India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేవరకూ ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్లో త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతుంది. పాక్తో మాట్లాడాలని ప్రతిపక్షాలంటున్నాయి. ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయేవరకు అది జరగని పని. బీజేపీ మీకు హామీ ఇస్తోంది. ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టం’ అని స్పష్టం చేశారు.
TG: హైదరాబాద్లోని నొవాటెల్లో జరగాల్సిన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. అనుమతించిన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో అభిమానులు కార్యక్రమానికి రావడంతో భద్రతా పరమైన కారణాలతో నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు అభిమానులు భారీగా రావడంతో నొవాటెల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈవెంట్కు వచ్చిన సెలబ్రిటీలు వెనుదిరిగారు.
చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘గిన్నిస్ బుక్లో సినిమా సంబంధిత రికార్డ్స్ ఎక్కువగా చూడలేదు. అద్భుతమైన సినిమా సెట్స్, బాండ్ చిత్రాలకు సంబంధించి కొన్ని రికార్డులు ఉన్నాయి. కానీ అన్నయ్య 153 సినిమాల్లో 537 పాటల్లో 24వేల డాన్స్ మూమెంట్స్ చేసి ఈ రికార్డు సాధించినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ALL THE BEST’ అని ఆయన ట్వీట్ చేశారు.
AP: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, తూ.గో, YSR, అన్నమయ్య, చిత్తూరులో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, తూ.గో, YSR, అన్నమయ్య, చిత్తూరులో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP: జరిగిన తప్పులు క్షమాపణకు శాంతి యాగం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద చేస్తామన్నారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగంపై సిట్ వేస్తామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు.
చెస్ ఒలింపియాడ్లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకుని భారత్ చరిత్ర లిఖించింది. స్లోవేనియాతో జరిగిన చివరి రౌండ్లో వ్లాదిమిర్ ఫెదోసీవ్ను గుకేశ్, ఇరిగేశీ జాన్ సుబెల్జ్ను అర్జున్ ఓడించారు. దీంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది. అటు అమ్మాయిల బృందం కూడా స్వర్ణం గెలవడంతో భారత్కు ‘ఒలింపియాడ్ డబుల్’ సొంతమైంది.
AP: గత పాలకులు తిరుమలలో చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోరని CM చంద్రబాబు అన్నారు. ‘అన్యమతస్థులు కొండపై వ్యాపారాలు చేశారు. క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె పెళ్లి చేసిన భూమన కరుణాకర్రెడ్డిని TTD ఛైర్మన్ను చేశారు. కుమారుడు చనిపోతే EO ధర్మారెడ్డి కొండపైకి వెళ్లారు. దేవుడికి ఇలాంటి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడి చేస్తారా? ‘ అని CM ప్రశ్నించారు. అపచారాలు చేసి కూడా YCP నేతలు పశ్చాత్తాపం పడటం లేదన్నారు.
శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. విపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానానికి పరిమితమయ్యారు. దిసనాయకేకు 42.31 శాతం ఓట్లు రాగా, ప్రేమదాసకు 32.76 శాతం ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య దాదాపు 10 లక్షల ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. 17.27 శాతం ఓట్లతో రణిల్ మూడో స్థానంలో నిలిచారు.
నటుడు సైఫ్ అలీఖాన్తో పెళ్లి అనగానే తన సన్నిహితులు హెచ్చరించారని నటి కరీనా కపూర్ తెలిపారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘సైఫ్తో పెళ్లి వద్దని అందరూ వారించారు. అతడిని పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోయినట్లేనని చెప్పారు. కానీ వారి మాటలు నేను లెక్క చేయలేదు. కెరీర్ ముగిసిపోవాలని రాసి ఉంటే అలానే జరుగుతుంది. నా జీవితంపై నాకు బాగా అవగాహన ఉందని చెప్పా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.