News September 18, 2024

రైల్లో ఫుడ్ డెలివరీ.. మరిన్ని స్టేషన్లలో ‘జొమాటో’ సేవలు

image

రైలు ప్రయాణికులకు ZOMATO తన సేవలను విస్తరించింది. ట్రైన్‌లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తోంది. 2023లో 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటివరకు 10లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకూ ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు.

News September 18, 2024

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News September 18, 2024

‘హిరోషిమా’పై జేమ్స్ కామెరూన్ మూవీ?

image

వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

News September 18, 2024

పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం

image

AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.

News September 18, 2024

ఆ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు: రంగనాథ్

image

TG: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన <<14124312>>ఆదేశాలు<<>> ‘హైడ్రా’కు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి ‘హైడ్రా’ వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు.

News September 18, 2024

వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫామ్

image

AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోనుంది.

News September 18, 2024

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయండి: TFCC

image

జానీ మాస్టర్‌‌పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) స్పందించింది. సినీ ఇండస్ట్రీలో ఇలా వేధింపులు ఎదుర్కొన్నవారు తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. హైదరాబాద్‌లోని TFCC ఆఫీస్ వద్ద ఉ.6 నుంచి రా.8 వరకు కంప్లైంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పోస్ట్‌ లేదా ఫోన్‌ 9849972280, మెయిల్‌ ఐడీ complaints@telugufilmchamber.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

News September 18, 2024

YELLOW ALERT: మళ్లీ వర్షాలు

image

TG: వారం రోజులుగా పొడి వాతావరణం ఉన్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 18, 2024

పదేళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ మూవీ

image

మాలీవుడ్ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ పదేళ్ల తర్వాత కలిసి నటించనున్నారు. మహేశ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మెజార్టీ షూటింగ్ శ్రీలంకలోనే జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత కేరళ, ఢిల్లీ, లండన్‌లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో దాదాపు 50 సినిమాలు వచ్చాయి. చివరిసారిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో నటించారు.

News September 18, 2024

నేడు జమ్మూకశ్మీర్‌లో తొలి దశ పోలింగ్

image

పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశలో ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 3,276 పోలింగ్ కేంద్రాలను EC సిద్ధం చేసింది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. INC-NC కలిసి పోటీ చేస్తుండగా, PDP, BJP, JKPM, PC, ఆప్నీ పార్టీలు విడివిడిగా బరిలో ఉన్నాయి.