India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్నెస్ కాలర్ ట్యూన్లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్కు కొంత ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆయనపై <<14936688>>ఈడీ కేసు<<>> ఫైల్ చేసింది. దీనిని కూడా క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ వేయాలా? పిటిషన్ వేయకుండా ఈడీ విచారణకు హాజరవ్వాలా అనే దానిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సుప్రీం కోర్టులో 82,640, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కలిపి మొత్తం 61,80,878 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు.

వచ్చే 2025 సీజన్లో ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్కు రూ.422 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్వింటాల్ ధర రూ.12,100కి చేరనుంది. ఇందుకోసం రూ.855 కోట్లు కేటాయించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. బంతి కొబ్బరి MSP రూ.100 పెంచనున్నట్లు తెలిపింది. ఎండు కొబ్బరి ఉత్పత్తి దేశంలో అత్యధికంగా కర్ణాటకలో (32.7%) జరుగుతుండగా, ఏపీలో 7.7%గా ఉంది.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 25న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్నారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.

విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. HYD, VZMతో పాటు మొత్తం 7 నగరాల్లో ఈ మ్యాచులు జరగనుండగా, 38 జట్లు పోటీ పడనున్నాయి. జనవరి 5తో గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగియనుండగా, JAN 9 నుంచి నాకౌట్ మ్యాచులు నిర్వహిస్తారు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్, రుతురాజ్, ఇషాన్ కిషన్, అర్ష్దీప్, అభిషేక్ శర్మ తదితరులు పాల్గొంటారు. ఆంధ్ర కెప్టెన్గా KS భరత్, HYD కెప్టెన్గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు.

అల్లు అర్జున్తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని BC పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఎన్నికలో ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్థుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. బై ఎలక్షన్లో ప్రియాంకకు 6.22లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09లక్షల ఓట్లు పోలయ్యాయి.

చలికాలంలో చాలామంది వేడి నీటితో స్నానం చేసేందుకే ఇష్టపడతారు. కానీ చన్నీటితో చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి. చర్మం మెరిసిపోతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గి రిలాక్స్ ఫీల్ అవుతారు. ఆరోగ్యం బాగాలేని వారు చల్లని నీటికి బదులు వేడి నీటితోనే స్నానం చేయడం బెటర్.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతగిరి మండలం బల్లగరువు(పినకోట పంచాయతీ)లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 గంటలకు ఆయన బల్లగరువు ప్రాంతానికి చేరుకుంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
Sorry, no posts matched your criteria.