India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తిరుమల లడ్డూ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.
AP: ప్రాయశ్చిత్త <<14161291>>దీక్ష<<>> చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదని చంద్రబాబు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకొని భక్తుల మనోభావాలను సీఎం దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన బాబు దీక్ష చేయాలని రాంబాబు ట్వీట్ చేశారు.
హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అమిత్ గార్గ్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్కు చెందిన గార్గ్ 2027 అక్టోబర్ 31 వరకు పదవిలో ఉంటారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్గా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ రంజన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లు రిత్విక్ రుద్ర, మహేశ్ దీక్షిత్, ప్రవీణ్ కుమార్, అరవింద్ కుమార్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ ద్వయం నుంచి వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ కాంబోలో మరో చిత్రం రానుండగా దసరాకు షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా తమన్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తోంది. సూపర్ హిట్ అఖండ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కనుందని టాక్. దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
TG: కాంగ్రెస్ సర్కార్ సింగరేణి కార్మికుల ఆశలను అడియాశలు చేసిందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. దసరాకు తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పిందని విమర్శించారు. ‘మా హయాంలో రూ.2,222 కోట్ల లాభాలు వస్తే రూ.710 కోట్ల బోనస్ ఇచ్చాం. కానీ ఇప్పుడు రూ.4,701 కోట్ల లాభం వచ్చినా రూ.796 కోట్లే ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మిగతా రూ.754 కోట్లు ఏమయ్యాయి?’ అని ఆయన ప్రశ్నించారు.
AP: చంద్రబాబు దేవుడితో రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ‘జూన్ 12న శాంపిల్స్ తీసుకుంటే 23న రిపోర్ట్ వచ్చింది. తిరుమలలో ల్యాబ్ లేదని చెబుతున్నారు. తిరుమల ల్యాబ్ అడ్రస్తో రిపోర్ట్ వచ్చింది. అది ఎలా సాధ్యం?. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడినట్లు రిపోర్టుల్లో లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. దాదాపు 55K.Mల పరిధిలో 12వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కూల్చివేతల బాధ్యతలను హైడ్రాకు అప్పగించగా, రేపటి నుంచి బుల్డోజర్ రంగంలోకి దిగనుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
AP: తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఏడుకొండల వాడిని క్షమించాలని కోరారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి వాటికి పాల్పడుతారన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోతే హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. పాప నివారణగా రేపు ఉదయం కాకానిలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల దీక్ష చేపడుతానని తెలిపారు.
Sorry, no posts matched your criteria.