India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
ఈ ఏడాది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో తొలి 2స్థానాలను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. అగ్రస్థానంలో రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్టెయిల్(ధర రూ.251 కోట్లకు పైమాటే), రెండో ప్లేస్లో బోట్ టెయిల్(రూ.234 కోట్లు), రూ.156 కోట్లతో బుగాటీ లా వోయిచర్ నోయిర్ 3వ స్థానంలో నిలిచాయి. పగానీ జోండా హెచ్పీ బార్చెటా(రూ.142 కోట్లు), ఎస్పీ ఆటోమోటివ్ చౌస్(రూ.120 కోట్లు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.
✒ తేది: సెప్టెంబర్ 21, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:31 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: సెప్టెంబర్ 21, శనివారం
✒ చవితి: సాయంత్రం 6.14 గంటలకు
✒ భరణి: రాత్రి 12.36 గంటలకు
✒ వర్జ్యం: రాత్రి 11.28 నుంచి 12.55 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 5.57 నుంచి 6.45 గంటల వరకు
ముంబైలోని ‘లాల్బాగ్చా రాజా’ వినాయకుడిని నగరంలో అత్యంత ఘనంగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గణేశ్ చతుర్థికి భక్తులు ఆయనకు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. మొత్తం రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండి స్వామివారికి సమకూరాయని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ స్వామి నిమజ్జన వేడుకలో అంబానీలు సహా వేలాదిమంది భక్తులు పాల్గొనడం విశేషం.
➣AP: అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు: సీఎం చంద్రబాబు
➣TG:సింగరేణి కార్మికులకు రూ.1.90లక్షల చొప్పున దసరా బోనస్: CM రేవంత్
➣AP:కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: YS జగన్
➣భక్తుల మనోభావాలతో చెలగాటం వద్దు: పవన్
➣జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈవో
➣TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
➣ఉచితాలు వద్దు అనే మార్పు రావాలి: ఈటల
➣కాళేశ్వరం కింద పండే పంటలపై KCR పేరుంటుంది: హరీశ్
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాసిక్యూషన్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు CBI కాపీ సమర్పించింది. ఈ కేసులో CBI ఇప్పటికే లాలూ, అయన కుటుంబ సభ్యుల పాత్రపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్కు రాష్ట్రపతి అనుమతి లభించడంతో ఛార్జిషీట్ను కోర్టు ఇప్పుడు సమీక్షించి వారిపై అభియోగాలు మోపనుంది.
తన లోపాలను తెలుసుకోవడమే తన విజయానికి కారణమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, విలన్ పాత్రలు వేశారు. కానీ అక్కినేని ఒక్కసారీ విలనీ వైపు వెళ్లలేదు. పౌరాణికాల్ని పెద్దగా టచ్ చేయలేదు. తన రూపం, కంఠం అందుకు సరైనవి కావని ఆయన భావించడమే దానిక్కారణం. కానీ సాంఘిక సినిమాల్లో మాత్రం విశ్వరూపం చూపించారు. నేడు ఆ మహానటుడి శతజయంతి. సినిమా ఉన్నంతకాలం ఆయన మన మధ్య జీవించే ఉంటారు.
AP: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.