News September 19, 2024

ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

News September 19, 2024

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దుష్ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం <<14134836>>వ్యాఖ్యలను<<>> టీటీడీ మాజీ ఛైర్మెన్ సుబ్బారెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని పునరుద్ఘాటించారు. లడ్డూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

News September 19, 2024

ఆ విష‌యంలో మాది కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రే: పాక్‌ మంత్రి

image

JKలో ఆర్టికల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలో తాము కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రితోనే ఉన్నామంటూ పాక్ రక్ష‌ణ మంత్రి ఖ‌వాజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. JKలో కూట‌మి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆర్టిక‌ల్ 370, 35A పున‌రుద్ధ‌ర‌ణ‌లో వారిది, తమది ఒకే వైఖ‌రి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్క‌డా ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌రిస్తామ‌ని చెప్ప‌లేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తుండడం గమనార్హం.

News September 19, 2024

ALERT: గోధుమ పిండి వాడుతున్నారా?

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో వందల కిలోల నకిలీ గోధుమ పిండిని అధికారులు గుర్తించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంట్లోనే నకిలీ పిండిని గుర్తించవచ్చు. మొదట ప్లేట్‌లో కొద్దిగా పిండి తీసుకోండి > అందులో నిమ్మరసం వేయండి.. నీటి బుడగలు వస్తే అది కల్తీది. గ్లాసు నీటిలో పిండిని వేసి కలపండి. పిండి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. కాస్త పిండిని నోటిలో వేసుకోండి చేదుగా ఉంటే అది కల్తీ అయినట్లే.

News September 19, 2024

యువ CA మృతిపై కేంద్రం విచారణ

image

ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్‌లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.

News September 19, 2024

అట్లీతో తప్పకుండా సినిమా చేస్తా: NTR

image

‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీతో తీసే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘అట్లీ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పారు. రొమాంటిక్ కామెడీ స్టోరీని కూడా డిస్కస్ చేశాం. తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. కానీ, తప్పకుండా ఇద్దరం కలిసి ఓ సినిమా తీస్తాం. ఆయన తీసిన రాజా-రాణి అంటే నాకెంతో ఇష్టం’ అని ఎన్టీఆర్ తెలిపారు.

News September 19, 2024

వ్యర్థాల తొలగింపుపై హైడ్రా కీలక నిర్ణయం

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆఫ్‌లైన్‌లో బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.

News September 19, 2024

జానీ మాస్టర్ అరెస్ట్.. నాగబాబు ట్వీట్లు వైరల్

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ అరెస్టు నేపథ్యంలో జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్లు చేశారు. చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్‌ను పోస్ట్ చేశారు. మీరు వినేదే నమ్మొద్దని, ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని మరో పోస్టులో పేర్కొన్నారు. దీంతో జానీకి మద్దతుగా చేస్తున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. అత్యాచార కేసు నమోదవ్వడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసింది.

News September 19, 2024

వచ్చే నెల 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. 22 వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

News September 19, 2024

బీజేపీ-కాంగ్రెస్ మ‌ధ్య లేఖ‌ల యుద్ధం

image

PM మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాయడంపై BJP అధ్యక్షుడు నడ్డా విమర్శలు గుప్పించారు. ‘మీ విఫలమైన ఉత్పత్తి(రాహుల్ గాంధీ)ని ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు. అయినా మీ రాజకీయ అవసరాలకు పాలిష్ చేసి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. అందుకే మీరు PMకి లేఖ రాశారు’ అని నడ్డా దుయ్య‌బట్టారు. రాహుల్ గాంధీ నంబ‌ర్ వ‌న్ ఉగ్ర‌వాది అని కేంద్ర మంత్రి రవ్‌నీత్ చేసిన‌ వ్యాఖ్యలను తప్పుబడుతూ PMకి ఖర్గే లేఖ రాశారు.