News September 20, 2024

ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’

image

రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమార్ సతీమణి తబిత నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

News September 20, 2024

కోకకోలా, పెప్సీ డిస్కౌంట్లు ఇవ్వాల్సిందేనా ఇక!

image

కూల్‌డ్రింక్స్ మార్కెట్లో డిస్కౌంట్లు, ప్రైస్‌వార్‌ షురూ కానుంది! కాంపాకోలాను రిలయన్స్ కొత్త మార్కెట్లకు విస్తరిస్తుండటం, కోకకోలా, పెప్సీతో పోలిస్తే సగం ధరకే అమ్మడం ఇందుకు కారణాలు. పండగల సీజన్లో సాఫ్ట్ డ్రింక్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఈ టైమ్‌లో తూర్పు, మధ్య, దక్షిణ భారతంలో RIL సప్లై పెంచుతోంది. దీంతో ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రత్యర్థి కంపెనీలు ఇకపై ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది.

News September 20, 2024

ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే!

image

AP: పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. RJD, DEO, MEOల స్థాయిలో మ్యానువల్ ఫైళ్లకు స్వస్తి చెప్పి, ఈ-ఆఫీసు విధానం తీసుకురానుంది. టీచర్లు, విద్యార్థులు, ఖాళీ పోస్టులు, బదిలీలు ఇలా వివరాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి, టీచర్లందరికీ లాగిన్ అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం టీచర్లు వాడుతున్న యాప్స్‌ను తొలగించి, వెబ్‌సైట్‌లోనే అన్నింటినీ ఏర్పాటు చేయనుంది.

News September 20, 2024

Stock Market: గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. NSE నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 25,468, BSE సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 83,275 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. నిన్న విలవిల్లాడిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నేడు రేంజ్‌బౌండ్లో ట్రేడవుతున్నాయి. JSW స్టీల్, HDFC లైఫ్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్.

News September 20, 2024

పెళ్లి పేరుతో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు!

image

పెళ్లి పేరుతో ఓ జడ్జి సహా 50మందికి పైగా మహిళల్ని మోసం చేసిన UP వ్యక్తి ముకీమ్‌ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి ఫేక్ IDలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. పెళ్లి ఫిక్సయ్యాక మ్యారేజ్ హాల్స్ బుకింగ్, ఇతర కారణాలు చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యేవాడు. పెళ్లి కాని, వితంతు ముస్లిం మహిళల్నే తాను టార్గెట్ చేసినట్లు విచారణలో తెలిపాడు.

News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News September 20, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. వారిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ USలో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించామని, శ్రవణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు.

News September 20, 2024

బెంగాల్ X ఝార్ఖండ్: సరిహద్దు మూసేసిన మమత

image

ఝార్ఖండ్ సరిహద్దును మూసేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వల్ల 5 లక్షల క్యూసెక్కుల వరద సౌత్ బెంగాల్లోని 11 జిల్లాలను ముంచేసిందని ఆమె ఆరోపించారు. DVC ఎప్పుడూ ఝార్ఖండ్ గురించే ఆలోచిస్తోందని, దాంతో సంబంధాలు తెంపుకుంటున్నామని ప్రకటించారు. ‘ఆమెదో విపరీత చర్య. బెంగాల్‌కు ధాన్యం తెచ్చే ట్రక్కులను మేమూ ఆపేస్తాం’ అని JMM హెచ్చరించింది.

News September 20, 2024

లడ్డూ వ్యవహారం ఎవరూ ఊహించనిది: ప్రణిత

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై నటి ప్రణితా సుభాష్ స్పందించారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వులు వినియోగించడం వేంకటేశ్వరస్వామి భక్తులు ఊహించలేని విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. అటు ఇదే వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

News September 20, 2024

‘ఎన్టీఆర్-నీల్’ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచంటే?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ‘దేవర’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో 40 రోజులపాటు ఇతర నటీనటులతో సీన్లను షూట్ చేస్తారని, తాను 2025 జనవరి నుంచి సెట్స్‌లో జాయిన్ అవుతానని పేర్కొన్నారు. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.