India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

* AP: పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ: చంద్రబాబు
* విజన్-2047తో ప్రజలను CBN మభ్యపెడుతున్నారు: జగన్
* స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారు: అనిత
* TG: భూమిలేని నిరుపేదలకు రూ.12వేలు: భట్టి
* బీజేపీ చీఫ్ రేసులో నేను లేను: బండి సంజయ్
* రేవంత్ పాలనలో తిరోగమిస్తున్న తెలంగాణ: కేటీఆర్
* తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి
* బిగ్బాస్-8 విజేతగా నిఖిల్

బిగ్బాస్ సీజన్-8 విన్నర్గా నిఖిల్ నిలిచారు. ఆయనకు నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ రూ.55 లక్షల ప్రైజ్మనీ అందించారు. దీంతో పాటు మారుతీ సుజుకీ డిజైర్ కారును గిఫ్ట్గా అందించారు. వీటితో పాటు ఇన్ని రోజులు హౌస్లో ఉన్నందుకు వారానికి రూ.2.25లక్షల చొప్పున 15 వారాలకు రూ.33.75 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా కారుతో పాటు రూ.88 లక్షలు వెనకేశాడు నిఖిల్.

తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ను సినీ ప్రముఖులు కలవడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో టాప్ హీరో జైలుకు వెళ్లడం సంచలనంగా మారగా ఆయనను సినీ ప్రముఖులు కలవడంలో తప్పు లేదని కొందరు అంటున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడిని, తల్లిని కోల్పోయిన చిన్నారిని కలిసిన వారే లేరని కొందరు పెదవి విరుస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 195-4 స్కోర్ చేయగా, ఛేదనలో విండీస్ 146-7 రన్స్కు పరిమితమైంది. ఇండియన్ బౌలర్లలో టిటాస్ సాధు 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 73 పరుగులతో రాణించిన జెమిమా రోడ్రిగ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టీ20 ఈనెల 17న జరగనుంది.

పెళ్లి అనంతరం పిల్లలు పుడితే అది లక్ష్యం నుంచి దృష్టి మరల్చుతుందనే ఉద్యమంలో ఉన్నవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పనిసరి అని TGకి చెందిన ఓ Ex మావో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించారు. ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్లో అమిత్ షాతో మాటామంతి సందర్భంగా మాజీ మావోయిస్టులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. ఆయుధాలు వదిలిన వారు తిరిగి వేసెక్టమీ రివర్సల్ ఆపరేషన్ చేయించుకొని సంతానం పొందుతారన్నారు.

ఓ పూరి గుడిసెపై దాడి చేసిన ఏనుగు ఇద్దరు అక్కాచెల్లెళ్లను తొక్కి చంపిన ఘటన ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. బోనాయి అటవీ డివిజన్లోని కాంతపల్లిలో ఇంటిపై ఏనుగు దాడి చేయగా ఒకవైపు భాగం నేలకూలింది. దీంతో ఏనుగును గమనించిన ఇంట్లోని పెద్దవాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, నిద్రలో ఉన్న సమియా ముండా(12), ఆమె సోదరి చాందిని(3)ని ఏనుగు తొక్కి చంపినట్టు అధికారులు తెలిపారు.

మార్చి 9, 1951లో ముంబైలో జన్మించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, తండ్రి అల్లా రఖా నుంచి సంగీతంలో శిక్షణ పొంది హిందుస్థానీ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో కలిపి ఫ్యూజన్ సంగీతానికి కొత్త దిశను చూపారు. గ్రామీ లాంటి ప్రపంచ పురస్కారాలు, దేశ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. జాకీర్ జీవితం, సంగీత ప్రస్థానం భారతీయ తబలా కళకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టాయి.

బిగ్బాస్ సీజన్-8 ముగిసింది. 106 రోజుల ఆట తర్వాత విజేతగా సీరియల్ యాక్టర్ నిఖిల్ నిలిచారు. అంతకుముందు ప్రేరణ, అవినాశ్, నబిల్ ఎలిమినేట్ అయ్యారు. చివరకు గౌతమ్, నిఖిల్ టాప్-2లో నిలిచారు. ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు హోస్ట్ నాగార్జున ఇచ్చిన ఆఫర్ను ఇరువురూ తిరస్కరించారు. చివరకు స్టేజ్పై నాగార్జున నిఖిల్ను విజేతగా ప్రకటించగా, గౌతమ్ రన్నరప్గా నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్చరణ్ విజేతకు ట్రోఫీ అందించారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేశ్ భారీ మొత్తంలో Tax కట్టాల్సి ఉంది! ప్రైజ్మనీ కింద ఆయనకు ₹11.34 కోట్ల నగదు పురస్కారం దక్కినట్టు తెలుస్తోంది. దీనిపై ₹3 Cr వరకు ఆయన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇతర సర్ఛార్జ్ల కింద మొత్తంగా ₹4.67 కోట్ల వరకు Tax కట్టాల్సి ఉంటుందని నిపుణులు లెక్కగడుతున్నారు. గుకేశ్ నికర ఆస్తి ₹21 కోట్లకు పెరగడంతో 30% స్లాబ్ కింద లెక్కలేస్తున్నారు.

బ్రిస్బేన్లో వర్షం వల్ల తొలిరోజు 13.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. దీంతో స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. వారందరికీ రిఫండ్ల రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా(CA) మిలియన్ డాలర్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. నిబంధనల ప్రకారం 15 ఓవర్ల వరకూ ఆట నడిస్తే రిఫండ్ ఇవ్వనక్కర్లేదు. మరో 10 బంతుల ఆట సాధ్యమై ఉంటే CAకి ఆ మిలియన్ డాలర్లు ఆదా అయి ఉండేవి. కాగా తొలిరోజు 30,145మంది ప్రేక్షకులు ఆటకు హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.