India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మరింత బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి టైప్-2 డయాబెటిస్ బారిన పడొచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. మూడు పూటలా తగినంత భోజనం తీసుకోకపోతే శరీరానికి తగినంత పోషకాలు అందవు. ఎంతో కొంత ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఉత్తమం.
బడ్జెట్లో ప్రకటించినట్లుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని EPF అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈమేరకు గరిష్ఠంగా ఒక ఉద్యోగికి రూ.15వేలు అందనుంది. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96లక్షల మంది చందాదారులు, 4.54లక్షల మంది పెన్షన్ తీసుకునేవారున్నట్లు కేంద్రమంత్రి HYDలోని PF కార్యాలయంలో తెలిపారు.
AP: తిరుమలకు పంపే ‘నందిని’ ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.
తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలో నార్పల-అనంతపురం ప్రధాన రహదారిపై అర్ధరాత్రి లారీ, ఇన్నోవా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటు తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో తెల్లవారుజామున ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని మంత్రి రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్యూటీ సమయంలో వారు ఆస్పత్రుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బయోమెట్రిక్ మిషన్లు ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇన్ అండ్ అవుట్ హాజరును నమోదు చేయాలని సూచించారు. నెలలో కనీసం రెండు సార్లు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు.
TG: రాష్ట్రంలో మరో ఆరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను ప్రభుత్వం నియమించింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కమ్మర్పల్లి, వేల్పూరు, కరీంనగర్ జిల్లాలో గోపాల్రావు పేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బోయిన్పల్లి, కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70 మార్కెట్లకు పాలకవర్గాల నియామకం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లను పొందొచ్చు.
TG: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వంట పాత్రల కొనుగోలుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్కి రూ.10వేల నుంచి రూ.25 వేలు కేటాయించింది. మొత్తంగా రూ.23.76 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం 23 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకునేందుకు డీఈవోలకు అనుమతినిచ్చింది.
పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరిక ప్రకటన OTTలకు తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈమేరకు సవరించిన ప్రతిపాదనలను కేంద్రం విడుదల చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ స్టేటస్తో సంబంధం లేకుండా ప్రసారమయ్యే అన్ని సినిమాలకు ప్రారంభంలో, మధ్యలో కనీసం 30సెకన్ల పొగాకు వ్యతిరేక ప్రకటన ప్రసారం చేయాల్సి ఉంటుంది. సినిమాల్లోనూ పొగాకు ఉత్పత్తులను వాడే సన్నివేశాల సమయంలో హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.