఆ ధరకు వనస్పతి, పామాయిల్ కూడా రాదు’ అని పేర్కొన్నారు.

News September 22, 2024

మార్పులు లేకుండానే రెండో టెస్టుకు

image

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత స్క్వాడ్‌లో మార్పులు లేవని బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 27నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచులో 280 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
స్క్వాడ్: రోహిత్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్

News September 22, 2024

మెగాస్టార్‌కు లోకేశ్, కేటీఆర్ విషెస్

image

గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఏపీ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలేనని ట్వీట్ చేశారు. ఈ ఘనత తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన 46 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. తరతరాలను అలరిస్తూ తెలుగు సినిమాకు గర్వకారణమైన చిరంజీవికి అభినందనలు తెలియజేశారు.

News September 22, 2024

అనుర కుమార దిసనాయకే ఎవరంటే?

image

శ్రీలంక దేశాధ్యక్ష పీఠంపై కూర్చోనున్న <<14168908>>దిసనాయకే <<>>(55) వామ‌ప‌క్ష పార్టీ అయిన‌ జనతా విముక్తి పెరమున(JVP)కు నాయ‌కత్వం వ‌హిస్తున్న‌ారు. ప్ర‌స్తుతం కొలంబో జిల్లా నుంచి పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ పీపుల్స్ ప‌వ‌ర్‌ కూట‌మికి ఆయన సారథ్యం వ‌హిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3వ స్థానానికే పరిమితమైన ఆయన ఈ సారి అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో సత్తా చాటి భారీ తేడాతో గెలిచారు.

News September 22, 2024

లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చర్యలు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని TTD ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నాం. దోషాలను తొలగించడానికి ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించాం. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే తిరుమలలో FSSL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.