India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AUSతో జరుగుతోన్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసినా టీమ్ ఇండియా WTC ఫైనల్కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే తర్వాత జరగబోయే మిగతా రెండు టెస్టుల్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో IND 57.29 PCTతో మూడో స్థానంలో ఉంది. టాప్-2లో SA (63.33), AUS (60.71) ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రా అయి, మిగతా 2 టెస్టులు గెలిస్తే భారత జట్టు PCT ఆసీస్ కంటే మెరుగవుతుంది.

TG: అత్యవసర సేవలన్నింటికీ ఇక నుంచి ఒకే నంబర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయల్ 100, 108, 101 స్థానంలో ‘డయల్ 112’ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీజీ పేరుతో అధికారులు లోగోను సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం కేంద్రం గతంలోనే 112 నంబర్ను తెచ్చింది. రాష్ట్రంలో త్వరలోనే సీఎం రేవంత్ ఈ సేవలను ప్రారంభించనున్నారు.

AP: రైతులకు 35 శాతం రాయితీపై గోదాములను అద్దెకు ఇవ్వాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గిట్టు బాటు ధర లభించే వరకూ నిల్వ చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. రైతులకు రాయితీపై విత్తనాలను అందించాలని ఆదేశించారు.

TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై PM మోదీ వైఖరిని నిరసిస్తూ రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని TPCC నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగినప్పటి నుంచి PM అక్కడికి వెళ్లలేదని INC విమర్శిస్తోంది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్ఏషియా ఎయిర్లైన్ ఇటీవల ఢిల్లీ- డాన్ ముయాంగ్ (బ్యాంకాక్) మధ్య విమానాలను ప్రారంభించడంతో ఈ మైలురాయిని సాధించినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది. ఢిల్లీ నుంచి రోజూ 1,400 ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొంది.

దొండకాయలను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే శరీరానికి పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే డయాబెటిస్, మూత్రాశయ వ్యాధులు, చర్మ సమస్యలు తగ్గుతాయని, కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయని అంటున్నారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుందని పేర్కొంటున్నారు. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

TG: లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నిరసనలు చేపట్టాలని BRS శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. ఉ.11 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని, జైళ్లలో నిర్బంధించి అణిచివేత విధానాలను అమలు చేస్తోందన్నారు.

ఇండియన్ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి డ్రాప్ అయినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీ వ్యక్తిగత సంపద గత జులైలో $120.8B కాగా, ఈనెల 13 నాటికి $96.7Bకు తగ్గిందని తెలిపింది. మరోవైపు అదానీ సంపద $122.3B నుంచి $82.1Bకు దిగి వచ్చినట్లు పేర్కొంది. శివ్ నాడార్ సంపద $10.8B, సావిత్రి జిందాల్ సంపద $10.1B పెరిగినట్లు వెల్లడించింది.

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉ.11.30కి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కూడా హాజరు కానున్నారు. ఈ ప్రోగ్రామ్లో ఈ ప్రోగ్రామ్ 49 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు, నలుగురికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు. అనంతరం HYDకి పయనమవుతారు.

బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ తర్వాత రామ్ చరణ్ ‘పుష్ప-2’ డైరెక్టర్ సుకుమార్తో ఓ సినిమా చేయబోతున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’కు ఇది పూర్తి భిన్నంగా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్ కొత్తగా, స్టైలిష్గా కనిపిస్తారని సమాచారం. రొమాన్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.