News December 16, 2024

టీడీపీ నేతలతో వైసీపీ నేత.. వివరణ కోరిన లోకేశ్

image

ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కొనకళ్ల నారాయణ సహా పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జోగి కూడా హాజరయ్యారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎవరు ఆహ్వానించారనే విషయాలపై లోకేశ్ వివరణ కోరారు.

News December 16, 2024

ఈసారి నేషనల్ అవార్డు వచ్చేదెవరికో!

image

‘పుష్ప’ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప-2’తో మరోసారి అందుకుంటారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ ఏడాది మరికొందరు నటులూ తమ అద్భుతమైన నటనతో మెప్పించారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ‘మహారాజ’లో విజయ్ సేతుపతి, ‘గోట్ లైఫ్’లో పృథ్వీరాజ్, ‘తంగలాన్’లో విక్రమ్‌ల నటన కూడా అద్భుతంగా ఉందంటున్నారు. మరి ఈ ఏడాది నేషనల్ అవార్డు ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి.

News December 16, 2024

శాసనసభ రేపటికి వాయిదా

image

TG: అసెంబ్లీలో పర్యాటకంపై చర్చ జరుగుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభా మర్యాదలు పాటించాలని, సభాపతిని గౌరవించాలని విపక్ష నేతలను స్పీకర్ కోరారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని సూచించారు. మరోవైపు తమకు మాట్లాడే సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. నిరసనల నడుమ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

News December 16, 2024

స్టార్ క్రికెటర్‌కు బిగ్ షాక్

image

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు షాక్ తగిలింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో అతను బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ఆల్‌రౌండర్‌పై నిషేధం విధించగా, BCB కూడా తాజాగా ఈ ప్రకటన చేసింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందగా, పరీక్షలో మోచేయి పరిధి 15 డిగ్రీలను మించిన్నట్లు తేలింది.

News December 16, 2024

బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్

image

TG: బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదని హరీశ్ రావు అన్నారు. ఏ సబ్జెక్ట్ పై మాట్లాడాలో చెప్పలేదని తెలిపారు. సభను కనీసం 15 రోజులు జరపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

News December 16, 2024

కాసేపట్లో CBNతో పవన్ భేటీ.. నాగబాబు మంత్రి పదవిపై చర్చ!

image

AP: సచివాలయంలోని బ్లాక్-1లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి, ఏ శాఖ అప్పగించాలనే అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పవన్, నాదెండ్ల, దుర్గేశ్‌ మంత్రులుగా ఉండగా నాగబాబుతో నాలుగో స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

News December 16, 2024

అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు

image

TG: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిషేధించారు. ఈ మేరకు అసెంబ్లీలో నో ఎంట్రీ బోర్డులు దర్శనమిచ్చాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియోలు తీయొద్దని మీడియాను కూడా ఆదేశించారు. దీనిపై మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News December 16, 2024

వాలంటీర్ల నిరాహార దీక్ష

image

AP: తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు విజయవాడలో ఆందోళనకు దిగారు. గాంధీనగర్ అలంకార్ థియేటర్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు 50 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. వీరి దీక్షకు AISF మద్దతు తెలిపింది.

News December 16, 2024

మూవీ షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. జపాన్‌లో వచ్చే నెల 3వ తేదీన రిలీజయ్యే ‘కల్కి’ ప్రమోషన్లకు తాను హాజరవట్లేదని ప్రభాస్ వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెనికిందని, అందుకే వెళ్లలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

News December 16, 2024

ఉద్యోగాల భర్తీపై భట్టి కామెంట్స్

image

TG: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీలో భట్టి వెల్లడించారు.