India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ధ్యానం, దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఇటీవల ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ సా.5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు.

TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.

భరణమనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంది. భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. వన్టైమ్ సెటిల్మెంట్గా రూ.12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. భక్తులు ఏ క్యూలోనైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాలయ ప్రవేశం ఉండదని, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ వివరాలను ప్లే స్టోర్లోని ‘భవానీ దీక్ష 2024’ యాప్లో చూసుకోవచ్చు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.

AP: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్రను గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట (D) హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తికాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య BGT నాలుగో టెస్ట్ ఈనెల 26 నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఇవాళ ఉదయం అక్కడ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు 3 టెస్టులు జరగ్గా ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. WTC ఫైనల్ చేరాలంటే భారత్ చివరి రెండు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోహిత్, కోహ్లీ ఫామ్ లేమి ఫ్యాన్స్ను కలవరపెడుతోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.

FM నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్లపై GST రేటు తగ్గించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. జొమాటో, స్విగ్గీపై GST రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోల్/డీజిల్తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై GSTని 12% నుంచి 18%కి పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 148 వస్తువులపై GSTని సవరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.