India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

* రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అశ్విన్
* జమిలి కోసం జేపీసీ ఏర్పాటు
* రూ.76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం: పవన్
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* పరిటాల రవి హత్య కేసు నిందితులకు బెయిల్
* TG: జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
* రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన
* ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR
* ముంబై పడవ ప్రమాదంలో 13 మంది దుర్మరణం

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ ఓడింది. 41-37 తేడాతో గెలిచిన పట్నా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆ జట్టులో రైడర్ దేవాంక్ 14 పాయింట్లతో రాణించారు. ఈ మ్యాచులో ఓడటంతో టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కొందరినే దోమలు ఎక్కువగా కుడతాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా, చెమట ఎక్కువగా పట్టినా దోమలు వారికి ఎట్రాక్ట్ అవుతాయి. మద్యపానం చేసేవారికి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసేవారిని టార్గెట్ చేసి కుడతాయి. నలుపు, ఆకుపచ్చ, ఊదా రంగు దుస్తులు ధరించినా వారిని వదలవు. ఇక O, AB బ్లడ్ గ్రూప్ వారు దొరికితే దోమలకు పండగే.

WTC 2025-27లో భారత టీం షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టీమ్ ఇండియా ఆరు టెస్ట్ సిరీస్లు ఆడనుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్లు స్వదేశంలో, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్లు విదేశాల్లో ఆడనుంది. జూన్లో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. BGT తర్వాత మరో 4 నెలలపాటు భారత్కు టెస్టు సిరీస్ లేదు. వచ్చే ఏడాది అక్టోబర్లో సౌతాఫ్రికాతో సిరీస్ ప్రారంభం కానుంది.

ఢిల్లీ నుంచి కన్నూర్ (కేరళ)కు డిసెంబర్ 22న ఇండిగో ఫ్లైట్ టికెట్ ధర రూ.22,000 చూపించడంతో సోషల్ మీడియాలో టికెట్ ఫేర్లపై చర్చ జరుగుతోంది. దీని కంటే ఢిల్లీ నుంచి దుబాయ్ టికెట్ ధర రూ.21000 చూపిస్తోందని పోస్టులు చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలో బుక్ చేసుకోవడం, క్రిస్మస్ సందర్భంగా ధరలు పెరిగి ఉంటాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకూ ఇలాంటి అనుభవం ఎదురైందా?

ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి విలువ సుమారు రూ.132 కోట్లు ఉంటుందని అంచనా. భారత జట్టుకు ఆడినందుకు మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.10 కోట్లు తీసుకుంటారు. IPLలో RR తరఫున ఆడిన ఈ లెజెండరీ స్పిన్నర్ సీజన్కు రూ.5 కోట్ల చొప్పున అందుకున్నారు. తాజాగా రూ.9.75 కోట్లకు CSK అతణ్ని దక్కించుకుంది. మింత్రా, ఒప్పో, కోకా-కోలా లాంటి పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్నారు.

TG: హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ FTL నిర్ధారణలో అక్రమాలు జరిగినట్లు హైడ్రా గుర్తించింది. ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణదారులకు సహకరించి FTL మ్యాప్లో మార్పులు చేసినట్లు తనిఖీల్లో తేలింది. అధికారులు వెంకటేశం, భీమ్ ప్రసాద్, శేఖర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

శీతాకాలంలో చాలామంది గీజర్లు వాడతారు. వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అత్యుత్తమ బ్రాండ్ గీజర్లనే ఉపయోగించాలి. వేడి నీటిని బకెట్లో నింపుకుని గీజర్ ఆఫ్ చేసిన తర్వాతే స్నానం చేయాలి. దీనిని ఎక్కువసేపు ఆన్లో ఉంచకూడదు. లేదంటే పేలిపోయే ప్రమాదం ఉంది. గీజర్లకు తడి తగలకుండా ఎత్తులో బిగించాలి. అప్పుడప్పుడు గీజర్ వాల్వ్లో ఏమైనా లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి.

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రానున్న సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా నిర్మాణ సంస్థ SLV మూవీస్ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుపై వచ్చిన ఊహాగానాల్లో నిజం లేదని పేర్కొంది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అఫీషియల్ ప్రకటనలను తామే ట్వీట్ చేస్తామని తెలిపింది.

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ది న్యూ ఇండియా అస్యూరెన్స్’ 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. APలో 10, TGలో 10 చొప్పున ఖాళీలున్నాయి. నిన్నటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వయసు 1 జనవరి 2024 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పాసైన వారు అర్హులు. 25 జనవరి 2025న ప్రిలిమ్స్, 2 మార్చి 2025న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <
Sorry, no posts matched your criteria.